Gudivada Amarnath: సూపర్ సిక్స్ అన్నారు.. సింగిల్ రన్ కూడా తీయలేదు.. మాజీ మంత్రి విమర్శలు
- కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు
- చంద్రబాబు టూర్లో స్టీల్ ప్లాంట్ కోసమే మాట్లాడలేదు- అమర్నాథ్
- సూపర్ సిక్స్ అన్నారు సింగిల్ రన్ కూడా తీయలేదు- అమర్నాథ్
- ఇంకా ఎప్పుడు సూపర్ సిక్స్ కొడతారు- గుడివాడ అమర్నాథ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు పర్యటనలో స్టీల్ ప్లాంట్ కోసమే మాట్లాడలేదని అన్నారు. అడిగితే దాటవేసే ప్రయత్నం చేశారు.. సీఎం చంద్రబాబే తాము కట్టిన కట్టడాన్ని మెచ్చుకున్నాడని అన్నారు. కానీ ప్రజలను తప్పు దోవ పట్టించి జగన్ కోసం కట్టుకున్న ప్యాలెస్గా చెప్తున్నాడని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. చంద్రబాబు తాత్కలింగా అమరావతిలో నిర్మిస్తే జగన్ శాశ్వత అద్భుత భవనాల్ని నిర్మించారన్నారు. అమరావతిలో రూ.1100 కోట్లు ఖర్చు పెట్టి టెంపరరీ భవనాలు కట్టారు.. చంద్రబాబు కట్టిన భవనాల్లో వర్షం వస్తే నేరుగా ఛాంబర్ లోకి నీరు వచ్చేదని ఆయన పేర్కొన్నారు. కానీ జగన్ పర్మినెంటిగా ఋషికొండలో భవనాలు నిర్మించారని తెలిపారు.
Read Also: Top Headlines @5PM : టాప్ న్యూస్
Also Read
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- వరల్డ్ కప్ గెలిచినా అసలు ట్రోఫీ దక్కదట.! 'FIFA World Cup' గురించి తెలియని విషయాలు మీకోసం..
తాను మంత్రిగా ఉన్నప్పుడు తన ఛాంబర్లో బాత్ రూమ్ కి వెళ్ళే పరిస్థితి లేదు.. అలాంటి కట్టడాలు చంద్రబాబు కట్టాడని విమర్శించారు. అమరావతిలో కట్టిన భవనాల్ని, జగన్ కట్టిన భవనల్ని ప్రజలకు చూపించండి అని అన్నారు. ఏ భవనాలు పర్మినెంట్గా కట్టారో ప్రజలే చెబుతారని పేర్కొన్నారు. ప్రభుత్వంకు సంబంధించిన టూరిజం ప్లేసులో జగన్ ఎలా సొంతంగా భవనాలు కట్టుకుంటారు.. ప్రజల్ని చంద్రబాబు తప్పుదోవ పట్టిస్తున్నారు.. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. పోలవరం పనులు తమ హయాంలో ఎక్కువుగా జరిగితే ఏమి కాలేదు అని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాత్కాలిక భవనాల కోసం వేల కోట్లు ఖర్చు పెట్టిన మీరు. జగన్ తక్కువ ఖర్చుతో శాశ్వత భవనాలు నిర్మిస్తే ఎందుకు ఏడుస్తున్నారని దుయ్యబట్టారు.
Read Also: Kolkata: ఆలస్యం కావడంతో బుకింగ్ క్యాన్సిల్ చేసిన మహిళ..అసభ్యకర వీడియోలు పంపిన డ్రైవర్
సూపర్ సిక్స్ అన్నారు సింగిల్ రన్ కూడా తీయలేదు, ఇంకా ఎప్పుడు సూపర్ సిక్స్ కొడతారని ఎద్దేవా చేశారు. నాన్నకి ఇంధనం దొరికింది తప్ప.. అమ్మకి వందనం దక్కలేదని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. బార్లలో తగ్గింపు ధరలకే మద్యం అని బ్యానర్ లో కట్టారు.. కానీ పెరుగుతున్న నిత్యావసర ధరలు తగ్గింపు ధరల బ్యానర్లు ఎక్కడ కనిపించవేనని అన్నారు. మీరు ఏమి పరిపాలన చేస్తున్నారు.. ఇప్పటికీ జగన్ మీద పడి ఏడుస్తున్నారు, ఏడుపు ఆపి ప్రజలకి న్యాయం చేయండని తెలిపారు. మీరు చేసిన దుబారా ఖర్చులతో పోల్చితే.. తాము రుషికొండలో నిర్మించిన శాశ్వత భవనాలు మంచివే కదా అని పేర్కొన్నారు. గుంతలు ఉన్న రోడ్లని కప్పడం మానేసి బాగున్న రోడ్లను తవ్వి కప్పడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు పట్టించుకోవడం మానేసి.. తమ పై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారని తెలిపారు.
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..