Election Commissioners: ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanesh Kumar and Sukhbir Singh Sandhu: కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా (Election Commissioners) రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సుఖ్బీర్ సింగ్ సంధూ ( Sukhbir Singh Sandhu), జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar)లను ప్రధాని మోడీ కమిటీ నిన్న ( గురువారం ) నియమించింది. అయితే, తాజాగా వీరు ఈసీఐలో జాయిన్ అయ్యారు. కమిషనర్లుగా ఇవాళ (శుక్రవారం) ఉదయం అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘానికి రాజీవ్ కుమార్ చీఫ్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కమిషనర్గా ఉన్న అనూప్ చంద్ర పాండే గత నెలలో పదవీ విరమణ చేశారు.. మరో కమిషనర్ అరుణ్ గోయెల్ ఇటీవలే అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో కొత్త కమిషనర్ల నియామకాన్ని గురువారం నాడు ప్రధాని మోడీ నేతృత్వంలో సమావేశమైన కమిటీ సుఖ్బీర్ సింగ్ సింధూ, జ్ఞానేశ్ కుమార్లను ఎంపిక చేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. తాజాగా వీరు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలను చేపట్టారు.
Read Also: Anasuya : కుల్ఫీతో అనసూయ క్యూట్ సెల్ఫీ.. ఆడుకుంటున్నారుగా..!
Also Read
- Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
- MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
ఇక, ఈ ఇద్దరూ 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు కేరళ రాష్ట్రానికి చెందిన జ్ఞానేశ్ కుమార్, ఉత్తరాఖండ్కు చెందిన సుఖ్బీర్ సింగ్ సంధూ.. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసిన సందర్భంలో జ్ఞానేశ్ కుమార్ హోంమంత్రిత్వ శాఖలో సేవలు అందించారు.. సుశ్ బీర్ సింగ్ గతంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. కాగా, ఎన్నికల కమిషనర్ల ప్రకియపై ఎంపిక కమిటీలో సభ్యుడైన కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధరీ వీరి ఎంపికపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసీ కమిషనర్ల ఎంపిక ప్రక్రియపై సుప్రీంలో నేడు విచారణ జరగబోతుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక కమిటీ నుంచి సీజేఐని తప్పించి ఆ స్థా నంలో క్యాబినెట్ మంత్రిని చేర్చటాన్ని సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పలు పిటిషన్లు నమోదు అయ్యాయి.
Two newly-appointed Election Commissioners, Gyanesh Kumar and Dr Sukhbir Singh Sandhu joined the Commission today: ECI pic.twitter.com/N5ZXd4RxQQ
— ANI (@ANI) March 15, 2024
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!