Guava Cultivation : జామలో తెగుళ్ల నివారణ చర్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జామ కాయాలకు ప్రతి సీజన్ లో డిమాండ్ ఉంటుంది.. ఇక పింక్ జామను ఈ మధ్య రైతులు ఎక్కువగా పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.. వీటిని నాటితే 16 ఏళ్ళు లాభాలను పొందే ఏకైక పంట పింక్ జామ..అందుకే ఈ పంట వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు.ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులు ఈపంట సాగును చేపట్టారు. అధిక అదాయం చేతికి వస్తుండమే రైతులు ఈ పంటసాగు చేపట్టటానికి కారణం. అయితే పంట ఉత్పత్తి బాగా ఉండాలంటే సరైన యాజమాన్య పద్దతు చేపట్టాల్సిన అవసరం ఉంది.. తెగుళ్లు కూడా ఎక్కువగానే ఉంటాయి.. ఈ జామలో తెగుళ్ల నివారణ చర్యల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ జామలో నులిపురుగులు, మిలీబగ్, పండు ఈగ ఈపంటకు అధిక నష్టాన్ని కలిగిస్తాయి. నులిపురుగులు వీటిని నెమటోడ్లు అని కూడా పిలుస్తారు. వేరు మధ్యలో తిష్టవేసుకుని మొక్కకు సరఫరా అయ్యే ఆహారాన్ని తీంటూ వృద్ధి చెందుతాయి. దీని వల్ల మొక్క క్రమంగా ఎండిపోయి చనిపోతుంది. ఈ తెగులు సోకిన చెట్టు వాడిపోయి ఎండిపోతాయి. మొదలు తవ్వి వేరును పరిశీలిస్తే వేర్ల మధ్య ఉబ్బినట్టుండి లోపల గూళ్లు కనబడతాయి.. అందుకే మొక్కలను ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ముఖ్యంగా నర్సరిలో ఈ మొక్కలను తీసుకొనే ముందు వీటిని పరిశీలించి తీసుకోవడం మంచిది..
Also Read
- Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
ఇక పింక్ జామకు సోకే మరో తెగులు మిలీబగ్. దీనినే పిండినల్లి లేదా రసం పీల్చే పురుగు అంటారు. ఈ తెగులు సోకిన మొక్కలు పేను బంక ఆశించిన మందార చెట్టును పోలి ఉంటాయి. సకాలంలో చర్యలు తీసుకోకుంటే నష్టం జరుగుతుంది. పంటకు నష్టం కలిగించే వాటిలో పండు ఈగ కూడా ఒకటి.. ఇది ఒక్కసారి సోకితే మళ్లీ పోదు.. అందుకే ముందే రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు..
నివారణ చర్యలు…
నెమటోడ్ల నివారణకు 20 కిలోల వేపపిండి నీటిలో వేసి 48 గంటలు నానబెట్టాలి. 200ల లీటర్ల నీటిలో ట్రైకోటెర్మా హరిజోనమ్, సుడోమోనాస్, మైసిస్, లీలాసినస్ లను రెండు కిలోల చొప్పున కలిపి 24 గంటల పాటు నిలువ ఉంచి కలియబెట్టి మొక్కల మొదళ్ల వద్ద పోసి నెమటోడ్లను పూర్తిగా నివారించవచ్చు.పిండి నల్లి నివారణకు లీటరుకు 2గ్రాముల డిటర్జెంట్ పౌడరును కలిపి తెగులు సోకిన చెట్టు పూర్తిగా తడిచేలా పిచికారి చెయ్యాలి.. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే నల్లి బాధలు తగ్గుతాయి.. పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వెయ్యడం మంచిదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Chinmayi: డబ్బింగ్ రూమ్లో భావోద్వేగానికి గురైన చిన్మయి శ్రీపాద
-
Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..