Srisailam Project: శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద.. గేట్లు ఎత్తేది ఎప్పుడు..?
- శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న భారీ వరద
- ప్రస్తుత నీటిమట్టం 853.20 అడుగులు
- ప్రస్తుత నీటి నిల్వ 87.2476 టీఎంసీలు
Srisailam Project: కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆయా ఉప నదులు కూడా జోరుగా ప్రవహిస్తున్నాయి. ఎగువ నుంచి వస్తున్న వరదలో కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. రోజురోజుకు శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. శ్రీశైలం జలాశయానికి 1,93,803 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాగా.. కుడి గట్టు జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేయడం లేదు. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 853.20 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 87.2476 టీఎంసీలుగా ఉంది. వరద ప్రవాహం కొనసాగుతున్న క్రమంలో.. నీటినిల్వలు క్రమంగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
Read Also: Dowleshwaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
శ్రీశైలం జలాశయం నిండడానికి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. పూర్తిస్థాయిలో డ్యామ్ నిండాలంటే పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు నీరు చేరాల్సి ఉంటుంది. ప్రాజెక్టుకు సంబంధించి తాజా పరిస్థితి చూస్తే.. ఇప్పుడే గేట్లు ఎత్తే పరిస్థితి కనిపించడం లేదు. కృష్ణమ్మ మరింతగా పరవళ్లు తొక్కితేగానీ శ్రీశైలం జలాశయం నిండనుంది. అప్పుడు మాత్రమే గేట్లను ఎత్తనున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో శ్రైశైలంలో గేట్లు ఎప్పుడు ఎత్తుతారని యాత్రికులు ఎదురుచూస్తూ ఉంటారు. గేట్లు ఎత్తినప్పుడు భారీ స్థాయిలో పర్యాటకులు తరలివస్తారు.
దిగువన ఉన్న నాగార్జున సాగర్ జలాశయానికి స్వల్పంగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. సాగర్కు 9500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుండగా.. 9500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 503.80 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 121.38 టీఎంసీలుగా ఉంది. ఇదిలా ఉండగా.. తాజాగా నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదలను ప్రాజెక్టు అధికారులు నిలిపివేసినట్లు సమాచారం.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!