Tragedy : కోట్లు సంపాదించిపెట్టారు.. కొడుకులు కూడు పెట్టకపోవడంతో ఉసురుతీసుకున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : కోటి విద్యలు కూటి కోసం మాత్రమే అనే సామెత వినే ఉంటారు. ఎన్ని వందల వేల కోట్లు సంపాదించినా జానెడు పొట్టకు తిండి లేకపోతే ఎంత కష్టపడినా వృథా. నేటి సమాజంలో మానవ సంబంధాలన్నీ మనీ బంధాలే. ప్రతీ వ్యక్తి తన స్వార్థం కోసం మాత్రమే ఇతరులపై ఆధారపడతాడు. అది బయట వారు మాత్రమే కాదు… కడుపున పుట్టినవారు, తోబుట్టువులు కూడా అంతే. ఇది హర్యానాలో జరిగిన సంఘటనతో స్పష్టమైంది.
హర్యానాలోని చర్ఖీ దాద్రి జిల్లాలో డెబ్భై ఏళ్ల వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు తమ మరణానికి కారణం ఏమిటో ఓ లేఖలో తెలిపారు. తమ పిల్లలే వారి చావుకి కారణమని లేఖలో పేర్కొన్నారు. 2021 బ్యాచ్ కి చెందిన హరియాణా కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ పేరెంట్స్, ఇతర కుటుంబ సభ్యులు తమను చూసుకోవడం లేదని.. కనీసం వేళకు తిండి కూడా పెట్టడం లేదని లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. జగదీష్ చంద్ర, ఆయన సతీమణి బాగ్లీ బాద్రాలోని గోపీ గ్రామంలో జీవించేవారు. తన కొడుకులకు పట్టణంలో 30 కోట్ల ఆస్తి ఉన్నా తమకు అన్నం పెట్టడంలేదని లేఖలో రాశారు. తమపై దౌర్జన్యం చేసిన కొడుకు, కోడళ్ళకు శిక్ష పడినప్పుడే చనిపోయిన మా ఆత్మలకు శాంతి చేకూరుతుందని రాసుకొచ్చారు.
Also Read
- Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Thursday Horoscope: ఆ రాశివారు అనుకున్న పనుల అంచనాలు తారుమారతాయి.. జాగ్రత్త సుమీ..!
- Off The Record: తెలంగాణ బీజేపీలో 'నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్'
Read Also: Pawan Kalyan: ఉస్తాద్ డైరెక్టర్ కు పవన్ స్పెషల్ విషెస్
తన ఆస్తులన్నీ స్థానిక ఆర్య సమాజ్ కు విరాళంగా ఇవ్వాలని కోరారు.సొంత కొడుకుల చేతిలో అవమానం భరించలేకనే ఆత్మహత్య చేసుకున్నాం అని రాసుకొచ్చారు. నీలం, వికాస్, సునీత, వీరేందర్ తమ చావుకు కారణమని వెల్లడించారు. ‘ఈ ప్రపంచంలో ఏ పిల్లలూ తమ తల్లిదండ్రులపై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడరు. నా లేఖ చదివే వారికి, ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే.. వారిని ఖచ్చితంగా శిక్షించాలి. అప్పుడే తమ ఆత్మలకు శాంతి చేకూరుతుంది’ అంటూ రాసుకొచ్చారు. ఈ ఆత్మహత్య లేఖ ఆధారంగా పోలీసులు నలుగురి మీద కేసులు నమోదు చేశారు. మృతుల మనవళ్లలో ఒకరు ఐఏఎస్ అధికారి కాగా మరొకరు ఆర్మీలో సైనిక అధికారిగా ఉన్నారు.
"मेरे बेटों के पास 30 करोड़ की संपत्ति है, जबकि हमारे पास रोटी नहीं.."
सुसाइड नोट लिख IAS के दादा-दादी ने की खुदकुशी, हरियाणा के चरखी दादरी से सामने आया मामला#Haryana pic.twitter.com/C4dVMCarcr
— News24 (@news24tvchannel) March 31, 2023
తాజావార్తలు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
-
Kia Syros EV: 526KM రేంజ్, లెవెల్-2 ADAS భద్రతా ఫీచర్లతో.. కియా సైరోస్ EV భారత్ లో విడుదల
-
IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!