More Layoffs in Google: గూగుల్ సీఈవో సంచలన వ్యాఖ్యలు.. ఉద్యోగులకు కొత్త టెన్షన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
More Layoffs in Google: టెక్ దిగ్గజాలు లేఆఫ్స్ కొనసాగిస్తూ ఉన్నాయి.. ఆ సంస్థ ఈ సంస్థ అనే తేడా లేకుండా.. ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి.. ఇక, టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది.. 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జనవరిలో ప్రకటించిన ఆ సంస్థ.. ఇప్పుడు రెండో రౌండ్ లేఆఫ్స్ కు సిద్ధం అవుతుంది.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.. కంపెనీ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే అదనపు భారాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో మరికొంతమంది ఉద్యోగులకు ఊస్టింగ్ తప్పదనే టెన్షన్ మొదలైంది..
అయితే, టెక్నికల్ గా అనుభవం ఉన్న వారికి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు.. కానీ, ప్రాథమిక దశలో ఉన్నవారిని భరించడం మాత్రం కష్టమని సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.. జనవరిలో మొత్తం వర్క్ఫోర్స్లో ఆరు శాతం లేదా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన తర్వాత గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, రెండవ రౌండ్ తొలగింపులు ఉండవచ్చని సూచనలు చేశారు.. వాల్ స్ట్రీట్ జర్నల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కంపెనీలో త్వరలో మరిన్ని తొలగింపులు జరగవచ్చని పిచాయ్ సూచించాడు, అయితే అవకాశాలను నేరుగా ప్రస్తావించలేదు.
Also Read
గూగుల్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్బాట్ బార్డ్, జీమెయిల్ మరియు గూగుల్ డాక్స్ సహా ఇతర ప్రాజెక్ట్లలో కొత్త వర్క్స్పేస్ సామర్థ్యాలను ప్రస్తావిస్తూ.. మేం మాకు ఉన్న ఈ అవకాశాల సెట్పై చాలా ఎక్కువ దృష్టి పెడుతున్నాం.. అంతేకాదు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాను అన్నారు సుందర్ పిచాయ్…మనం చేయగలిగిన చోట ఖచ్చితంగా ప్రాధాన్యతనిస్తాం మరియు ప్రజలను మా అత్యంత ముఖ్యమైన ప్రాంతాలకు తరలిస్తాం అన్నారు.. కంపెనీ సామర్థ్యాన్ని 20 శాతం ఎలా పెంచుతుందని భావిస్తున్నారనే ప్రశ్నకు సమాధానంగా, దాని వ్యయ స్థావరాన్ని శాశ్వతంగా రీ-ఇంజనీరింగ్ చేసే ప్రయత్నంలో కంపెనీ “మేం చేసే ప్రతి అంశాన్ని అక్షరాలా పరిశీలిస్తోందని” పిచాయ్ చెప్పారు. అభివృద్ధి జరిగినా మరిన్ని పనులు చేయాల్సి ఉందని ఉద్ఘాటించారు.
మేం ఖచ్చితంగా మన్నికైన పొదుపులను సృష్టించడంపై దృష్టి సారిస్తున్నాం. పురోగతితో సంతోషిస్తున్నాం. కానీ, ఇంకా ఎక్కువ పని మిగిలి ఉంది అని చెప్పుకొచ్చారు సుందర్ పిచాయ్.. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత కోతలు విధించామని పిచాయ్ చెప్పారు. “మేం మా వర్క్ఫోర్స్ను సుమారు 12,000 పాత్రలు తగ్గించాలని నిర్ణయించుకున్నాం. మేము ఇప్పటికే USలో ప్రభావితమైన ఉద్యోగులకు ప్రత్యేక ఈమెయిల్ను పంపాం. ఇతర దేశాలలో, స్థానిక చట్టాలు మరియు అభ్యాసాల కారణంగా ఈ ప్రక్రియ ఎక్కువ సమయం పడుతుంది గతంలో సుందర్ పిచయ్ తన ప్రకటనలో పేర్కొన్న విషయం విదితమే.. అయితే, మరోసారి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అదనపు భారాన్ని, ఖర్చును తగ్గించుకోవాల్సి ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఎంతమందిని ఇంటికి పంపిస్తారు అనే టెన్షన్కు గురిచేస్తున్నాయి.
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!