Supreme Court: మురుగు కాల్వలు క్లీన్ చేస్తూ మరణిస్తే రూ. 30 లక్షలు చెల్లించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: దేశంలో మురుగు కాల్వల మరణాల ఘటనలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. మురుగు కాల్వలను శుభ్రం చేసే సమయంలో మరణించిన వారి కుటుంబానికి ప్రభుత్వ అధికారులు రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని పేర్కొంది. మురుగు కాల్వలను శుభ్రపరిచే సమయంలో శాశ్వత అంగవైకల్యానికి గురైన వారికి కనీస పరిహారంగా రూ.20 లక్షలు చెల్లించాలని జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. “మాన్యువల్ స్కావెంజింగ్ పూర్తిగా నిర్మూలించబడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ధారించాలి” అని బెంచ్ పేర్కొంది.
Also Read: NewsClick Case: న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడు, హెచ్ఆర్ హెడ్లకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
క్లీనర్ ఇతర వైకల్యాలతో బాధపడుతుంటే అధికారులు రూ.10 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుందని తీర్పును ప్రకటిస్తూ జస్టిస్ రవీంద్ర భట్ పేర్కొన్నారు. అటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వ సంస్థలు సమన్వయం చేసుకోవాలని, పైగా మురుగు కాలువల మరణాలకు సంబంధించిన కేసులను పర్యవేక్షించకుండా హైకోర్టులు నిరోధించరాదని బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. దేశంలో మురుగు కాల్వల మరణాల ఘటనలకు సంబంధించిన పిల్పై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
జులై 2022లో లోక్సభలో ఉదహరించిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో భారతదేశంలో మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంక్లను శుభ్రం చేస్తున్నప్పుడు 347 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీలో ఈ మరణాలలో 40 శాతం ఉన్నాయి.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..