Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story He Boarded 200 Flights In 110 Days Stole Jewellery Worth Lakhs From Fliers

Flights theft: 200 ఫ్లైట్‌లు ఎక్కాడు.. లక్షల్లో దోచేశాడు.. ఘరానా దొంగ ఎలా దొరికాడంటే..!

Published Date :May 14, 2024 , 7:06 pm
By Suresh Maddala
Flights theft: 200 ఫ్లైట్‌లు ఎక్కాడు.. లక్షల్లో దోచేశాడు.. ఘరానా దొంగ ఎలా దొరికాడంటే..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మనం ఎక్కువగా ఇళ్లల్లో దొంగతనాలు.. లేదంటే చైన్‌స్నాచింగ్‌లు.. ఇంకా లేదంటే దారి దోపిడీలు చూసుంటాం. వినుంటాం. కానీ ఓ కేటుగాడు ఏకంగా ఆకాశంలో తిరిగే విమానాలను టార్గెట్ చేసుకున్నాడు. సహజంగా విమానాల్లో బాగా ధనవంతులు, లేదంటే ఆయా రకాలైన వీఐపీలు ప్రయాణం చేస్తుంటారు. చిన్న చిన్న దోపిడీలతో ఉపయోగం లేదనుకున్నాడో.. ఏమో తెలియదు గానీ.. ఏకంగా విమానాల్లో చోరీలకు పాల్పడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఇలా లక్షల్లో దోచుకున్నాడు. కానీ పాపం పండి ఖాకీలకు చిక్కి కటకటాల పాలయ్యాడు.

రాజేష్ కపూర్ అనే వ్యక్తిని ఏకంగా 110 రోజుల్లో 200 విమానాలు ఎక్కాడు. అలా ప్రయాణాలు చేస్తూ లక్షల విలువైన ఆభరణాలను దొంగిలించాడు. అయితే గత నెలలో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌లోని రూ. 7 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయని చెప్పడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై సీసీకెమెరాలను జల్లెడ పట్టగా కొత్త తరహా చోరీని ఛేదించారు. మొత్తానికి రాజేష్ కపూర్ అనే నిందితుడ్ని అరెస్ట్ చేశారు. విచారణలో అతడు చేసిన నేరాలను పోలీసులు కక్కించారు. నిందితుడికి ఢిల్లీ పహర్‌గంజ్‌లోని రికీ డీలక్స్ అనే గెస్ట్‌హౌస్ ఉండడం విశేషం.

రాజేష్.. గత సంవత్సరం 200 విమానాలు ఎక్కినట్లుగా గుర్తించారు. 2023లో అనేక మంది ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులను దొంగిలించాడు. విమానాశ్రయాల్లో దోపిడీలు చేసేందుకు అతడు 100 రోజుల పాటు దేశంలో వేల కిలోమీటర్లు ప్రయాణించాడు. అయితే గత నెలలో హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఓ మహిళ తన హ్యాండ్‌బ్యాగ్‌లోని రూ. 7 లక్షల విలువైన ఆభరణాలు చోరీకి గురయ్యాయని చెప్పడంతో ఢిల్లీ పోలీసులు ఈ చోరీని ఛేదించారు. అలాగే తన క్యాబిన్ బ్యాగ్ నుంచి రూ. 20 లక్షల విలువైన వస్తువులు దొంగిలించబడ్డాయని యూఎస్ నుంచి వచ్చిన మరో వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తానికి పోలీసులు రంగంలోకి దిగి కొన్ని గంటల ఫుటేజీని స్కాన్ చేయగా.. రాజేష్ కపూర్ భండారం బయటపడింది. అనంతరం కేటుగాడ్ని అరెస్టు చేశారు.

నిందితుడు వృద్ధులు, మహిళా ప్రయాణీకులను లక్ష్యంగా ఎంచుకున్నాడని పోలీసులు తెలిపారు. విమానాశ్రయంలో బాధితుల ప్రవర్తనను గమనించేవాడని సీనియర్ పోలీసు చెప్పాడు. బ్యాగ్‌లోని విలువైన వస్తువుల గురించి వారిని అనుసరించేవాడన్నారు. బ్యాగేజీ డిక్లరేషన్ స్లిప్‌లోని సమాచారాన్ని తెలివిగా చదివాడని చెప్పారు. ఇక బోర్డింగ్ గేట్ దగ్గర ఎక్కువగా సంభాషించడాన్ని చూసినట్లు పోలీసులు చెప్పారు.

కనెక్టింగ్ ఫ్లైట్స్‌లో ప్రయాణించే ప్రయాణికులను రాజేష్ లక్ష్యంగా చేసుకున్నాడని ఢిల్లీ పోలీస్ డిప్యూటీ కమిషనర్ ఉషా రంగరాణి తెలిపారు. ఏప్రిల్‌లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న మహిళ ఢిల్లీలోని ఐజీఐ విమానాశ్రయం నుంచి యూఎస్‌కి కనెక్టింగ్ ఎయిర్ ఇండియా విమానం ఎక్కవలసి వచ్చింది. అదే విధంగా యూఎస్ నివాసి వర్జిందర్‌జిత్ సింగ్.. అమృత్‌సర్ నుంచి జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు ప్రయాణిస్తున్నాడు. ఢిల్లీ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్‌ ఎక్కినప్పుడు చోరీ జరిగిందని వెల్లడించారు. నిందితుడు ప్రయాణికుల పక్కనే ఉండేలా సీటు మార్చాల్సిందిగా విమానయాన సంస్థను కోరేవాడని పోలీసులు తెలిపారు.

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు సమీపంలోని ఢిల్లీ పహర్‌గంజ్‌లో రాజేష్‌కి రికీ డీలక్స్ అనే అతిథి గృహం ఉందని తెలిపారు. గెస్ట్ హౌస్ మూడవ అంతస్తులో నిందితుడు నివసించాడని.. ఇతర అంతస్తులు వినియోగదారుల కోసం వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే వడ్డీ వ్యాపారం చేస్తాడని.. అంతేకాకుండా ఢిల్లీలో మొబైల్ రిపేర్ షాప్ కూడా ఉందని పోలీసులు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 110 days
  • Boarded 200 flights
  • Fliers
  • Flights theft
  • lakhs

తాజావార్తలు

  • Akira Nandan: అకిరా నందన్ ఎంట్రీపై పవన్ కీలక వ్యాఖ్యలు

  • LPG Crisis: వంటగ్యాస్ బుకింగ్ గడువు మరోసారి పెంపు.. ఈసారి ఎన్ని రోజులంటే..

  • Hansika: ట్విస్టులు, టర్నులు.. సినిమాలకి మించి హన్సిక లవ్ స్టోరీ

  • Iran-India: భారత్‌కు శుభ పరిణామం.. హార్ముజ్ నుంచి భారీగా కదిలిన భారత్ నౌకలు

  • Oil Price Hike: వంట నూనెలపై సైతం యుద్ధం ప్రభావం.. లీటర్ ప్యాకెట్‌పై 10 రూపాయలు పెంపు!

ట్రెండింగ్‌

  • Ear Care Tips: మీ చెవుల ఆరోగ్యం మీ చేతుల్లోనే.. ఈ 4 తప్పులు అస్సలు చేయకండి.!

  • Summer Hacks : వేసవిలో వాటర్ ట్యాంకు నీరు వేడెక్కుతోందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో నీటిని చల్లగా ఉంచండి..!

  • Leica కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌, 50MP ట్రిపుల్ కెమెరాల సెటప్ తో Xiaomi 17 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP టెలిఫోటో కెమెరా, 6000mAh బ్యాటరీతో Xiaomi 17 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • 80W ఫాస్ట్ ఛార్జింగ్, 100x జూమ్ కెమెరాతో HONOR Magic V6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions