Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Guntur Girl Missing Case: మరోసారి ఆంధ్రప్రదేశ్ పోలీసులపై సీరియస్ అయ్యింది హైకోర్టు.. గుంటూరులో పదో తరగతి చదువుతున్న బాలిక అదృశ్యమైన ఘటనపై విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలిక అదృశ్యమై ఇప్పటికే 80 రోజులు గడిచినా ఆమె ఆచూకీ కనుగొనలేకపోవడంపై ధర్మాసనం పోలీసు శాఖను, ప్రభుత్వాన్ని నిలదీసింది. కేసు విచారణ సందర్భంగా నిన్న హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అదృశ్యమైన బాలికను ఇవాళ తమ ముందు హాజరుపరచాలని డీజీపీని ఆదేశించింది. అయితే, ఇవాళ విచారణకు బాలికను ధర్మాసనం ముందు హాజరుపరచడంలో పోలీసులు విఫలమయ్యారు. దీంతో “డీజీపీకి మేము ఇచ్చిన ఆదేశాలు అర్థమవుతున్నాయా లేదా?” అంటూ ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన ధర్మాసనం.. సిట్ ఏర్పాటు చేశారంటే గుంటూరు పట్టాభిపురం పోలీసులు బాలిక ఆచూకీ కనుగొనడంలో విఫలమైనట్లేనా అని ప్రశ్నించింది. ఆచూకీ కనిపెట్టడంలో విఫలమైన అధికారులనే సిట్లో నియమిస్తే ప్రయోజనం ఏమిటని ప్రభుత్వాన్ని నిలదీసింది. బాలిక ఆచూకీ కోసం ఏర్పాటు చేసిన సిట్లో మొత్తం తొమ్మిది మంది అధికారులు ఉండగా, వారిలో ఏడుగురు ఇప్పటికే బాలిక ఆచూకీ కనుగొనడంలో విఫలమైన అధికారులేనని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తులో విఫలమైన అధికారులకే మళ్లీ బాధ్యతలు అప్పగించడం సరైన విధానం కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Also Read
- Venkaiah Naidu: ‘ఇష్టపడి పని చేయండి.. నష్టపోవడం ఉండదు’.. పట్టభద్రులకు వెంకయ్య సందేశం
- Ambati Rambabu: ఏఐ వీడియో వివాదంలో అంబటి రాంబాబు.. కేసు నమోదు..
- Mudragada Padmanabham సంతాప సభలో ఆసక్తికర దృశ్యం.. ఆలింగనం చేసుకున్న బోండా ఉమ, అంబటి రాంబాబు.!
- Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
“పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరి పని వాళ్లు సక్రమంగా చేస్తే ప్రజలు ఎందుకు కోర్టును ఆశ్రయిస్తారు?” అని హైకోర్టు ప్రశ్నించింది. పోలీసులు సక్రమంగా పనిచేయకపోవడం వల్లే బాధితులు, వారి కుటుంబాలు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాల్సి వస్తోందని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బాలికను సోమవారం వరకు హైకోర్టు ముందు హాజరుపరిచేందుకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. సోమవారం నాటికి అదృశ్యమైన బాలికను కోర్టు ముందు హాజరుపరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో సోమవారం డీజీపీ స్వయంగా హైకోర్టుకు హాజరు కావాలని ధర్మాసనం ఆదేశించింది.
ఇప్పటికే బాలిక అదృశ్యమై 80 రోజులు గడిచినా ఆచూకీ కనుగొనలేకపోయిన అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. కంటి తుడుపు చర్యలు చేపట్టవద్దని పోలీసులను గట్టిగా హెచ్చరించింది. బాలిక అసలు ఎక్కడ ఉంది? ఆమె సురక్షితంగా ఉందా లేదా? అనే విషయాలపై తల్లిదండ్రులకు ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. బాలిక ఆచూకీని వెంటనే కనుగొని, దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. సోమవారం విచారణలో ప్రభుత్వం, డీజీపీ ఇచ్చే సమాధానాలు కీలకంగా మారనున్నాయి.
తాజావార్తలు
-
Punjab: ‘‘రేప్ కేసుల సెటిల్మెంట్ దందా’’.. సీఎం మాన్, భార్యపై బీజేపీ తీవ్ర ఆరోపణలు
-
Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
-
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
-
Konda Surekha : బర్తరఫ్ తర్వాత తొలిసారి స్పందించిన కొండా సురేఖ..
-
MS Dhoni: ధోనీ సంచలన నిర్ణయం.. మ్యాచ్లు ఆడేది లేదన్న సీఎస్కే దిగ్గజం..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!