18వ లోక్సభకు ఎన్నికైన సభ్యుల పేర్లను నేడు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధుతో కలిసి రాష్ట్రపతిని కలుసుకుని ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 73 ప్రకారం ఈసీఐ జారీ చేసిన సాధారణ ఎన్నికల తర్వాత లోక్సభకు ఎన్నికైన సభ్యుల పేర్లు కాపీని ఆమెకు సమర్పించారు. AIADMK: ఎన్డీయే నుంచి బయటకు రావడానికి అన్నామలై…
కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా (Election Commissioners) రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సుఖ్బీర్ సింగ్ సంధూ ( Sukhbir Singh Sandhu), జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar)లను ప్రధాని మోడీ కమిటీ నిన్న ( గురువారం ) నియమించింది. అయితే, తాజాగా వీరు ఈసీఐలో జాయిన్ అయ్యారు. కమిషనర్లుగా ఇవాళ (శుక్రవారం) ఉదయం అధికారికంగా బాధ్యతలు తీసుకున్నారు.
Election Commissioners: భారత ఎన్నికల సంఘం ప్యానెల్లో ఖాళీగా ఉన్న రెండు ఎన్నికల కమిషనర్ల స్థానాలకు బ్యూరోక్రాట్లు సుఖ్బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్లను ఎంపిక చేసినట్లు లోక్సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఈ రోజు తెలిపారు.