హైదరాబాద్ లోని శేరిలింగంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వివాహం జరిగిన 24 గంటలకే రోడ్డు ప్రమాదంలో పెళ్లి కుమారుడు మృతి చెందాడు. పెళ్లి కుమారుడు శ్రీనివాస్ కారు నడుపుతుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలతో పెళ్లి కూతురు కోమాలోకి వెళ్లాడు.
చెన్నై లో ఉన్న అత్తగారి ఇంటికి వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం బెంగళూరు సమీపంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వధువు… ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా… వరుడు మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. ఇక ఈ రోడ్డు ప్రమాదంతో ఇరు కుటుంబ సభ్యులు విషాదంలోకి వెళ్లారు.
