Amit Shah: ఐదేళ్లలో అస్సాంను వరదలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని వరద రహిత రాష్ట్రంగా మారుస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి శనివారం అస్సాం ప్రజలకు హామీ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను అస్సాంను ఉగ్రవాదం, దాడుల నుంచి విముక్తి కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పుడు మరో ఐదేళ్లు ఇవ్వండి అస్సాంను వరదలు లేని రాష్ట్రంగా చేస్తామని.. అస్సాం ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికను రూపొందించిందని గువాహటిలోని ఖానాపరాలో జరిగిన కార్యకర్తల సమ్మేళనంలో ఆయన అన్నారు. వరదల నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి, మరింత అభివృద్ధి చేయడానికి, గణనీయమైన పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మరోసారి బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రాన్ని వరద రహితంగా మార్చడానికి దీర్ఘకాలిక ప్రణాళిక కావాలని.. స్వల్పకాలిక చర్యలను మాత్రమే చూడకూడదన్నారు. అస్సాం ప్రభుత్వం చిత్తడి నేలలను రక్షించడానికి, పునరుజ్జీవింపజేయడానికి ఖచ్చితమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు.
ఈ ఏడాది జులై వరకు అస్సాంలో 190 మందికి పైగా వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఆ రాష్ట్రం వరదల కారణంగా విపరీతంగా నష్టపోయింది. జూలై 2022లో, 12 జిల్లాల్లో దాదాపు 5.39 లక్షల మంది వరదల బారిన పడ్డారు. జులైలో వినాశకరమైన అస్సాం వరదల కారణంగా అనేక మంది చేపల పెంపకందారులు కూడా భారీ నష్టాలను చవిచూశారు. అనంతరం రాష్ట్రంలో మత్స్య పరిశ్రమను రక్షించేందుంకు రాష్ట్ర ప్రభుత్వం సహాయాన్ని మంజూరు చేసింది. 80 శాతం మంది చేపల రైతులు సుమారు రూ. 1,000 కోట్ల విలువైన నష్టాన్ని చవిచూశారని, ఈ రంగానికి భారీ ఎదురుదెబ్బ తగిలిందని అస్సాం మత్స్యశాఖ మంత్రి పరిమళ్ సుక్లాబైద్య తెలిపారు.
Also Read
- Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
- Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
- West Bengal: మదర్సాల్లో ‘వందేమాతరం’ తప్పనిసరి.. సువేందు సంచలన నిర్ణయం..
Explosion On Bridge: ఉక్రెయిన్ పై విధ్వంసానికి దిగిన రష్యా.. బ్రిడ్జిని పేల్చేసిన సైన్యం
అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) జూలై డేటా ప్రకారం, రాష్ట్రంలో దాదాపు 8.9 మిలియన్ల మంది ప్రజలు వరదల బారిన పడినట్లు తెలిసింది. కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలో అప్పటి వరకు 192 మంది ప్రాణాలు కోల్పోయారు. 34 జిల్లాల్లో 2.40 లక్షల హెక్టార్ల పంట భూములు దెబ్బతిన్నాయి. ఆగస్టు 30, 2021న రాష్ట్రంలోని వరదల కారణంగా 3,63,135 మంది నివసించే అస్సాంలోని 21 జిల్లాల్లోని 950 గ్రామాలు ప్రభావితమయ్యాయని వెల్లడించింది. అస్సాం ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2016 వరదల్లో 64 మంది, 2017లో 160 మంది, 2018లో 45 మంది, 2019 మరియు 2020 సంవత్సరాల్లో వరుసగా 101 మంది, 124 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
Asim Munir: అసిమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ఆకస్మిక రద్దు.. కారణమిదే!
-
Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
-
Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
-
IPL Tickets Block: 39 వేల టికెట్లు.. నిమిషాల్లో మాయం.! ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ వెనుక పెద్ద దందా.?
-
Fire Accident : NH-44 పై భారీ ప్రమాదం.. 8 కొత్త కార్లు పూర్తిగా దగ్ధం..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!