Bihar : డీజే ట్రాలీకి తాకిన విద్యుత్ వైర్.. తొమ్మిది మంది మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar : బీహార్లోని హాజీపూర్లో విద్యుదాఘాతం కారణంగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డీజేకు 11 వేల వోల్టుల వైర్ తగిలి విద్యుదాఘాతానికి గురై 9 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. ప్రమాదం తర్వాత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ చేసినా విద్యుత్ శాఖ ఉద్యోగులు వెంటనే సరఫరా ఆపలేదని వారు ఆరోపిస్తున్నారు. సరఫరా ఆపి ఉంటే చాలా మంది ప్రాణాలను కాపాడి ఉండేవారు.
Read Also:Rajanna Temple: మొట్టమెదటి సారి రాజన్న ఆలయంలో బ్రేక్ దర్శనాలు.. నేటి నుంచి అమలు..
Also Read
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Riyan Parag: ఆ ఒక్కటే మా ఓటమిని శాసించింది.. రాజస్థాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.!
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- Astrology: మే 30 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
కన్వారియాలను తీసుకుని వెళ్తున్న డీజే ట్రాలీకి విద్యుదాఘాతం జరిగినట్లు హాజీపూర్ ఎస్డిపిఓ ఓంప్రకాష్ తెలిపారు. విద్యుత్ షాక్ తో దాదాపు తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది క్షతగాత్రులను సదర్ ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటన హాజీపూర్లోని ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడి చేరుకున్నారు. వైశాలి జిల్లాలోని హాజీపూర్-ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో రాత్రి 11:00 గంటలకు శివభక్తులు గ్రామం నుండి ఊరేగింపుగా బయలుదేరారు. ఫుల్ డీజే సౌండ్ తో వెళ్తున్న సమయంలో డీజే ట్రాక్టర్ ట్రాలీకి హైటెన్షన్ వైర్లు తగలడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కన్వారియాలు అక్కడికక్కడే మరణించగా మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల సహాయంతో క్షతగాత్రులందరినీ హాజీపూర్ లోని సదర్ ఆసుపత్రికి తరలించారు.
Read Also:Cybercrime: మీ ఫోన్ కి ఈ సందేశం వస్తే వెంటనే డిలీట్ చేయండి..లేదంటే అకౌంట్ ఖాళీ!
ఇండస్ట్రియల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్పూర్ ప్రజలు సాధారణంగా ఈ మాసంలోని మూడో సోమవారం శివుడి మొక్కుల నిమిత్తం =సోన్పూర్లోని పహెల్జా ఘాట్కు వెళ్తున్నారని గ్రామస్తులు తెలిపారు. ఈ సమయంలో అందరూ డీజే సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ చేశారు. ఇంతలో అకస్మాత్తుగా డీజే 11 వేల బోల్ట్ వైర్ తగలడంతో విద్యుదాఘాతంతో 9 మంది తీవ్రంగా కాలిపోయి మృతి చెందారు. పలువురు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన అనంతరం విద్యుత్ శాఖకు ఫోన్ చేసి లైన్ కట్ చేయమని కోరారు. కానీ అయితే అప్పటికి 9 మంది చనిపోయారని స్థానికులు తెలిపారు. మరణించిన వారిలో నలుగురు సుల్తాన్పూర్ గ్రామానికి చెందినవారు కాగా, మిగిలిన ఐదుగురు నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాధువా బధాయి తోలా నివాసితులు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.
తాజావార్తలు
-
Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
-
Riyan Parag: ఆ ఒక్కటే మా ఓటమిని శాసించింది.. రాజస్థాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.!
-
Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
-
Vaibhav Sooryavanshi: ఆరెంజ్ క్యాప్తో కన్నీళ్లు దాచుకుంటూ.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
-
Astrology: మే 30 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..