Haryana : అక్రమ మైనింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన ఈడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana : అక్రమ మైనింగ్ కేసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద్ర పన్వార్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అరెస్టు చేసింది. అక్రమ మైనింగ్ కేసులో చాలా కాలంగా ఈడీ విచారణలో నిమగ్నమై ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా సురేంద్ర పన్వార్తో పాటు అతని సహచరుల ఇంటిపై ఈడీ దాడులు చేసింది. సురేంద్ర పన్వార్ను అరెస్టు చేసేందుకు కేంద్ర పారామిలటరీ బలగాలతో ఈడీ అక్కడికి చేరుకుంది. హర్యానా పోలీసులు నమోదు చేసిన పలు ఎఫ్ఐఆర్ల ద్వారా ఈ మనీలాండరింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. యమునానగర్తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో లీజు గడువు ముగిసినా, కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అక్రమంగా బండరాళ్లు, కంకర, ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
అంబాలాలోని ఆయన కార్యాలయం నుంచి సురేంద్ర పన్వార్ను ఈడీ అరెస్ట్ చేసింది. అంతకుముందు, ఈ ఏడాది జనవరిలో యమునానగర్, కర్నాల్, ఫరీదాబాద్లలో జరుగుతున్న అక్రమ మైనింగ్కు సంబంధించి సురేంద్ర పన్వార్, అతని సహచరుల ఇంటిపై ఈడీ దాడులు చేసింది. ఇందులో సురేంద్ర ఇంటి నుంచి ఈడీ ప్రత్యేకించి ఏమీ కనుగొనలేదు. అయితే ఐఎన్ఎల్డీ మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్ ఇల్లు , కార్యాలయం, అతని సహచరుల రహస్య స్థావరాల నుండి అక్రమ విదేశీ ఆయుధాలు, 300 కాట్రిడ్జ్లు, 100 కంటే ఎక్కువ మద్యం సీసాలు, రూ. 5 కోట్ల నగదు కనుగొనబడింది. సురేంద్ర పన్వార్, దిల్బాగ్ సింగ్ చాలా కాలంగా మైనింగ్లో భాగస్వాములుగా ఉన్నారు. సురేంద్ర పన్వర్ ఇంట్లో దాదాపు 38 గంటల పాటు ఈడీ బృందం సోదాలు చేసింది.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
- Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
రాయల్టీలు, పన్నుల వసూళ్లను సులభతరం చేయడానికి మరియు మైనింగ్ రంగాలలో పన్ను ఎగవేతను నిరోధించడానికి 2020లో హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ పోర్టల్ అయిన ‘ఇ-రావణ్’ పథకంలో జరిగిన అవకతవకలపై కూడా కేంద్ర ఏజెన్సీ విచారణ జరుపుతోంది. జూలై 2022లో, పన్వార్ తన కుటుంబ భద్రతతో సహా వ్యక్తిగత కారణాలను పేర్కొంటూ అసెంబ్లీ స్పీకర్ జ్ఞాన్ చంద్ గుప్తాకు రాజీనామాను సమర్పించారు. అనంతరం, తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తామని అసెంబ్లీ స్పీకర్ జ్ఞాన్ చంద్ గుప్తా హామీ ఇవ్వడంతో తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు సోనిపట్ ఎమ్మెల్యే తెలిపారు.
సురేంద్ర పన్వార్ ఎవరు?
సురేంద్ర పన్వార్ 2019లో కాంగ్రెస్ టిక్కెట్పై సోనిపట్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆయనపై భారతీయ జనతా పార్టీ కవిత జైన్ను పోటీకి దింపింది. సురేంద్ర పన్వార్ తన అఫిడవిట్లో అపారమైన సంపదను చూపించారు. అఫిడవిట్ ఆధారంగా, హర్యానాలోని అత్యంత సంపన్న అభ్యర్థులలో పన్వార్ కూడా ఉన్నారు. 27 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పన్వార్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
-
Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
-
Congress: బంగ్లాదేశ్ ఉదాహరణతో కాంగ్రెస్కు కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్.. ప్రధాని నివాసం ముందు నిరసనపై ఫైర్
-
Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!