Breaking… Harirama Jogaiah: పవన్ సూచించారు.. హరిరామజోగయ్య దీక్ష విరమించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష విరమించారు మాజీ మంత్రి హరిరామ జోగయ్య. దీక్ష విరమించాలని పవన్ కళ్యాణ్ కోరారు. దీంతో పవన్ సూచన మేరకు దీక్ష విరమిస్తున్నానని ప్రకటించారు హరిరామ జోగయ్య. అంతకుముందు మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్యతో మాట్లాడాను… ఇది మూర్ఖపు, మొండి ప్రభుత్వం… కాపులకు రిజర్వేషన్లను వేరే విధంగా సాధించుకుందామని జోగయ్యకు చెప్పాను… జోగయ్య లాంటి వ్యక్తుల సలహాలు.. అనుభవం అవసరం అన్నారు పవన్ కళ్యాణ్.దీక్ష విరమించాలని జోగయ్యకు పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారు. జోగయ్యకు నచ్చ చెప్పిన పవన్… దీక్ష విరమించాలని కోరారు. అన్ని రకాలుగా ఆలోచించి కార్యాచరణ రూపొందిద్దామని జోగయ్యకు పవన్ సూచించారు.
Read Also: Ajith: అజిత్ కూతురు అప్పుడే ఇంత పెద్దది అయిపోయిందా.. హీరోయిన్ లా ఉందే
Also Read
- Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
మందులు కూడా వేసుకోకుండా నిరాహార దీక్షకు దిగడం బాధ కలిగిస్తోందన్నారు పవన్. ఒక్కసారిగా ఇంతటి సాహసం చేస్తే ఎలా అంటూ జోగయ్యకు పవన్ బుజ్జగించారు. పవన్ సీఎం కావాలి.. పవన్ ద్వారా రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నదే తన కోరికన్నారు జోగయ్య. తాను వచ్చి జోగయ్యను కలుస్తానన్నారు పవన్. జోగయ్య మార్గ దర్శకత్వం వహించాలన్నారు పవన్. సీఎం జగన్ దిగి రావాలన్నదే తన ఆ ఆలోచనన్న జోగయ్య… పవన్ సూచనకు సానుకూలంగా స్పందించారు. దిగిరావాలంటే రాజకీయంగా ఆలోచన చేద్దామన్నారు పవన్. ఆమరణ దీక్షల్లాంటివి వద్దన్న జనసేనాని… కనీసం దీక్షకు విరామం ప్రకటించాలని జోగయ్యను కోరారు పవన్ కళ్యాణ్.
ఇదిలా ఉంటే.. పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్లో జోగయ్యను ఏలూరు ఆస్పత్రికి తరలించడంపై కాపు నాయకుల నిరసన గళం వినిపించారు. హరిరామజోగయ్య దీక్షకు మద్దతు తెలుపుతూ తక్షణమే జోగయ్య డిమాండ్ చేసిన ఐదు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. జోగయ్య నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు కాసేపట్లో చేగొండి హరిరామ జోగయ్య ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కానున్నారు.
Read Also: Russia-Ukraine War: రష్యాను చావుదెబ్బ కొట్టిన ఉక్రెయిన్.. మిస్సైళ్లతో దాడి.. 400మంది మృతి
తాజావార్తలు
-
Dil Raju: ‘సినిమాల్లో ఫెయిలైతే మళ్లీ అక్కడికే వెళ్లిపోయే వాడిని..’: ప్రొడ్యూసర్ దిల్ రాజు
-
Mahabharata: మహాభారతంలో ఐదుగురు వీరుల మరణం.. ధర్మరక్షణకు ‘‘శ్రీకృష్ణుడి’’ మాస్టర్ ప్లాన్.!
-
Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..