Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Government Advisor Chandrasekhar Said That The Ycp Government Has Implemented 99 Percent Of The Promises Given In The Manifesto

Chandrasekhar: వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేసింది..

NTV Telugu Twitter
Published Date :May 3, 2024 , 4:05 pm
By Rajesh Veeramalla
Chandrasekhar: వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన 99 శాతం హామీలను అమలు చేసింది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

టీడీపీపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు సంబంధించి కొంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.. ఉద్యోగస్తులకు, పెన్షన్లర్లకు ప్రభుత్వం చేసిన మంచి విషయాలను దాచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం కావడంతో కొంతమంది ఓట్ల కోసం మాట్లాడుతున్నారు.. ఇది సరికాదని హితవు పలికారు. కోవిడ్ వల్ల ఉద్యోగస్తులకు రావాల్సిన రాయితీల విషయంలో జాప్యం జరిగింది.. దీనిని భూతద్దంలో చూపుతున్నారని మండిపడ్డారు. పది వేలకు మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులను కూడా ప్రభుత్వం పర్మినెంట్ చేసిందన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టి ఆయన మర్చిపోయారని ఆరోపించారు.

ఓట్ల కోసం మేనిఫెస్టోలో వాళ్లకు అవసరమైన అంశాలను పొందుపారుస్తారే తప్ప అమలు చేయరని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మేనిఫెస్టోలో 99 శాతం హామీలము అమలు చేసిందన్నారు. వైద్య విధాన పరిషత్ లో పనిచేస్తున్న 15 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా జగన్ ప్రభుత్వం గుర్తించిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రామ సచివాల వ్యవస్థను తీసుకువచ్చింది.. లక్ష 30 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు.. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రులలో సిబ్బందిని పూర్తి స్థాయిలో భర్తీ చేశారని తెలిపారు. చంద్రబాబు హయాంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు చెప్తున్నారు.. కానీ ఆయన హామీని ఎవరూ నమ్మరని ఆరోపించారు.

రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం కింద ఆడపిల్ల పుడితే డబ్బులు ఇస్తామని చెప్పారు కానీ అమలు కాలేదు.. మేనిఫెస్టోలో జగన్ పెడితే అమలు చేస్తారనే నమ్మకం ఉందన్నారు. ఉద్యోగ సంఘాలు అడగకనే 12వ వేతన సంఘాన్ని కూడా వేశారని తెలిపారు. డి ఏ. లు పెండింగ్ లేకుండా చేస్తున్నారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం రూ.25 వేల కోట రూపాయల బకాయిలు ఉన్నాయని తప్పుడు సమాచారం చెబుతున్నారని అన్నారు. పదవీ విరమణ వయసు 62 సంవత్సరాల కు జగన్ పెంచారు.. సి.పి.ఎస్. వల్ల ప్రభుత్వంపై భారం పడుతుందని భావించి జిపిఎస్ ను తీసుకువచ్చారన్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ఆప్కాస్ సంస్థను ఏర్పాటు చేశారు.. ఇప్పుడు ఒకటి తేదీన జీతాలు, పెన్షన్లు వస్తున్నాయని చంద్రశేఖర్ తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AP Elections 2021
  • chandrababu
  • Chandrasekhar
  • cm jagan
  • Government advisor

తాజావార్తలు

  • Air India Plane Crash: ఎయిరిండియా విమాన దర్యాప్తు కోసం భారత్ రానున్న బ్రిటిష్ ఏజెన్సీ..

  • Air India Plane Crash: విమాన ప్రమాదంలో గాయపడ్డవారిని పరామర్శించిన అమిత్ షా

  • Kubera: కుబేర ప్రీ-రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్

  • CM Revanth Reddy: జిల్లాలకు ఇన్‌ఛార్జి మంత్రుల కేటాయింపు..

  • Allu Arjun: మలయాళ సెన్సేషన్ తో బన్నీ సినిమా?

ట్రెండింగ్‌

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • Arunachala Moksha Yatra: అరుణాచలేశ్వరుని దర్శించుకునే భక్తులకు శుభవార్త.. ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ మీకోసం..!

  • Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్‌తో iOS 26 లాంచ్..!

  • PhonePe: ఫీచర్‌ ఫోన్ల వినియోగదారుల కోసం యూపీఐ సేవలతో ఫోన్‌పే కొత్త అడుగు..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions