Harassment: సైకిల్పై వెళ్తున్న విద్యార్థినిపై వేధింపులు.. ఆ తర్వాత ఏమైందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్ లో రెండ్రోజుల క్రితం జరిగిన సంఘటనే మరొకటి జరిగింది. మొన్న అంబేద్కర్ నగర్ లో చోటు చేసుకోగా.. ఇప్పుడు మొరాదాబాద్ జిల్లాలో జరిగింది. పాఠశాల నుండి ఇంటికి వెళ్తున్న విద్యార్థినిని.. ఆగంతకులు వేధించారు. దీంతో విద్యార్థిని నిరసన వ్యక్తం చేయడంతో.. దుండగులు అక్కడి నుండి పారిపోయారు. అనంతరం విద్యార్థిని ఇంటికి వెళ్లే మార్గంలో.. మళ్లీ విద్యార్థిని వెంబడించారు. అంతేకాకుండా.. తన సైకిల్ను అతి వేగంతో ఢీకొట్టారు. దీంతో విద్యార్థిని కింద పడిపోగా.. బైక్పై నుంచి వచ్చి విద్యార్థినిపై పదునైన ఆయుధంతో దాడి చేసి పరారయ్యారు. దీంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని రోడ్డుపైనే పడి ఉండటంతో.. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి.. తన కారులో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఆ విద్యార్థిని చికిత్స పొందుతోంది.
Road Accident: కెనాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. 8 మంది మృత్యువాత
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
వివరాల్లోకి వెళ్తే.. ఈ సంఘటన కాంత్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గత సోమవారం 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని స్కూల్ నుంచి ఇంటికి వెళుతుండగా.. కొందరు యువకులు బైక్పై వచ్చి ఆమెను వెంబడించి వేధించారు. అంతేకాకుండా.. బైక్ తో ఆమె సైకిల్ను ఢీకొట్టడంతో విద్యార్థిని కిందపడిపోయింది. దీంతో ఓ యువకుడు ఆమెపై బలవంతంగా దాడికి యత్నించాడు. ఆ సమయంలో విద్యార్థిని నిరసన వ్యక్తం చేయడంతో.. యువకుడు బాలికపై కత్తితో దాడి చేశాడు. దీంతో విద్యార్థిని మెడ, ముఖంపై గాయమైంది.
Bandi Sanjay: మహిళా బిల్లు విషయంలో ఆ రెండు పార్టీలు ద్వంద్వ వైఖరి మార్చుకోవాలి..
ప్రస్తుతం బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. గుర్తు తెలియని యువకుడిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఎస్ఎస్పీ హేమ్రాజ్ మీనా మాట్లాడుతూ.. విద్యార్థినిపై వేధింపుల కేసు వెలుగులోకి వచ్చిందని తెలిపారు. గుర్తు తెలియని నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. బాలిక తల్లిదండ్రులు ఇద్దరు యువకులపై అనుమానం వ్యక్తం చేశారు. నిందితులను త్వరలో పట్టుకుంటామని.. విద్యార్థినిని విచారించగా కొందరి పేర్లు చెప్పినట్లు తెలిపారు. వారిని అరెస్టు చేసి జైలుకు పంపేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారని ఎస్ఎస్పీ హేమ్రాజ్ మీనా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!