Harish Rao: గోదావరి జలాలపై అన్యాయం జరుగుతే ఊరుకోం.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: తెలంగాణ భవన్లో జరిగిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రి హరీష్ రావు కేంద్రం, ఆంధ్రప్రదేశ్, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ సాధించిన పార్టీగా తమకు రాజకీయాల కంటే ముందుగా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పేర్లు మారుతున్నాయే తప్ప, గోదావరి జల ద్రోహం మాత్రం ఆగలేదని హరీష్ రావు అన్నారు. బనకచర్ల నుంచి నల్లమల సాగర్ వరకు పేర్లు మారినా దోపిడీ కొనసాగుతోందని ఆరోపించారు. “కత్తి చంద్రబాబు చేతిలో ఉంది.. పొడిచేది రేవంత్ రెడ్డి” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బనకచర్లపై సమావేశానికి వెళ్లబోమని చెప్పి వెళ్లారని, ఇది అంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతోందని అన్నారు.
Also Read
- Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
- Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
- Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
- Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
ఆంధ్రప్రదేశ్ ఒత్తిడి వల్లే ఈరోజు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణకు నష్టం చేసే ఈ సమావేశానికి ఎందుకు హాజరవుతున్నారు? అంటూ ప్రశ్నించారు. గతంలో తాను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత తేదీలు మార్చి ఉత్తరాలు రాసిన ఉదాహరణలు ఉన్నాయని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం కుంభకర్ణుడిలా మొద్దు నిద్రలో ఉందని విమర్శించారు. తెలంగాణ బృందానికి నాయకత్వం వహిస్తున్న ఆదిత్య నాథ్ దాస్ గతంలో తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి ఎలా తెలంగాణ తరఫున సమావేశానికి నాయకత్వం వహిస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో మరో ఇరిగేషన్ అధికారి దొరకలేదా అంటూ మంది పడ్డారు. ఈ విషయాన్ని “దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లుగా ఉంది” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ నీటి హక్కులను మొత్తంగా ఆంధ్రప్రదేశ్కు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని హరీష్ రావు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఢిల్లీలో జరగబోయే సమావేశాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు వెళితే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రశంసించిందని హరీష్ రావు గుర్తు చేశారు. ఈ విషయంపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మాట్లాడాలని కోరారు.
ఇంకా “కేసీఆర్ నీటిని ఒడిసి పట్టుకుంటే.. రేవంత్ రెడ్డి నీటిని ఏపీకి జారవిడుస్తున్నారు” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీని తక్షణమే రిపేర్ చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
-
Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
-
Kerala: వ్యాయామానికి మతం రంగు.. కేరళలో వివాదంగా ‘‘ఇస్లామిక్-ఫ్రెండ్లీ జిమ్’’..
-
Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
-
E85 Fuel: E85 ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!