Online Games: ఇక ఫోన్లో గేమ్స్ ఆడాలన్నా పన్ను కట్టాల్సిందే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Games : ఆన్లైన్ గేమింగ్ ఆడే వారికి పెద్ద షాక్. ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో, గుర్రపు పందాల(జూదం)పై జీఎస్టీని భారీగా పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు వాటిపై 18 శాతం జీఎస్టీ ఉండగా.. దానిని 28 శాతానికి పెంచేందుకు రాష్ట్ర ఆర్థిక మంత్రుల ప్యానెల్ ప్రతిపాదనను మే లేదా జూన్లో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే నైపుణ్యతను పెంచే గేములపై జీఎస్టీ 18శాతంగా ఉండనుంది. ప్రస్తుతం ఆన్లైన్ గేమింగ్పై 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. ఇది ఆన్లైన్ గేమింగ్ పోర్టల్ ద్వారా వసూలు చేయబడిన మొత్తం రుసుముపై ఉంటుంది.
Read Also: Heavy Rains: హైదరాబాద్లో భారీ వర్షాలు.. వడగళ్ల వానలు కురిసే అవకాశం
Also Read
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
గతంలోనే మేఘాలయ సీఎం సంగ్మా నేతృత్వంలోని మంత్రుల బృందం, గేమ్లో పాల్గొనడానికి ఆటగాడు చెల్లించే ప్రవేశ రుసుముతో సహా, ఆన్లైన్ గేమింగ్ పూర్తి విలువతో పన్ను విధించాలని సిఫార్సు చేసింది.. క్యాసినో, ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందాలపై 28 శాతం జీఎస్టీ విధించాలని సూచనలు చేసింది. రేస్ కోర్సుల విషయంలో, టోటలైసేటర్లలో పూల్ చేసి బుక్మేకర్ల వద్ద ఉంచిన బెట్టింగ్ల పూర్తి విలువపై జీఎస్టీ విధించాలని.. కాసినోలో ఒక ఆటగాడు కాసినో నుండి కొనుగోలు చేసిన నాణేల పూర్తి విలువపై పన్ను విధించాలని సిఫార్సు చేసింది మంత్రుల కమిటీ… మునుపటి రౌండ్లలో గెలిచిన వాటితో సహా, ప్రతి రౌండ్ బెట్టింగ్లో ఉంచిన బెట్టింగ్ల విలువపై జీఎస్టీ వర్తింపజేయాలని ప్రతినాదలను పంపారు.. అలాగే, కాసినోలలోకి ప్రవేశ రుసుములపై 28 శాతం వస్తువులు మరియు సేవల పన్ను విధించాలని, ఇందులో తప్పనిసరిగా ఆహారాలు/పానీయాలు మొదలైనవాటిని చేర్చాలని జీఎంవో సూచించింది.
Read Also:Manipur : సీఎం కార్యక్రమంలో గందరగోళం..వేదికకు నిప్పుపెట్టిన దుండగులు
రెండేళ్లలో 29,000 కోట్ల పరిశ్రమ
KPMG నివేదిక ప్రకారం, కరోనా లాక్డౌన్ సమయంలో ఆన్లైన్ గేమింగ్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. నివేదిక ప్రకారం, వచ్చే రెండేళ్లలో అంటే 2024-25 నాటికి దేశీయ ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ పరిమాణం రూ.29,000 కోట్లకు పెరగనుంది. 2021లో ఇది 13,600 కోట్లు.
తాజావార్తలు
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
-
Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!