Governor Tamilisai : విద్యార్ధులు ఉద్యోగాన్వేషణేకాదు.. ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలి
జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పదకొండవ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందార రాజన్ హాజరయ్యారు. ఈ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టరేట్ ను సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ చాన్సలర్ డా. కృష్ణస్వామి కస్తూరి రంగన్ కు అందజేయగా 92,005 మంది పి.హెచ్.డి, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయషన్ విద్యార్థులకు పట్టాలను అందజేశారు. విద్యాసంవత్సరంలో అధ్భుత ప్రతిభ కనబరిచిన వారికి 46 బంగారు పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ సాంకేతికత ప్రతి రోజు అభివృద్ది చెందుతూనే ఉందని దానికి తగినట్లుగా ఇంజినీరింగ్ విద్యార్థులు పోటీతత్వాన్ని పెంపొందించుకుని ముందుకు సాగుతూ ఉండాలని అన్నారు. ఒకానొక సందర్భంలో విద్యార్థులు పరీక్షలకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాసేవారని, ఇప్పుడు హాజరైతే చాలు అన్నట్లు ఉండటమే కాకుండా ప్రశ్నపత్రాలు ఎక్కడ తయారవుతాయి కొందరు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారని, ఇది దురదృష్టకరమని అన్నారు.
Also Read : Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు అరెస్ట్ కు రంగం సిద్ధం..?
Also Read
ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్ధులు ఉద్యోగాన్వేషణ పై దృష్టిపెట్టడమే కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని, తాము చదువుకున్న చదువులు తమకే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని కోరారు. ఒకప్పుడు విద్యార్థులు పరీక్షలకు హాజరై అన్ని ప్రశ్నలకు సమాధానాలు వ్రాసేవారని, ఇప్పుడు హాజరైతే చాలు అన్నట్లు ఉన్నారన్నారు. ప్రశ్నపత్రాలు ఎక్కడ తయారవుతాయి కొందరు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారని, ఇది దురదృష్టకరమన్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న విద్యార్ధులు ఉద్యోగాన్వేషణ పై దృష్టిపెట్టడమే కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. తాము చదువుకున్న చదువులు తమకే కాకుండా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలన్నారు. కస్తూరి రంగన్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరం అన్ని రకాల పారిశ్రామిక అభివృద్ధికి నెలవు అవుతుందని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని పైకి ఎదగాలని అన్నారు.
తాజావార్తలు
-
Divya Sathyaraj: పెళ్లి లేకుండానే తల్లిని అవుతా.. కట్టప్ప కూతురు సెన్సేషనల్ కామెంట్స్!
-
YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
-
Nandamuri Balakrishna : బాలయ్య నీ స్పీడ్ ఏంటయ్యా.. ఒకేసారి రెండు సినిమాలు
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
-
Indonesia: ఇండోనేషియాలో రెండు రైళ్లు ఢీ.. నలుగురు మృతి
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!