More Layoffs in Google: గూగుల్ సీఈవో సంచలన వ్యాఖ్యలు.. ఉద్యోగులకు కొత్త టెన్షన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
More Layoffs in Google: టెక్ దిగ్గజాలు లేఆఫ్స్ కొనసాగిస్తూ ఉన్నాయి.. ఆ సంస్థ ఈ సంస్థ అనే తేడా లేకుండా.. ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి.. ఇక, టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది.. 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జనవరిలో ప్రకటించిన ఆ సంస్థ.. ఇప్పుడు రెండో రౌండ్ లేఆఫ్స్ కు సిద్ధం అవుతుంది.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.. కంపెనీ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే అదనపు భారాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో మరికొంతమంది ఉద్యోగులకు ఊస్టింగ్ తప్పదనే టెన్షన్ మొదలైంది..
అయితే, టెక్నికల్ గా అనుభవం ఉన్న వారికి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు.. కానీ, ప్రాథమిక దశలో ఉన్నవారిని భరించడం మాత్రం కష్టమని సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.. జనవరిలో మొత్తం వర్క్ఫోర్స్లో ఆరు శాతం లేదా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన తర్వాత గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, రెండవ రౌండ్ తొలగింపులు ఉండవచ్చని సూచనలు చేశారు.. వాల్ స్ట్రీట్ జర్నల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కంపెనీలో త్వరలో మరిన్ని తొలగింపులు జరగవచ్చని పిచాయ్ సూచించాడు, అయితే అవకాశాలను నేరుగా ప్రస్తావించలేదు.
Also Read
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
- Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్కు భారీ ఎదురుదెబ్బ..
గూగుల్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్బాట్ బార్డ్, జీమెయిల్ మరియు గూగుల్ డాక్స్ సహా ఇతర ప్రాజెక్ట్లలో కొత్త వర్క్స్పేస్ సామర్థ్యాలను ప్రస్తావిస్తూ.. మేం మాకు ఉన్న ఈ అవకాశాల సెట్పై చాలా ఎక్కువ దృష్టి పెడుతున్నాం.. అంతేకాదు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాను అన్నారు సుందర్ పిచాయ్…మనం చేయగలిగిన చోట ఖచ్చితంగా ప్రాధాన్యతనిస్తాం మరియు ప్రజలను మా అత్యంత ముఖ్యమైన ప్రాంతాలకు తరలిస్తాం అన్నారు.. కంపెనీ సామర్థ్యాన్ని 20 శాతం ఎలా పెంచుతుందని భావిస్తున్నారనే ప్రశ్నకు సమాధానంగా, దాని వ్యయ స్థావరాన్ని శాశ్వతంగా రీ-ఇంజనీరింగ్ చేసే ప్రయత్నంలో కంపెనీ “మేం చేసే ప్రతి అంశాన్ని అక్షరాలా పరిశీలిస్తోందని” పిచాయ్ చెప్పారు. అభివృద్ధి జరిగినా మరిన్ని పనులు చేయాల్సి ఉందని ఉద్ఘాటించారు.
మేం ఖచ్చితంగా మన్నికైన పొదుపులను సృష్టించడంపై దృష్టి సారిస్తున్నాం. పురోగతితో సంతోషిస్తున్నాం. కానీ, ఇంకా ఎక్కువ పని మిగిలి ఉంది అని చెప్పుకొచ్చారు సుందర్ పిచాయ్.. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత కోతలు విధించామని పిచాయ్ చెప్పారు. “మేం మా వర్క్ఫోర్స్ను సుమారు 12,000 పాత్రలు తగ్గించాలని నిర్ణయించుకున్నాం. మేము ఇప్పటికే USలో ప్రభావితమైన ఉద్యోగులకు ప్రత్యేక ఈమెయిల్ను పంపాం. ఇతర దేశాలలో, స్థానిక చట్టాలు మరియు అభ్యాసాల కారణంగా ఈ ప్రక్రియ ఎక్కువ సమయం పడుతుంది గతంలో సుందర్ పిచయ్ తన ప్రకటనలో పేర్కొన్న విషయం విదితమే.. అయితే, మరోసారి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అదనపు భారాన్ని, ఖర్చును తగ్గించుకోవాల్సి ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఎంతమందిని ఇంటికి పంపిస్తారు అనే టెన్షన్కు గురిచేస్తున్నాయి.
తాజావార్తలు
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
-
Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
-
Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. “రింగ్ ఆఫ్ ఫైర్”లో ఏం జరుగుతోంది?
-
Modi Cabinet: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధం.. కొత్త ముఖాలకు చోటు!
-
Telangana Congress : కాంగ్రెస్లో బిగ్ షాక్.. కొండా సురేఖ, చిన్నారెడ్డికి ఎసరు.?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!