Gujarat: హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు మృతి, పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat: గుజరాత్లోని ఆనంద్ నగరం సమీపంలోని అహ్మదాబాద్-వడోదర ఎక్స్ప్రెస్వేపై సోమవారం ఉదయం ఆగి ఉన్న బస్సును వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొనడంతో ఆరుగురు మరణించగా, ఆరుగురికి పైగా గాయపడ్డారు. ఆనంద్ జిల్లాలోని చిఖోద్రా గ్రామ సమీపంలో తెల్లవారుజామున 4.30 గంటలకు అహ్మదాబాద్ వైపు వెళ్తున్న ప్రైవేట్ లగ్జరీ బస్సు టైరు పగిలి రోడ్డు పక్కన ఆగి ఉండగా ఈ ప్రమాదం జరిగిందని ఆనంద్ రూరల్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. టైరు మారుస్తున్న సమయంలో బస్సులోని ప్రయాణికులు కిందకు దిగారని, కొందరు వాహనం ముందు వేచి ఉండగా వేగంగా వచ్చిన ట్రక్కు బస్సును వెనుక నుంచి ఢీకొట్టిందని అధికారి తెలిపారు.
Read Also:Rohit Sharma Retirement: టెన్షన్ వద్దు.. ఇంకొంత కాలం ఆడతా: రోహిత్
Also Read
- Rajat Patidar: ధోనీ, రోహిత్కు కూడా సాధ్యం కాని రికార్డు.. స్వర్ణ అక్షరాలతో చరిత్రను సృష్టించిన ఆర్సీబి కెప్టెన్.!
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
- Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
#WATCH | Gujarat: Several people injured after a bus collided with a truck on the Ahmedabad-Vadodra Express Highway in Anand, earlier today.
(Source: Fire Department, Anand, Gujarat) pic.twitter.com/JI67jNmhn2
— ANI (@ANI) July 15, 2024
బస్సు మహారాష్ట్ర నుండి రాజస్థాన్ వెళ్తుండగా, ఆనంద్ సమీపంలో బస్సు పంక్చర్ అయింది. దీంతో బస్సు డ్రైవర్, ప్రయాణికులు బస్సు కింద నిలబడి ఉండగా వెనుక నుంచి వచ్చిన ట్రక్కు బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాద వార్త అందిన వెంటనే ఆనంద్ ఫైర్ డిపార్ట్మెంట్, ఎక్స్ప్రెస్ హైవే పెట్రోలింగ్ టీమ్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో బస్సు డ్రైవర్ కూడా ఉన్నారని తెలిపారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారని, వారి గుర్తింపు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. అంతకుముందు జూలై 12న గుజరాత్లోని పటాన్లో జరిగిన ప్రమాదంలో నలుగురు మరణించడం గమనార్హం. అప్పుడు కూడా బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా మృతి చెందారు. ట్రక్కు డ్రైవర్, క్లీనర్ కూడా ప్రాణాలు కోల్పోయారు.
Read Also:Anivara Asthanam: రేపు శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం.. భక్తులకు కీలక సూచనలు
తాజావార్తలు
-
Sobhita dhulipala : ప్రళయానంతర ప్రపంచంలో కథ… ‘వెట్టువం’పై అంచనాలు పెంచిన శోభిత కామెంట్స్
-
Supreme Court: సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన
-
Rajat Patidar: ఆర్సీబీ కెప్టెన్గా ట్రోఫీ గెలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇదంతా విధి రాసిందే!
-
Shubman Gill: కచ్చితంగా గెలుస్తామనుకున్నాం.. కానీ అక్కడే మ్యాచ్ మా చేతుల్లో నుంచి జారిపోయింది!
-
Venkatesh iyer: కుంటుకుంటూ.. రెచ్చిపోతూ.. RCBకి కప్ తెచ్చిన సూపర్ డూపర్ హీరో.. ఫైనల్ అంటేనే రెచ్చిపోయే ప్లేయర్!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!