Harish Rao : ఎవరు అవునన్నా కాదన్నా మూడోసారి బీఆర్ఎస్ విజయం ఖాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుస్నాబాద్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. హుస్నాబాద్ లోని కార్యకర్తల మీద నమ్మకంతో సీఎం కేసీఆర్ హుస్నాబాద్ లో మొదటి ఎన్నికల సభ పెడుతున్నారన్నారు. హైదరాబాద్ కు ఈశాన్యంలో ఉన్న హుస్నాబాద్ కలిసి వచ్చిన నియోజకవర్గమని సీఎం కేసీఆర్ అన్నారన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా మూడోసారి బిఆర్ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు హరీష్ రావు. ఆసత్య సర్వేల పేరిట అధిరంలోకి వస్తామని కాంగ్రెసోల్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దాయనియ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు హరీష్ రావు.
Also Read : Ganapath trailer: కొత్త ప్రపంచంలోకి తీసుకు వెళ్లిన టైగర్ ష్రాఫ్ గణపధ్ ట్రైలర్
Also Read
- ‘SRHకు ఏమైనా మైండ్ ఉందా.. గెలిచే మ్యాచ్ను పోగొట్టుకున్నారు.. వారిద్దరి వల్లే మ్యాచ్ పోయింది’
- TMC: మమతా పార్టీకి వరుస దెబ్బలు.. టీఎంసీ కీలక నేత సంచలన నిర్ణయం
- Siddaramaiah: ప్రసక్తే లేదు.. అక్కడికి వెళ్లబోను.. తేల్చి చెప్పిన సిద్ధరామయ్య
- Japan-Mangoes: అన్నదాతలకు జపాన్ షాక్.. సీజన్లో భారత మామిడిపండ్లపై నిషేధం
అంతేకాకుండా.. ‘కాంగ్రెసోల్లు ఢిల్లీలో ఎక్కువ, గల్లీలో తక్కువ, మాటలు, ముఠాలు, మూటలు, మంటలు కాంగ్రెస్ పార్టీ తీరు. హుస్నాబాద్ ప్రాంతంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి కాకుండా కాంగ్రెస్, బిజెపి వాళ్లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ హుస్నాబాద్ ఇచ్చిన గొప్ప వరం. ఈ నెల 15న బిఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుంది. 2009లో మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఏ ఒక్క పని చేయలేదు. 2004లో తెలంగాణ ఇస్తామని టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ తర్వాత తెలంగాణ ఇవ్వకుండా టిఆర్ఎస్ పార్టీని మింగేయాలని చూసింది. మూడు గంటలు, మీటర్లు పెడతామంటున్న కాంగ్రెస్, బిజెపి వాళ్ళు మంచివాళ్ళ, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మంచోడా రైతులు ఆలోచించుకోవాలి.
Also Read : Visakhapatnam: అప్పికొండ బీచ్ యువతి కేసులో మరో ట్విస్ట్.. అసలేం జరిగిందంటే..
కాంగ్రెస్ సంస్కృతి ముఠాల సంస్కృతి, టికెట్ల కోసం కుస్తీలు పట్టుకుంటున్నారు. తెలంగాణ పథకాలను దేశం మొత్తం అమలు చేస్తున్నారు. ఒకప్పుడు తిండి లేని తెలంగాణ ఈ రోజు దక్షిణ భారత దేశ ధాన్య బండాగారంగా మారింది. వరి ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలో నెంబర్ వన్ అయింది. కైలాసంలో పెద్ద పాము మింగినట్టు తప్పిపోయి కాంగ్రెస్ వాళ్ళ చేతిలో పడితే తెలంగాణ కింద పడుతుంది. ఈనెల 15న హుస్నాబాద్ లో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు 3 గంటలకు ప్రజలను తీసుకువస్తే, 4 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారు.’ అని మంత్రి హరీష్ రావు అన్నారు.
తాజావార్తలు
-
Leader Movie OTT : దేశాన్ని కాపాడే స్పై యాక్షన్ ఏజెంట్ గా ‘లెజెండ్’ శరవణన్… ఈ సారి రచ్చ రచ్చే.!
-
‘SRHకు ఏమైనా మైండ్ ఉందా.. గెలిచే మ్యాచ్ను పోగొట్టుకున్నారు.. వారిద్దరి వల్లే మ్యాచ్ పోయింది’
-
TMC: మమతా పార్టీకి వరుస దెబ్బలు.. టీఎంసీ కీలక నేత సంచలన నిర్ణయం
-
Siddaramaiah: ప్రసక్తే లేదు.. అక్కడికి వెళ్లబోను.. తేల్చి చెప్పిన సిద్ధరామయ్య
-
Nara Lokesh : మహిళలకు రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
భారత్లో Sony BRAVIA 7 II RGB Mini LED 4K టీవీల లాంచ్.. అద్భుత ఫీచర్లతో సరికొత్త సిరీస్.!
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!