Gulzar House : ఒకేసారి మూడు తరాలు అగ్నికి ఆహుతి.. హృదయవిదారకం..!
- ఒకేసారి మూడు తరాలు అగ్నికి ఆహుతి
- గుల్జార్ హౌస్ ముత్యాల వ్యాపారి ప్రహ్లాద్ మోడీ కుటుంబంపై మృత్యుపాశం
- 150 సంవత్సరాల క్రితం ముత్యాల వ్యాపారం చేసేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రహ్లాద్ మోడీ తాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gulzar House : హైదరాబాద్ గుల్జార్హౌస్ ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకున్న భయంకర అగ్నిప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల ప్రాణాలను బలితీసుకుంది. ముత్యాల వ్యాపారిగా పేరుగాంచిన ప్రహ్లాద్ మోడీ కుటుంబం ఈ విషాద ఘటనలో మృత్యుపాశంలో చిక్కుకుంది. వారి కుటుంబాన్ని చుట్టుముట్టిన మంటలు, ఆనాటి నుండి నేటి వరకు సాగిన వారసత్వాన్ని ఒక్కసారిగా భస్మంగా మార్చేశాయి.
Honda Rebel 500: కుర్రళ్లను అట్రాక్ట్ చేస్తోన్న బైక్.. హోండా కొత్త ప్రీమియం బైక్ రెబెల్ 500 విడుదల
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
150 సంవత్సరాల క్రితం ఉత్తరాది నుంచి హైదరాబాద్కు వలస వచ్చిన ప్రహ్లాద్ మోడీ తాత, ముత్యాల వ్యాపారం కోసం గుల్జార్హౌజ్ చౌరస్తాలో భవనం కొనుగోలు చేసి వ్యాపారం ప్రారంభించారు. ఆయన తనయుడు పూనంచంద్ మోడీ నుంచి ప్రహ్లాద్కి వారసత్వంగా వచ్చిన ఈ వ్యాపారాన్ని ఆయన తన సోదరుడు రాజేంద్రకుమార్తో కలసి అభివృద్ధి చేశారు. వ్యాపార ప్రాంగణం కింద ఉన్న రెండు అంతస్థుల భవనం లోయర్ ఫ్లోర్లో ఉంది, కాగా పై అంతస్థులు నివాసంగా ఉపయోగిస్తున్నారు.
ప్రహ్లాద్ మోడీకి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు అత్తాపూర్లో నూతనంగా నిర్మించిన ఇంట్లో నివసిస్తున్నారు. కుమార్తెలు రాజీవ్నగర్, సనత్నగర్లో ఉండి అక్కడే స్థిరపడ్డారు. చిన్న కుమారుడు పంకజ్ మోడీ తన భార్య, ముగ్గురు పిల్లలతో కలసి తండ్రి వద్దే నివసిస్తున్నాడు. ఉత్తరాది నుంచి తరచూ వచ్చే బంధుమిత్రుల రాకతో ఆ ఇల్లు ఎప్పుడూ సందడిగా ఉండేది.
పాతబస్తీ ప్రాంతంతో మమకారం కలిగిన ప్రహ్లాద్ మోడీకి, ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లే ఆలోచన ఎప్పుడూ లేదు. అదే ఆయనకు గండికాగా మారింది. ఆదివారం సంభవించిన అగ్నిప్రమాదంలో ప్రహ్లాద్ మోడీ దంపతులు, కుమారుడు పంకజ్ మోడీ కుటుంబం, ఇద్దరు కుమార్తెలు, వారి పిల్లలు మొత్తం ఒకేసారి మృత్యువాతపడ్డారు. వారంతా ఉన్న చోటే అగ్ని ముప్పుని ఎదుర్కొన్నారు. వారి మృతవార్త తెలిసిన క్షణం నుండి బంధుమిత్రులు కన్నీరుమునిగిపోయారు.
Rahul Gandhi: పాక్తో భారత్ యుద్ధం.. ఎన్ని విమానాలు కోల్పోయామో చెప్పాలన్న రాహుల్ గాంధీ
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!