Hardeep Nijjar killing: నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్టుపై స్పందించిన విదేశాంగ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardeep Nijjar killing: కెనడాలో ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయులను అరెస్టు చేశారు. ఇప్పుడు దీనిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. ఖలిస్తాన్ మద్దతుదారు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై కెనడాలో ఏం జరిగినా వారి అంతర్గత రాజకీయాలే ఎక్కువగా ఉన్నాయని జైశంకర్ అన్నారు. ఈ విషయంలో భారత్కు ఎలాంటి సంబంధం లేదని జైశంకర్ అన్నారు ఎలాంటి ఆధారాలు లేకుండా భారత్ తప్పు చేసిందని కెనడా ఆరోపిస్తోందని జైశంకర్ అన్నారు. వాస్తవానికి, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వంతో ముగ్గురు నిందితులకు ఉన్న సంబంధాలపై కెనడియన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఎస్ జైశంకర్ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
Read Also: Punjab: గురుద్వారాలో పవిత్ర గ్రంథం పేజీలు చింపేశాడని.. యువకుడిని కొట్టి చంపేశారు..
Also Read
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
అరెస్టయిన ముగ్గురు భారతీయులకు సంబంధించిన సమాచారాన్ని కెనడా పోలీసులు పంచుకునే వరకు భారత్ వేచి చూస్తుందని జైశంకర్ చెప్పారు. అరెస్టుల నివేదికలను తాను చూశానని, అనుమానితులు ఒకరకమైన ముఠా నేపథ్యం ఉన్న భారతీయులేనని, పోలీసుల నుంచి అప్డేట్ కోసం వేచి ఉండాల్సి ఉంటుందని మంత్రి అన్నారు. భారతదేశంలో, ముఖ్యంగా పంజాబ్లో వ్యవస్థీకృత నేరాలను కెనడా నుంచి ఆపరేట్ చేయడానికి అనుమతిస్తున్నారని మేము చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేశామని విదేశాంగ మంత్రి అన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి విదేశాలతో సహా వివిధ రంగాలలో మరిన్ని సంస్కరణలు తీసుకురావడానికి నరేంద్ర మోడీ వంటి బలమైన, చురుకైన ప్రధానమంత్రి అవసరమని ఎస్ జైశంకర్ అన్నారు. కెనడా ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుంటున్న ఖలిస్థాన్ అనుకూల వర్గం ప్రజలు లాబీని సృష్టించి ఓటు బ్యాంకుగా మారుతున్నారని విదేశాంగ మంత్రి అన్నారు. కెనడాలో అధికార పార్టీకి పార్లమెంటులో మెజారిటీ లేదని, కొన్ని పార్టీలు ఖలిస్థాన్ అనుకూల నేతలపై ఆధారపడి ఉన్నాయని జైశంకర్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!