Budget 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..5 సంవత్సరాల్లో 4 కోట్ల ఉద్యోగాలు!
- మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో యువత కోసం అనేక పథకాలు
- వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల ఉద్యోగాల లక్ష్యం
- ఇంటర్న్షిప్ల ద్వారా నిరుద్యోగులను కంపెనీలతో అనుసంధానించే ప్రణాళిక
- ఐదేళ్లలో లక్షలాది మంది యువతకు ఉద్యోగ శిక్షణ
- ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల రుణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ ప్రభుత్వం ఈ బడ్జెట్లో యువత కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒకవైపు ఇంటర్న్షిప్ల ద్వారా నిరుద్యోగులను కంపెనీలతో అనుసంధానించే ప్రణాళిక బడ్జెట్లో ఉండగా, మరోవైపు మొదటి ఉద్యోగం పొందుతున్న వారి కోసం అనేక ఆఫర్లు కూడా వచ్చాయి. ఇదొక్కటే కాదు.. వచ్చే ఐదేళ్లలో లక్షలాది మంది యువతకు శిక్షణ ఇచ్చే యోచన కూడా ఉంది. నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాలన్నీ ప్రస్తావించారు. వచ్చే ఐదేళ్లలో నిరుద్యోగుల విషయంలో మోడీ ప్రభుత్వం ఏవిధంగా ప్లాన్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సాధారణ బడ్జెట్లో విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి రూ.1.48 లక్షల కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
READ MORE: Olympics 2024: చరిత్ర సృష్టించే దిశగా దూసుకుపోతున్న రోహన్ బోపన్న..
Also Read
- Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
- Tirumala Garuda Seva: రేపే గరుడ సేవ.. తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ట్.. ఘాట్ రోడ్డులో ఆంక్షలు
- IND vs AFG 3rd T20: అభిషేక్ శర్మ శివతాండవం.. ఆఫ్ఘన్పై భారత్ ఘనవిజయం.. 3-0తో క్లీన్ స్వీప్
- Astrology: సెప్టెంబర్ 18 శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివాళ్లకు గుడ్ న్యూస్.. కానీ, ఈ పరిహారం చెల్లించాలి..!
20 లక్షల మంది యువతకు శిక్షణ…
యువతకు ఉపాధి కోసం శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దాదాపు 20 లక్షల మంది యువతకు ఉపాధి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో పాటు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను కూడా ఇస్తుంది. ప్రభుత్వం 3 ప్రోత్సాహక పథకాలను తీసుకురానుంది. అంతే కాదు కంపెనీల సహకారంతో శ్రామికులకు హాస్టళ్లు నిర్మించనున్నారు. సోమవారం సమర్పించిన ఆర్థిక సర్వేలో దేశంలోని యువతలో కేవలం 51.25% మంది మాత్రమే ఉపాధి నైపుణ్యం కలిగి ఉన్నారని తేలింది. 48.75% మంది యువత ఉపాధికి నైపుణ్యం కలిగి లేరని సర్వే వెల్లడించింది. యువతకు ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యం లేదు. సర్వే అనంతరం 20 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేసింది.
READ MORE:BRS : బేషరతుగా పంట రుణమాఫీ, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలి
యువత కోసం ఇంటర్న్షిప్..
యువత కోసం పథకాలు కూడా ప్రకటించింది ప్రభుత్వం. దీని కింద కోటి మంది యువతను ఇంటర్న్షిప్ పథకంతో అనుసంధానించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంటర్న్షిప్ సమయంలో.. ఈ యువతకు రూ. 5000 వరకు గౌరవ వేతనం మాత్రమే కాకుండా.. ఒకే సారి రూ. 6000 కూడా లభిస్తుంది. ఈ యువతకు 500 అగ్రశ్రేణి కంపెనీల్లో ఇంటర్న్షిప్ లభిస్తుంది. ఆ తర్వాత సులువుగా ఉపాధి పొందొచ్చు.
READ MORE:CM Chandrababu: ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు
ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల వరకు రుణం ఇవ్వనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. అలాంటి యువతకు ప్రభుత్వం రూ.10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పథకం కింద ఉన్నత విద్య కోసం 10 లక్షల రూపాయల వరకు రుణ సాయాన్ని ప్రకటించారు. దీంతోపాటు మహిళల కోసం ప్రత్యేక నైపుణ్య కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. తద్వారా శ్రామికశక్తిలో మహిళల సంఖ్యను పెంచవచ్చు. ఒక నిరుద్యోగి మొదటి సారి ఉద్యోగం పొందినట్లయితే, అతను ఒక నెల జీతం పొందుతాడు. రూ.లక్ష లోపు ఉద్యోగం పొందిన వారికి డీబీటీ ద్వారా మూడు విడతల్లో డబ్బులు అందజేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. మొదటి సారి EPFOలో నమోదు చేసుకున్న యువతకు రూ. 15,000 వరకు ఇవ్వబడుతుంది.
తాజావార్తలు
-
Scene: పోలీస్ ఆఫీసర్గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో ‘సీన్’ ఎలా ఉండబోతోందంటే?
-
Russia-NATO Tensions: రష్యా డ్రోన్లు, క్షిపణులతో NATO దేశాలపై దాడి చేయొచ్చు.. పోలాండ్ ప్రధాని టస్క్ హెచ్చరిక
-
Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
F-16 Fighter Jet Crash: అమెరికాలో F-16 ఫైటర్ జెట్ క్రాష్.. వీడియో వైరల్, దర్యాప్తు షురూ
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!