NTV Telugu Site icon

Minister KTR : గ్రూప్‌-2 అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. పరీక్ష రీ షెడ్యూల్‌పై సీఎం కేసీఆర్‌ ఆదేశం

Tspsc Group 4 Exam

Tspsc Group 4 Exam

తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేస్తారా? లేదా? అనే ఉత్కంఠకు సీఎం కేసీఆర్‌ తెర దించారు. గ్రూప్‌-2 పరీక్ష రీ షెడ్యూల్‌ చేయాలని మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్‌ ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. టీఎస్పీఎస్సీతో సంప్రదించి గ్రూప్‌-2 రీషెడ్యూల్‌ చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించినట్లు మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. గురుకుల టీచర్, జూనియర్ లెక్చరర్లు, పాలిటెక్నిక్ తదితర 21 పోటీ పరీక్షలు ఒకే నెలలో ఉన్నాయని, గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని టీఎస్‌‌‌‌పీఎస్సీని కోరితే పట్టించుకోలేదంటూ డి.మహేశ్‌‌‌‌తోపాటు మరో 149 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Also Read : Jawaan: మళ్లీ లీకయిన ‘జవాన్’ క్లిప్.. పోలీసులకి ఫిర్యాదు!

దీనిపై జస్టిస్ పి.మాధవి దేవి శుక్రవారం విచారణ చేపట్టారు. అయితే.. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ. గిరిధర్‌‌‌‌‌‌‌‌రావు వాదనలు వినిపించారు. పిటిషనర్ల వాదనలు విన్న హైకోర్టు.. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలన్న అభ్యర్థుల విజ్ఞప్తిపై సోమవారంలోగా తేల్చాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌‌‌‌పీఎస్సీ)ను హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. అభ్యర్థులు ఇచ్చిన వినతి పత్రంపై ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని స్పష్టం చేసింది హైకోర్టు. కోర్టుకు 5 లక్షల మంది రాలేరని, వచ్చింది కొంత మందే అయినా వారి హక్కులను పరిరక్షించాల్సిందేనని వ్యాఖ్యానించింది హైకోర్టు. 14వ తేదీ లోపు ఏదో ఒకటి చెప్పాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది హైకోర్టు.

Also Read : Veerendra Babu Arrest: రేప్ కేసులో ప్రముఖ నటుడు అరెస్ట్