Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద.. గేట్లు ఎత్తేది ఎప్పుడు..?
- శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద
- ప్రస్తుత నీటిమట్టం 853.20 అడుగులు
- ప్రస్తుత నీటి నిల్వ 87.2476 టీఎంసీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Project: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆయా ఉప నదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదలో కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. రోజురోజుకు శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయానికి 1,93,803 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాగా.. కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేయడం లేదు. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 853.20 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 87.2476 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం కొనసాగుతున్న క్రమంలో.. నీటినిల్వలు క్రమంగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
Read Also: Dowleshwaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
Also Read
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
- Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
- Mudragada Padmanabham Passes Away: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
శ్రీశైలం జలాశయం నిండడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో డ్యామ్ నిండాలంటే పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు నీరు చేరాల్సి ఉంటుంది. ప్రాజెక్టుకు సంబంధించి తాజా పరిస్థితి చూస్తే.. ఇప్పుడే గేట్లు ఎత్తే పరిస్థితి కనిపించడం లేదు. కృష్ణమ్మ మరింతగా పరవళ్లు తొక్కితేగానీ శ్రీశైలం జలాశయం నిండనుంది. అప్పుడు మాత్రమే గేట్లను ఎత్తనున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో శ్రైశైలంలో గేట్లు ఎప్పుడు ఎత్తుతారని యాత్రికులు ఎదురుచూస్తూ ఉంటారు. గేట్లు ఎత్తినప్పుడు భారీ స్థాయిలో పర్యాటకులు తరలివస్తారు.
దిగువన ఉన్న నాగార్జున సాగర్ జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. సాగర్కు 9500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా.. 9500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 503.80 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 121.38 టీఎంసీలుగా ఉంది. ఇదిలా ఉండగా.. తాజాగా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలను ప్రాజెక్టు అధికారులు నిలిపివేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Venkatesh Maha: రంగస్థలం నేను రాసిన కథ: డైరెక్టర్ వెంకటేష్ మహా
-
Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
-
Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
-
IND vs ENG 1st ODI: అక్షర్ పటేల్ మ్యాజిక్.. 258 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!