Vana Mahotsavam 2025: పెట్రోల్ బంక్లలో ఫ్రీగా సీడ్ బాల్స్.. 18 కోట్ల మొక్కలు టార్గెట్!
- విజయంవంతంగా 'వన మహోత్సవం' 2025 కార్యక్రమం
- పరిగిలో 2000 సీడ్ బాల్స్ చల్లిన జైలు శాఖ అధికారులు
- రాష్ట్ర వ్యాప్తంగా 18 కోట్ల మొక్కలు టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jail Department Distribution Seed Ball in Parigi: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘వన మహోత్సవం’ 2025 కార్యక్రమం విజయంవంతంగా ముందుకు సాగుతోంది. వికారాబాద్ జిల్లా పరిగి జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పరిగి సబ్ జైలు సూపర్ఇండెంట్ రాజ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు పరిగి ప్రాంత శివారులో నేషనల్ హైవే 163 రోడ్డుకి ఇరు వైపుల ఖాళీగా ఉన్న బీడు భూములలో జైలు శాఖ అధికారులు 2000 సీడ్ బాల్స్ చల్లారు. సీడ్ బాల్స్ చల్లడం అనేది తక్కువ శ్రమతో ఎక్కువ విస్తీర్ణంలో మొక్కలు నాటే కార్యక్రమం.
సీడ్ బాల్స్లో ఉండే విత్తనాలు వర్షా కాలంలో వర్షాన్ని వినియోగించుకొని.. మొక్కలుగా, ఆ మొక్కలు వృక్షాలుగా మారుతాయని సూపర్ఇండెంట్ రాజ్ కుమార్ తెలిపారు. ఈ సీడ్ బాల్స్కు నిర్దేశించిన ప్రదేశమని కాకుండా.. ఎక్కువ విస్తీర్ణం ఆక్రమించుకుని మొక్కలుగా మారే అవకాశం ఉందన్నారు. ప్రత్యక్షంగా మొక్కలు నాటే అవకాశం లేని చోట కూడా ఈ సీడ్ బాల్స్ ద్వారా మనం పరోక్షంగా మొక్కలు నాటవచ్చునని చెప్పారు. ఈ సీడ్ బాల్స్ ద్వారా మనం కృత్రిమ పద్దతిలో సహజ అడవులను కూడా సృష్టించవచ్చు అని తెలిపారు.
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
Also Read: MLA Sri Ganesh: ఎమ్మెల్యే శ్రీ గణేశ్పై దాడి.. పోలీసుల దర్యాప్తు వేగవంతం!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జైళ్ల శాఖ ఇప్పటివరకు 2 లక్షల సీడ్ బాల్స్ తయారు చేసి చల్లడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జైళ్ల పెట్రోల్ బంక్లలో సీడ్ బాల్స్ని ఉచితంగా పంపిణి చేస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించాలనే సంకల్పంతో చేపట్టిన వన మహోత్సవం 2025 కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఏ నెల ఆరంభంలో ప్రారంభించారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 18 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!