NTV Telugu Site icon

Group-1 Prelims: ఎన్నిసార్లు విఫలమవుతారంటూ టీఎస్పీఎస్సీపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

Tspsc

Tspsc

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దుపై తెలంగాణ హైకోర్టు ఇవాళ(మంగళవారం) విచారణ చేసింది. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్ష విషయంలో ఎన్నిసార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారంటూ తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు మీరే ఉల్లంఘిస్తే ఎలా అంటూ టీఎస్పీఎస్సీపై మండిపడింది. ఒకసారి పేపర్‌ లీక్‌, ఇప్పుడేమో బయోమెట్రిక్‌ సమస్య పేరుతో విద్యార్థుల జీవితాలో ఆడుకుంటున్నారంటూ హైకోర్టు విమర్శించింది.

Read Also: Nithya Menen: స్టార్ హీరో నన్ను వేధించాడు.. ఆ ఇండస్ట్రీ వలన ఎన్నో ఇబ్బందులు పడ్డా

ఉద్యోగాలు రాక నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలంగాణ హైకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. గ్రూప్‌-1 పరీక్షలో బయోమెట్రిక్‌ ఎందుకు పెట్టలేదని టీఎస్పీఎస్సీని హైకోర్టు ప్రశ్నించింది. పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ విఫలం అయ్యిందని, రెండోసారి కూడా నిబంధనలు పాటించకుండా ఎందుకు నిర్లక్ష్యం వహించిందని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షపై పూర్తి వివరాలు సమర్పించాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా, జూన్‌లో నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను క్యాన్సిల్ చేస్తూ.. ఈనెల 23న హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌కు టీఎస్‌పీఎస్సీ వెళ్లింది.

Read Also: AP Fibernet Scam: ఏపీ ఫైబర్‌ నెట్‌ స్కాం.. రూ.114 కోట్లు కొట్టేశారు

అయితే, వాస్తవానికి 11 సంవత్సరాల తర్వాత గతేడాది అక్టోబరు 16న తొలిసారి ప్రిలిమ్స్‌ ఎక్సామ్ నిర్వహించారు. ఆ తరువాత ప్రిలిమ్స్‌ ప్రశ్న పత్రాల లీకేజీ కుంభకోణం వెలుగులోకి రావడంతో కమిషన్‌ ఆ పరీక్షను రద్దు చేసింది. తరువాత మళ్లీ ఈ ఏడాది జూన్‌ 11న ప్రిలిమ్స్‌ నిర్వహించగా.. ఈ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు ఇటీవల హైకోర్టు సింగిల్‌ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రెండుసార్లు రద్దవడంతో ఇటు అభ్యర్థులతో పాటు టీఎస్పీఎస్సీ కమిషన్‌లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది.