Haryana : అక్రమ మైనింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యేను అరెస్ట్ చేసిన ఈడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana : అక్రమ మైనింగ్ కేసులో హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేంద్ర పన్వార్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం అరెస్టు చేసింది. అక్రమ మైనింగ్ కేసులో చాలా కాలంగా ఈడీ విచారణలో నిమగ్నమై ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో కూడా సురేంద్ర పన్వార్తో పాటు అతని సహచరుల ఇంటిపై ఈడీ దాడులు చేసింది. సురేంద్ర పన్వార్ను అరెస్టు చేసేందుకు కేంద్ర పారామిలటరీ బలగాలతో ఈడీ అక్కడికి చేరుకుంది. హర్యానా పోలీసులు నమోదు చేసిన పలు ఎఫ్ఐఆర్ల ద్వారా ఈ మనీలాండరింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. యమునానగర్తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో లీజు గడువు ముగిసినా, కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అక్రమంగా బండరాళ్లు, కంకర, ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
అంబాలాలోని ఆయన కార్యాలయం నుంచి సురేంద్ర పన్వార్ను ఈడీ అరెస్ట్ చేసింది. అంతకుముందు, ఈ ఏడాది జనవరిలో యమునానగర్, కర్నాల్, ఫరీదాబాద్లలో జరుగుతున్న అక్రమ మైనింగ్కు సంబంధించి సురేంద్ర పన్వార్, అతని సహచరుల ఇంటిపై ఈడీ దాడులు చేసింది. ఇందులో సురేంద్ర ఇంటి నుంచి ఈడీ ప్రత్యేకించి ఏమీ కనుగొనలేదు. అయితే ఐఎన్ఎల్డీ మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్ ఇల్లు , కార్యాలయం, అతని సహచరుల రహస్య స్థావరాల నుండి అక్రమ విదేశీ ఆయుధాలు, 300 కాట్రిడ్జ్లు, 100 కంటే ఎక్కువ మద్యం సీసాలు, రూ. 5 కోట్ల నగదు కనుగొనబడింది. సురేంద్ర పన్వార్, దిల్బాగ్ సింగ్ చాలా కాలంగా మైనింగ్లో భాగస్వాములుగా ఉన్నారు. సురేంద్ర పన్వర్ ఇంట్లో దాదాపు 38 గంటల పాటు ఈడీ బృందం సోదాలు చేసింది.
Also Read
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
రాయల్టీలు, పన్నుల వసూళ్లను సులభతరం చేయడానికి మరియు మైనింగ్ రంగాలలో పన్ను ఎగవేతను నిరోధించడానికి 2020లో హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ పోర్టల్ అయిన ‘ఇ-రావణ్’ పథకంలో జరిగిన అవకతవకలపై కూడా కేంద్ర ఏజెన్సీ విచారణ జరుపుతోంది. జూలై 2022లో, పన్వార్ తన కుటుంబ భద్రతతో సహా వ్యక్తిగత కారణాలను పేర్కొంటూ అసెంబ్లీ స్పీకర్ జ్ఞాన్ చంద్ గుప్తాకు రాజీనామాను సమర్పించారు. అనంతరం, తగిన భద్రతా ఏర్పాట్లు చేస్తామని అసెంబ్లీ స్పీకర్ జ్ఞాన్ చంద్ గుప్తా హామీ ఇవ్వడంతో తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు సోనిపట్ ఎమ్మెల్యే తెలిపారు.
సురేంద్ర పన్వార్ ఎవరు?
సురేంద్ర పన్వార్ 2019లో కాంగ్రెస్ టిక్కెట్పై సోనిపట్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఆయనపై భారతీయ జనతా పార్టీ కవిత జైన్ను పోటీకి దింపింది. సురేంద్ర పన్వార్ తన అఫిడవిట్లో అపారమైన సంపదను చూపించారు. అఫిడవిట్ ఆధారంగా, హర్యానాలోని అత్యంత సంపన్న అభ్యర్థులలో పన్వార్ కూడా ఉన్నారు. 27 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పన్వార్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..