Hardik Pandya Gambhir Fight: హార్దిక్-గంభీర్ గొడవపడ్డారా? వైరల్గా మారిన వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Gambhir Fight: పంజాబ్ ముల్లాన్పూర్లో జరిగిన టీ20 సిరీస్లోని రెండో మ్యాచ్లో భారత్ 51 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైంది. దీంతో భారత్ సిరీస్ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు పెద్ద మొత్తంలో పరుగులు సమర్పించుకున్నారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు ప్రదర్శన అధ్వాన్నంగా ఉండటంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మరోసారి విమర్శలకు గురయ్యాడు. ఇదే సమయంలో గంభీర్ – హార్దిక్ పాండ్యాలకు సంబంధించిన ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజానికి ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
READ ALSO: Vissannapeta Financial Scam: నమ్మించి నట్టేట ముంచిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సంస్థ
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
గంభీర్ – పాండ్య గొడవపడ్డరా..
నిజానికి ముల్లాన్పూర్ మైదానంలో ఓటమి తర్వాత భారత డ్రెస్సింగ్ రూమ్లో ఉద్రిక్తతలు కనిపించాయి. మ్యాచ్ తర్వాత నుంచి పలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ – టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మధ్య జరిగిన వాడివేడి సంభాషణను చూపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేసిన కొంతమంది అభిమానులు, భారత ఓటమి తర్వాత గౌతమ్ గంభీర్ – హార్దిక్ పాండ్యా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని పేర్కొన్నారు. అయితే ఈ వీడియోలో ఆడియో లేకపోవడం కారణంగా వాళ్లిద్దరూ దేని గురించి చర్చిస్తున్నారో అర్థం కాలేదు.
రెండో మ్యాచ్లో 214 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు 162 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ తన ఖాతా తెరవలేకపోయాడు. మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అక్షర్ పటేల్ 21 బంతుల్లో 21 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా 5 పరుగులకే వెనుదిరిగాడు. ఇక హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తిలక్ వర్మ ఒక్కడు 62 పరుగులతో వీరోచితంగా పోరాడిన, అప్పటికే చాలా ఆలస్యం అయింది. అయితే ఆశ్చర్యకరంగా ఈ మ్యాచ్లో కొంతమంది బ్యాట్స్మెన్లు మాత్రమే వారి వారి సాధారణ స్థానాల్లో ఆడారు. దీంతో టీమిండియా ఓటమిలో ఈ కారణం కూడా కీలకంగా మారిందని క్రికెట్ పండితులు చెబుతున్నారు.
ధర్మశాలలో 3వ మ్యాచ్..
ఈ రెండు జట్ల మధ్య మూడో మ్యాచ్ డిసెంబర్ 14న ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకం. ఈ మ్యాచ్లో టీమిండియా బలమైన పునరాగమనం చేయాలని చూస్తోంది.
Heated conversation between Hardik and Gambhir 👀pic.twitter.com/VtISwnS2FN
— Amar💫 (@KUNGFU_PANDYA_0) December 12, 2025
READ ALSO: AP Chambers Business Expo: భారత్ వైపు ప్రపంచం చూస్తోంది: మంత్రి కొండపల్లి
తాజావార్తలు
-
Vijay Deverakonda: సేవా కార్యక్రమాలతో మరోసారి మనసులు గెలిచిన విజయ్.. రాజకీయాలపై కొత్త చర్చకు కారణమయ్యారా?
-
Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. బాస్ ఎవరో నెతన్యాహుకు తెలుసు..!
-
Bhadra Rajyoga 2026: జూలై 7 నుంచి ఈ మూడు రాశుల అదృష్టం మారనుందా? బుధుడి సంచారం వల్ల ఎవరికి ఎక్కువ లాభం?
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!