Chandrasekhar: వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు సంబంధించి కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.. ఉద్యోగస్తులకు, పెన్షన్లర్లకు ప్రభుత్వం చేసిన మంచి విషయాలను దాచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం కావడంతో కొంతమంది ఓట్ల కోసం మాట్లాడుతున్నారు.. ఇది సరికాదని హితవు పలికారు. కోవిడ్ వల్ల ఉద్యోగస్తులకు రావాల్సిన రాయితీల విషయంలో జాప్యం జరిగింది.. దీనిని భూతద్దంలో చూపుతున్నారని మండిపడ్డారు. పది వేలకు మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులను కూడా ప్రభుత్వం పర్మినెంట్ చేసిందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టి ఆయన మర్చిపోయారని ఆరోపించారు.
ఓట్ల కోసం మేనిఫెస్టోలో వాళ్లకు అవసరమైన అంశాలను పొందుపారుస్తారే తప్ప అమలు చేయరని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలము అమలు చేసిందన్నారు. వైద్య విధాన పరిషత్ లో పనిచేస్తున్న 15 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా జగన్ ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామ సచివాల వ్యవస్థను తీసుకువచ్చింది.. లక్ష 30 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు.. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో సిబ్బందిని పూర్తి స్థాయిలో భర్తీ చేశారని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు చెప్తున్నారు.. కానీ ఆయన హామీని ఎవరూ నమ్మరని ఆరోపించారు.
Also Read
- Rohit Sharma Retirement: "దాంతో నాకేం సంబంధం".. రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ ఫస్ట్ రియాక్షన్!
- Hyderabad: భాగ్యనగరంలో ఘనంగా ఆషాఢ బోనాలు ప్రారంభం.. గోల్కొండలో సందడి షురూ..
- Rohit Sharma Retirement: నేటి మ్యాచ్కు రోహిత్ పేరెంట్స్.. హిట్మ్యాన్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇదిగో..
- Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్గూడాలో హైటెన్షన్
రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం కింద ఆడపిల్ల పుడితే డబ్బులు ఇస్తామని చెప్పారు కానీ అమలు కాలేదు.. మేనిఫెస్టోలో జగన్ పెడితే అమలు చేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఉద్యోగ సంఘాలు అడగకనే 12వ వేతన సంఘాన్ని కూడా వేశారని తెలిపారు. డి ఏ. లు పెండింగ్ లేకుండా చేస్తున్నారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం రూ.25 వేల కోట రూపాయల బకాయిలు ఉన్నాయని తప్పుడు సమాచారం చెబుతున్నారని అన్నారు. పదవీ విరమణ వయసు 62 సంవత్సరాల కు జగన్ పెంచారు.. సి.పి.ఎస్. వల్ల ప్రభుత్వంపై భారం పడుతుందని భావించి జిపిఎస్ ను తీసుకువచ్చారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఆప్కాస్ సంస్థను ఏర్పాటు చేశారు.. ఇప్పుడు ఒకటి తేదీన జీతాలు, పెన్షన్లు వస్తున్నాయని చంద్రశేఖర్ తెలిపారు.
తాజావార్తలు
-
Tollywood : ఆగస్టులో యుక్తి తరేజా Vs రితికా నాయక్.. ఇద్దరి బ్యూటీల మధ్య గట్టి ఫైట్
-
IND vs ENG 3rd ODI: రోహిత్ శర్మను భయపెడుతున్న లార్డ్స్ గ్రౌండ్.. మరీ ఇంత దారుణమా!
-
Albino Cobra: శ్వేతనాగు రహస్యాలు వింటే వణికిపోతారు.. ఈ తెల్ల పాముల వెనుక దైవ శక్తి ఉందా?
-
72nd National Film Awards : 72వ జాతీయ అవార్డులపై విమర్శలు.. అద్భుతమైన సినిమాలకు నో అవార్డ్స్
-
Mammootty: నాలుగో జాతీయ అవార్డుతో చరిత్ర సృష్టించిన మమ్ముట్టి.. కమల్, చిరంజీవి, అల్లు అర్జున్ శుభాకాంక్షల వెల్లువ
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!