Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Gujarat Ats Reveals Secrets Of Suspected Terrorists

Terrorist: చైనాలో MBBS చదివి.. రసాయన విషంతో భారత్ లో విధ్వంసానికి ప్లాన్.. అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్

Published Date :November 9, 2025 , 3:47 pm
By Venkatesh
  • దేశంలో ఒక పెద్ద ఉగ్రవాద ఆపరేషన్‌ను భగ్నం
  • రసాయన విషంతో భారత్ లో విధ్వంసానికి ప్లాన్
  • గుజరాత్ ATS, కేంద్ర సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదుల అరెస్టు
Terrorist: చైనాలో MBBS చదివి.. రసాయన విషంతో భారత్ లో విధ్వంసానికి ప్లాన్.. అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశంలో ఒక పెద్ద ఉగ్రవాద ఆపరేషన్‌ను భగ్నం చేసినట్లు గుజరాత్ ATS ప్రకటించింది. చైనా నుంచి MBBS డిగ్రీ పొందిన వ్యక్తితో పాటు మరో ఇద్దరు అనుమానితులను ATS అరెస్టు చేసింది. రహస్య సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ జరిగిందని ATS DIG పేర్కొన్నారు. గుజరాత్ ATS, కేంద్ర సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేయడం ద్వారా భారీ పురోగతి సాధించాయి. ఈ ఉగ్రవాదులలో చైనా నుంచి MBBS డిగ్రీ పొందిన 35 ఏళ్ల వైద్యుడు అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్ కూడా ఉన్నాడు. అతను ISKPతో అనుబంధంగా ఉన్న విదేశాలలో ఉన్న ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నాడు. అహ్మద్‌తో పాటు, అతని ఇద్దరు సహచరులు మొహమ్మద్ సుహెల్, ఆజాద్ సైఫీలను కూడా అరెస్టు చేశారు. ATS ప్రకారం, ఈ ముగ్గురు అహ్మదాబాద్, లక్నో మరియు ఢిల్లీలో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రచిస్తు్న్నట్లు తెలిపారు.

Also Read:AI సౌండ్ ఫోకస్, LUMO ఇమేజ్ ఇంజిన్‌తో భారత్‌లో OPPO Find X9, Find X9 Pro నవంబర్ 18న విడుదల!

ముగ్గురు ఉగ్రవాదులను ఒక సంవత్సరం పాటు నిఘాలో ఉంచినట్లు గుజరాత్ ATS పేర్కొంది. వారి లొకేషన్ ను నిరంతరం ట్రాక్ చేసి వారి ప్రతి కదలికను పరిశీలించారు. టెర్రరిస్టులు భయంకరమైన ISIS విభాగం, ISKP (ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్) తో అనుసంధానించబడిన రెండు వేర్వేరు మాడ్యూళ్లలో భాగమని గుర్తించారు. గుజరాత్ ATS DIG సునీల్ జోషి ప్రకారం, చాలా నెలలుగా, హైదరాబాద్ నివాసి అయిన 35 ఏళ్ల అహ్మద్ మొహియుద్దీన్ గురించి సమాచారం అందింది, అతను తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని దీని ఆధారంగా, ATS అతని ప్రతి కదలికను పర్యవేక్షిస్తోందని తెలిపారు.

రెండు రోజుల క్రితం అహ్మద్‌ను అదాలజ్ టోల్ ప్లాజా సమీపంలో ఆయుధాలు, ద్రవ రసాయనాన్ని కారులో తీసుకెళ్తుండగా ATS అరెస్టు చేసింది. విచారణలో, అతను విదేశాలలో ఉన్న ISKP సభ్యులతో పరిచయం కలిగి ఉన్నాడని వెల్లడైంది. అతను మరో ఇద్దరు రాడికలైజ్డ్ యువకులు మొహమ్మద్ సుహెల్, ఆజాద్ సైఫీలతో ఉగ్రవాద దాడికి ప్రణాళిక రచిస్తున్నట్లు తెలిపారు. అహ్మదాబాద్, లక్నో, ఢిల్లీలలో గ్రౌండ్ నిఘా నిర్వహించి దాడులకు ప్లా్న్ చేస్తున్నట్లు తెలిపారు.

Also Read:Sourav Ganguly: ‘రిచా ఘోష్‌ భారత కెప్టెన్‌’.. గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు!

ATS ప్రకారం, ముగ్గురు ఉగ్రవాదులు “రైజిన్” అనే అత్యంత విషపూరితమైన ద్రవాన్ని తయారు చేస్తున్నారు. అధికారుల ప్రకారం, ఈ పదార్ధం సైనైడ్ కంటే ప్రాణాంతకం. తక్కువ మొత్తంలో కూడా విస్తృత ప్రాణనష్టం జరగవచ్చు. ఈ మాడ్యూల్ ఈ ద్రవాన్ని ఎలా ఉపయోగించాలనుకుంటుందో తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విచారణలో, అహ్మద్ ఆయుధాలను రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ నుండి కొనుగోలు చేసినట్లు వెల్లడించాడు.

వాటిని సరఫరా చేయడానికి గుజరాత్‌కు వచ్చానని, డెలివరీ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్‌కు తిరిగి వెళ్లబోతున్నాడని చెప్పాడు. ఆయుధాలు సరఫరా నెట్‌వర్క్‌లోకి ప్రవేశించిన మార్గాలను, ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉందో ATS దర్యాప్తు చేస్తోంది. వర్గాల సమాచారం ప్రకారం, ముగ్గురు ఉగ్రవాదులు ఒక సంవత్సరానికి పైగా ATS రాడార్‌లో ఉన్నారు. గుజరాత్‌లో వారి ఆయుధ మార్పిడి గురించి సమాచారం అందిన వెంటనే, ATS వెంటనే ఆపరేషన్ ప్రారంభించి ముగ్గురిని అరెస్టు చేసింది. దర్యాప్తులో కేంద్ర సంస్థలు కూడా పాల్గొన్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Gujarat ats arrested three terrorist
  • Gujarat ATS nabs three Suspects

తాజావార్తలు

  • Pawan Kalyan : పవన్ – త్రివిక్రమ్ మధ్య దూరం పెరిగిందా? సోషల్ మీడియా టాక్‌లో నిజమెంత?

  • Mahesh Kumar Goud: డ్రగ్ టెస్టుకు సీఎం సిద్ధం.. మరి కేటీఆర్ సిద్దమా?

  • PEDDI : చెన్నై సూపర్ కింగ్స్ తో ‘పెద్ది’ రచ్చ రచ్చే!

  • India-Iran History: ఒకే దేవతలను పూజించిన విశ్వాసాలు..4000ఏళ్ల ఇండియా-ఇరాన్‌ చరిత్ర..!

  • UBS : పవన్‌కు పోలీస్ క్యారెక్టర్ సెంటిమెంట్ వర్కవుటవుతుందా?

ట్రెండింగ్‌

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • Yash Dayal Wife: వివాదాల మధ్యే సీక్రెట్‌గా యశ్ దయాల్ పెళ్లి.. ఎవరీ శ్వేత పుండిర్?

  • Vaibhav Sooryavanshi: “వీడియో గేమ్ లా క్రికెట్ ఆడుతున్నాడు”.. వైభవ్ సూర్యవంశీపై సంజూ శాంసన్ సెటైర్.. వీడియో వైరల్

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions