తెలంగాణాలో ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.. తెలంగాణాలో ఉన్న పలు శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు విభాగాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు.. ఈ ఉద్యోగాలను సంబందించిన పూర్తి వివరాలు చూద్దాం..
ఈ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 21 నుంచి ప్రారంభం అయ్యాయి. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు అధికారిక సైట్ bdl-india.in ను సందర్శించి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తులకు నెల రోజుల సమయం ఇచ్చారు. సెప్టెంబర్ 20వ తేదీన దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది…మొత్తం 45 పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో మేనేజ్మెంట్ ట్రైనీ , వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఫైనాన్స్ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక కోసం రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు..
అభ్యర్థులు దరఖాస్తు ఫీజును చెల్లించాలి. అభ్యర్థులు రూ.500 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.. SC/ST/PWBD/మాజీ సైనికులు/అంతర్గత శాశ్వత ఉద్యోగులు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. అభ్యర్థులు SBI ఇ-పే కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/UPI మొదలైన వాటి ద్వారా ఫీజు చెల్లించవచ్చు.. దరఖాస్తు ప్రక్రియ 21 ఆగస్టు 2023 న ప్రారంభం కాగా.. దరఖాస్తు ప్రక్రియ ముగిసే తేదీ 20 సెప్టెంబర్ 2023గా నిర్ణయించారు..
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?
*. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
*. ఇక్కడ కెరీర్ అనే ఆప్షన్ కు వెళ్లండి.
*. ఇక్కడ మీరు అప్లై ఆన్ లైన్ అనే ఆప్షన్ కు వెళ్లి వ్యక్తిగత సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది.
*. తర్వాత దరఖాస్తు ఫీజు చెల్లించి.. అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయాలి.
*.ఇకపోతే దరఖాస్తు ఫారమ్ సమర్పించి డౌన్లోడ్ చేసుకోవాలి..
ఈ ఉద్యోగాలకు ఆసక్తి కలిగిన వాళ్లు అధికారిక సైట్ bdl-india.in ను సందర్శించాలి..