యాక్షన్ హీరో గోపిచంద్ దాదాపు తొమ్మిదేళ్లుగా సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్నాడు.ఎన్నో ఆశలు పెట్టుకున్న రామబాణం సినిమా భారీ డిజాస్టర్గా నిలిచింది. తన కెరీర్లో రెండు భారీ హిట్స్ ఇచ్చిన శ్రీవాస్ కూడా ఈ సారి గోపిచంద్ కు హిట్ ఇవ్వలేకపోయాడు. దాంతో గోపీచంద్ కొంత గ్యాప్ తీసుకుని రీసెంట్ గా తన కొత్త సినిమాను ప్రారంభించాడు. అది కూడా ఐదేళ్లుగా సినిమా చేయని శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.. ఒకప్పుడు స్టార్ హీరోలతో భారీ హిట్స్ అందుకున్న శ్రీను వైట్ల ఇప్పుడు చిన్న హీరోల సినిమా ఆఫర్స్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. పిలిచి మరీ ఆఫర్ ఇచ్చిన రవితేజకు అమర్ అక్బర్ ఆంటోని రూపంలో భారీ డిజాస్టర్ మూవీ ఇచ్చాడు శ్రీను వైట్ల.. ఆ తర్వాత ఇప్పటివరకు శ్రీనువైట్ల మరో సినిమా చేయలేదు.
ఈ సినిమాతో ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని శ్రీనువైట్ల ఎంతో కసితో ఉన్నాడు. అదే కసితో షూటింగ్ను కూడా సూపర్ స్పీడ్గా కానిచ్చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్ను చిత్రయూనిట్ పూర్తి చేసుకుంది. ఇటలీలోని మిలాన్లో అందమైన లొకేషన్లలో ఈ సినిమా షూటింగ్ను జరిపారు. ఈ మేరకు మేకర్స్ ఓ స్పెషల్ వీడియోను అభిమానులకు షేర్ చేసారు.. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేవి గుహన్, గోపి మోహన్ వంటి స్టార్ టెక్నిషియన్లు పనిచేస్తున్నారు. ఈ సినిమాకు చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. కీలక షెడ్యూల్తో పాటు ఓ సాంగ్ను కూడా షూట్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో హీరో గోపిచంద్ సరసన ఏక్ మినీ కథ బ్యూటీ కావ్య థాపర్ నటిస్తుంది..మాములుగా శ్రీనువైట్ల సినిమాలకు విపరీతంగా ఫ్యాన్స్ వుంటారు.అయితే ఇప్పుడు టైమ్ కలిసి రాక సరైన సినిమాలు పడట్లేదు కానీ.. దూకుడు వరకు ఆయన సినిమాలు జనాలకు ఓ రేంజ్ ఎంటర్టైనమెంట్ అందించాయి అయితే ఆ మధ్యన ఢీ సీక్వెల్ అంటూ ప్రకటించినా.. అది కార్య రూపం దాల్చలేదు. ఇక ఎట్టకేలకు మ్యాచో స్టార్ గోపీచంద్ ను ఒప్పించి మంచి ఫ్యామిలీ మూవీ తెరకెక్కిస్తున్నాడు.