Budget 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..5 సంవత్సరాల్లో 4 కోట్ల ఉద్యోగాలు!
- మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో యువత కోసం అనేక పథకాలు
- వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల ఉద్యోగాల లక్ష్యం
- ఇంటర్న్షిప్ల ద్వారా నిరుద్యోగులను కంపెనీలతో అనుసంధానించే ప్రణాళిక
- ఐదేళ్లలో లక్షలాది మంది యువతకు ఉద్యోగ శిక్షణ
- ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల రుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో యువత కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒకవైపు ఇంటర్న్షిప్ల ద్వారా నిరుద్యోగులను కంపెనీలతో అనుసంధానించే ప్రణాళిక బడ్జెట్లో ఉండగా, మరోవైపు మొదటి ఉద్యోగం పొందుతున్న వారి కోసం అనేక ఆఫర్లు కూడా వచ్చాయి. ఇదొక్కటే కాదు.. వచ్చే ఐదేళ్లలో లక్షలాది మంది యువతకు శిక్షణ ఇచ్చే యోచన కూడా ఉంది. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాలన్నీ ప్రస్తావించారు. వచ్చే ఐదేళ్లలో నిరుద్యోగుల విషయంలో మోడీ ప్రభుత్వం ఏవిధంగా ప్లాన్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్లో విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి రూ.1.48 లక్షల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
READ MORE: Olympics 2024: చరిత్ర సృష్టించే దిశగా దూసుకుపోతున్న రోహన్ బోపన్న..
Also Read
- Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
20 లక్షల మంది యువతకు శిక్షణ…
యువతకు ఉపాధి కోసం శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దాదాపు 20 లక్షల మంది యువతకు ఉపాధి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో పాటు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా ఇస్తుంది. ప్రభుత్వం 3 ప్రోత్సాహక పథకాలను తీసుకురానుంది. అంతే కాదు కంపెనీల సహకారంతో శ్రామికులకు హాస్టళ్లు నిర్మించనున్నారు. సోమవారం సమర్పించిన ఆర్థిక సర్వేలో దేశంలోని యువతలో కేవలం 51.25% మంది మాత్రమే ఉపాధి నైపుణ్యం కలిగి ఉన్నారని తేలింది. 48.75% మంది యువత ఉపాధికి నైపుణ్యం కలిగి లేరని సర్వే వెల్లడించింది. యువతకు ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం లేదు. సర్వే అనంతరం 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేసింది.
READ MORE:BRS : బేషరతుగా పంట రుణమాఫీ, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలి
యువత కోసం ఇంటర్న్షిప్..
యువత కోసం పథకాలు కూడా ప్రకటించింది ప్రభుత్వం. దీని కింద కోటి మంది యువతను ఇంటర్న్షిప్ పథకంతో అనుసంధానించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటర్న్షిప్ సమయంలో.. ఈ యువతకు రూ. 5000 వరకు గౌరవ వేతనం మాత్రమే కాకుండా.. ఒకే సారి రూ. 6000 కూడా లభిస్తుంది. ఈ యువతకు 500 అగ్రశ్రేణి కంపెనీల్లో ఇంటర్న్షిప్ లభిస్తుంది. ఆ తర్వాత సులువుగా ఉపాధి పొందొచ్చు.
READ MORE:CM Chandrababu: ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు
ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల వరకు రుణం ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాంటి యువతకు ప్రభుత్వం రూ.10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకం కింద ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయల వరకు రుణ సాయాన్ని ప్రకటించారు. దీంతోపాటు మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. తద్వారా శ్రామికశక్తిలో మహిళల సంఖ్యను పెంచవచ్చు. ఒక నిరుద్యోగి మొదటి సారి ఉద్యోగం పొందినట్లయితే, అతను ఒక నెల జీతం పొందుతాడు. రూ.లక్ష లోపు ఉద్యోగం పొందిన వారికి డీబీటీ ద్వారా మూడు విడతల్లో డబ్బులు అందజేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. మొదటి సారి EPFOలో నమోదు చేసుకున్న యువతకు రూ. 15,000 వరకు ఇవ్వబడుతుంది.
తాజావార్తలు
-
Tirupati Crime News: తిరుపతిలో దారుణం.. బాలికపై బాబాయ్ అత్యాచారం!
-
Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
-
Ravi Shastri: సూర్యకుమార్ యాదవ్ శకం తర్వాత కెప్టెన్ అతనే.. కీలక వ్యాఖ్యలు చేసిన క్రికెట్ దిగ్గజం.!
-
Maa Inti Bangaram: తెలివిగా తప్పించుకున్న సమంత..!
-
Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!