NTV Telugu Site icon

Harish Rao : కాంగ్రెస్‌ది ప్రజాపాలన కాదు గుండా రాజ్యం నడుస్తుంది

Harish Rao

Harish Rao

మెదక్ జిల్లాలోని గోమారంలోని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంలో మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. హరీష్‌ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సునీతా ఇంటిపై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు గుండా రాజ్యం నడుస్తుందన్నారు. మొన్న సిద్దిపేటలో నా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగిందని, నిన్న కౌశిక్ రెడ్డిపై, అర్థరాత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి జరిగిందని హరీష్‌ రావు మండిపడ్డారు. బీహార్, రాయలసీమ ఫ్యాక్షన్ లా రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నాడని హరీష్‌ రావు విమర్శించారు. నిన్న జరిగిన దాడి కాంగ్రెస్ నాయకులు ప్రోత్సహించిందే…ఉద్దేశపూర్వకంగా నే మాపై దాడి చేశారని ఆయన మండిపడ్డారు. ఎస్పీ, ఐజీతో మాట్లాడను వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా అని, వీడియోలు తీస్తున్న హెడ్ కానిస్టేబుల్ పై కూడా కాంగ్రెస్ న్నాయకులు దాడి చేశారన్నారు హరీష్ రావు.

Kashi: తిరుపతి లడ్డు తిన్నందుకు.. సనాతన పద్ధతిలో శుద్ధి.. ప్రక్రియ ఇదే!

ఒకప్పుడు తెలంగాణ పోలీసులు మంచిగా పని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా పని చేస్తున్నారని, గోమారంలో కాంగ్రెస్ గుండాలను వెంటనే అరెస్ట్ చేయాలి…వాళ్లపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని హరీష్‌ రావు డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై అవసరం అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని, కోర్టు మెట్లు ఎక్కుతాం…మా ఓపికకి కూడా హద్దు ఉంటుందన్నారు హరీష్‌ రావు. ఓపికపోతే రాయలసీమ తరహా ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలవుతాయని, డీజీపీ ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. డీజీపీ స్పందించకపోతే BRS ఎమ్మెల్యేలు అందరం డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.

Silk Smitha Special : “మూతపడిన మత్తు కళ్ళు”..