Minister Nara Lokesh: టీడీపీ నేత దారుణ హత్య.. ఖండించిన మంత్రి నారా లోకేష్..
- కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దారుణం..
- టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు హత్య..
- ఇది వైసీపీ మూకలే పనేనంటూ తీవ్రంగా ఖండించిన మంత్రి నారా లోకేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Nara Lokesh: కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు హత్యను తీవ్రంగా ఖండించారు మంత్రి నారా లోకేష్.. శ్రీనివాసులు హత్య ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన లోకేష్.. ”కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసీపీ మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్లల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. వైసీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది.” అని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్..
Read Also: Hardik Pandya Dating: సింగర్తో హార్దిక్ పాండ్యా డేటింగ్.. పిక్స్ వైరల్!
Also Read
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- AP Student Suicide in US: అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య.. పిస్టల్తో కాల్చుకుని..
- Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి
కాగా, కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూర్ గ్రామంలోదారుణం చోటుచేసుకుంది. హోసూరు మాజీ సర్పంచ్ శ్రీనివాసులు దారుణ హత్యకు గురయ్యారు. ఉదయం బహిర్భూమికి వెళ్లిన శ్రీనివాసులను దుండగులు ముందే పథకం ప్రకారం కళ్ళలో కారం కొట్టి వేట కొడవళ్లతో అత్యంత దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనతో హోసూర గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. మాజీ సర్పంచ్ పత్తికొండ టీడీపీ ఎమ్మెల్యే కే ఈ శ్యాంబాబుకి ప్రధాన అనుచరుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హోసూరు గ్రామంలో టీడీపీకి మంచి మెజార్టీ రావడం తర్వాత ఈ హత్య జరగడంతో రాజకీయంగా మరే ఇతర కారణాలతో హత్య జరిగి ఉంటుందా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. హత్య జరిగిన స్థలాన్ని ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. క్లూస్ టీం, ఆధారాలనుసేకరించారు. డాగ్ స్క్వాడ్, హత్య జరిగిన ప్రదేశం నుండి హత్య అయిన వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్లితిరిగి హత్య ప్రదేశానికి డాగ్ స్క్వాడ్ చేరుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు పత్తికొండ ఆసుపత్రికి తరలించారు. సాయంత్రంలోపు నిందితులను పట్టుకుంటామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండాచర్యలు తీసుకుంటామని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు.
కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో టీడీపీ మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులును వైసిపి మూకలు దారుణంగా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎన్నికల్లో టీడీపీ తరఫున కీలకంగా పనిచేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్ళల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారు. ప్రజాక్షేత్రంలో… pic.twitter.com/Wc3GxqTjR3
— Lokesh Nara (@naralokesh) August 14, 2024
తాజావార్తలు
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
-
Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!