More Layoffs in Google: గూగుల్ సీఈవో సంచలన వ్యాఖ్యలు.. ఉద్యోగులకు కొత్త టెన్షన్..!
More Layoffs in Google: టెక్ దిగ్గజాలు లేఆఫ్స్ కొనసాగిస్తూ ఉన్నాయి.. ఆ సంస్థ ఈ సంస్థ అనే తేడా లేకుండా.. ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా ఉద్యోగులను ఇంటికి పంపుతున్నాయి.. ఇక, టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది.. 12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు జనవరిలో ప్రకటించిన ఆ సంస్థ.. ఇప్పుడు రెండో రౌండ్ లేఆఫ్స్ కు సిద్ధం అవుతుంది.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.. కంపెనీ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే అదనపు భారాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో మరికొంతమంది ఉద్యోగులకు ఊస్టింగ్ తప్పదనే టెన్షన్ మొదలైంది..
అయితే, టెక్నికల్ గా అనుభవం ఉన్న వారికి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు.. కానీ, ప్రాథమిక దశలో ఉన్నవారిని భరించడం మాత్రం కష్టమని సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.. జనవరిలో మొత్తం వర్క్ఫోర్స్లో ఆరు శాతం లేదా 12,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన తర్వాత గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, రెండవ రౌండ్ తొలగింపులు ఉండవచ్చని సూచనలు చేశారు.. వాల్ స్ట్రీట్ జర్నల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కంపెనీలో త్వరలో మరిన్ని తొలగింపులు జరగవచ్చని పిచాయ్ సూచించాడు, అయితే అవకాశాలను నేరుగా ప్రస్తావించలేదు.
Also Read
- Varanasi: మెక్సికోను షేక్ చేసిన రాజమౌళి వీడియో మెసేజ్.. ‘వారణాసి’ వరల్డ్ గ్లింప్స్కు అదిరిపోయే రెస్పాన్స్!
- Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- Rakul Preet Singh: పెళ్లయినా ఇంకా డేటింగ్ లోనే ఉన్నాం..రకుల్-జాకీ షాకింగ్ కామెంట్స్
గూగుల్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్బాట్ బార్డ్, జీమెయిల్ మరియు గూగుల్ డాక్స్ సహా ఇతర ప్రాజెక్ట్లలో కొత్త వర్క్స్పేస్ సామర్థ్యాలను ప్రస్తావిస్తూ.. మేం మాకు ఉన్న ఈ అవకాశాల సెట్పై చాలా ఎక్కువ దృష్టి పెడుతున్నాం.. అంతేకాదు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నాను అన్నారు సుందర్ పిచాయ్…మనం చేయగలిగిన చోట ఖచ్చితంగా ప్రాధాన్యతనిస్తాం మరియు ప్రజలను మా అత్యంత ముఖ్యమైన ప్రాంతాలకు తరలిస్తాం అన్నారు.. కంపెనీ సామర్థ్యాన్ని 20 శాతం ఎలా పెంచుతుందని భావిస్తున్నారనే ప్రశ్నకు సమాధానంగా, దాని వ్యయ స్థావరాన్ని శాశ్వతంగా రీ-ఇంజనీరింగ్ చేసే ప్రయత్నంలో కంపెనీ “మేం చేసే ప్రతి అంశాన్ని అక్షరాలా పరిశీలిస్తోందని” పిచాయ్ చెప్పారు. అభివృద్ధి జరిగినా మరిన్ని పనులు చేయాల్సి ఉందని ఉద్ఘాటించారు.
మేం ఖచ్చితంగా మన్నికైన పొదుపులను సృష్టించడంపై దృష్టి సారిస్తున్నాం. పురోగతితో సంతోషిస్తున్నాం. కానీ, ఇంకా ఎక్కువ పని మిగిలి ఉంది అని చెప్పుకొచ్చారు సుందర్ పిచాయ్.. జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత కోతలు విధించామని పిచాయ్ చెప్పారు. “మేం మా వర్క్ఫోర్స్ను సుమారు 12,000 పాత్రలు తగ్గించాలని నిర్ణయించుకున్నాం. మేము ఇప్పటికే USలో ప్రభావితమైన ఉద్యోగులకు ప్రత్యేక ఈమెయిల్ను పంపాం. ఇతర దేశాలలో, స్థానిక చట్టాలు మరియు అభ్యాసాల కారణంగా ఈ ప్రక్రియ ఎక్కువ సమయం పడుతుంది గతంలో సుందర్ పిచయ్ తన ప్రకటనలో పేర్కొన్న విషయం విదితమే.. అయితే, మరోసారి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అదనపు భారాన్ని, ఖర్చును తగ్గించుకోవాల్సి ఉంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఎంతమందిని ఇంటికి పంపిస్తారు అనే టెన్షన్కు గురిచేస్తున్నాయి.
తాజావార్తలు
-
Cheapest Saree Markets: మగువలకు గుడ్ న్యూస్.. రూ.150 కే పట్టు చీరలు.. దేశంలోనే అత్యంత చౌకైన మార్కెట్లు ఇవే!
-
Varanasi: మెక్సికోను షేక్ చేసిన రాజమౌళి వీడియో మెసేజ్.. ‘వారణాసి’ వరల్డ్ గ్లింప్స్కు అదిరిపోయే రెస్పాన్స్!
-
Delhi: లక్ష్మీనగర్లో భారీ అగ్నిప్రమాదం.. నాలుగు ఇళ్లు దగ్ధం
-
RCB vs GT: మొదటి ఓవర్లోనే ట్విస్ట్.. ఆ ఒక్క క్యాచ్.. మ్యాచ్నే మార్చేసింది!
-
Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!