Vb G Ram G Labourers : ఉపాధి హామీ కూలీలకు శుభవార్త.. ఆ కష్టాలకు చెక్ పడినట్లే..
- ఉపాధి హామీ కూలీల హాజరులో కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం..
- నెట్వర్క్ లేని చోట ఆఫ్లైన్ హాజరు..
- అంధులైన కూలీలకు కనురెప్ప ఆర్పే నిబంధన నుంచి మినహాయింపు..
ఉపాధి హామీ పథకం కింద పనిచేసే కూలీలకు ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులను తొలగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా హాజరు నమోదు విషయంలో నెట్వర్క్ సమస్యలు, మొబైల్ యాప్ పనితీరు వల్ల కూలీలు నష్టపోకుండా నిబంధనలను సులువు చేస్తూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ డి.దివ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పుల కారణంగా ఉపాధి పనికి వెళ్లే కూలీలకు ఎన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. చాలాచోట్ల సిగ్నల్ లేకపోవడం వల్ల కూలీల హాజరు నమోదు కావడం లేదు. ఇకపై ‘నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్’ (NMMS) యాప్లో ఆఫ్లైన్ మోడ్లో హాజరు తీసుకోవచ్చు. పని ప్రదేశంలో ఫొటోలు, వివరాలు రికార్డ్ చేసి, నెట్వర్క్ ఉన్న ప్రాంతానికి వచ్చాక రెండు రోజుల్లోపు (T+2) వాటిని అప్లోడ్ చేసే అవకాశం కల్పించారు. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లో పని చేసే వారికి నెట్ వర్క్ సమస్య అనేదే ఉండదు.
దీని ద్వారా.. ఫీల్డ్ అసిస్టెంట్లు లేదా మేట్ల మొబైల్ ఫోన్లు పనిచేయకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. సంబంధిత ప్రోగ్రామ్ ఆఫీసర్ అనుమతితో మరో ఫోన్ ద్వారా ‘జన్-మన్ రేగా’ యాప్ను ఉపయోగించి హాజరు వేయవచ్చు. కేవలం ఫోన్ పాడైందనే కారణంతో కూలీల పని దినాలు వృధా కాకుండా ఈ నిబంధన ఉపయోగపడుతుంది.
Also Read
- Vijay Political Rise: రజనీ, కమల్కు సైతం సాధ్యం కాలేదు.. ప్రజానాయకుడిగా మారిన విజయ్.. తమిళ రాజకీయాల్లో సరికొత్త మార్పు..
- Tamil Nadu Election Results: సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తారా..? డీఎంకే చావుదెబ్బ కొట్టిన హిందువులు..
- Mamata Banerjee Biography: అలుపెరుగని పోరాటం.. 34 ఏళ్ల లెఫ్ట్ పాలనను కూల్చిన "దీదీ" ధైర్యం.. ఇదే మమత కథ!
- Vijay TVK Party: తమిళనాడులో హంగ్ దిశగా ఫలితాలు.. ఆ పార్టీతో టీవీకే విజయ్ పొత్తు?
Also Read: PCB: పాకిస్థాన్కు అతి పిన్న వయస్కుడైన టెస్ట్ కోచ్.. 2017 చాంపియన్స్ ట్రోఫీ హీరో!
ఇప్పటివరకు హాజరు నమోదు సమయంలో ‘ఫేస్ ఆథెంటికేషన్’ కోసం కను రెప్పలను పైకి కిందకు కదిలించడం అనేది తప్పనిసరిగా ఉండేది. దీనివల్ల దృష్టి లోపం ఉన్న కూలీల హాజరు నమోదు కాక ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు డిజబిలిటీ సర్టిఫికెట్ ఉన్న అంధులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. వారు సాధారణ ఫొటోతోనే హాజరు నమోదు చేసుకోవచ్చు.
టెక్నికల్ కారణాలతో ఈ-కేవైసీ పూర్తికాని అర్హులైన కూలీలకు పని కల్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అధికారుల ధృవీకరణ ఉంటే ఫేస్ ఆథెంటికేషన్ లేకుండానే వారిని పనిలోకి తీసుకోవచ్చు. అయితే, పెండింగ్లో ఉన్న హాజరు వివరాలను 15 రోజుల్లోపు పరిష్కరించాలని.. లేదంటే ఆ డేటా శాశ్వతంగా తొలగిపోతుందని అధికారులు హెచ్చరించారు. ఈ మార్పు వల్ల లక్షలాది మంది గ్రామీణ కూలీలకు ఆర్థిక భద్రత చేకూరనుంది.
తాజావార్తలు
-
Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్డేట్స్ మీకోసం..
-
TVK VIJAY : తమిళనాడు సీఎంగా విజయ్?.. జననాయగన్ రిలీజ్ కు లైన్ క్లియర్
-
Actor Vijay TVK: సినీ నుంచి రాజకీయాల వరకు దళపతి విజయ్ ప్రస్థానం.. సవాళ్లను అధిగమించి..
-
Rajasekhar: మొదట శ్రీదేవే పెళ్లి ప్రపోజల్ పెట్టింది.. కానీ
-
Vijay Political Rise: రజనీ, కమల్కు సైతం సాధ్యం కాలేదు.. ప్రజానాయకుడిగా మారిన విజయ్.. తమిళ రాజకీయాల్లో సరికొత్త మార్పు..
-
Tamil Nadu Election Results: సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తారా..? డీఎంకే చావుదెబ్బ కొట్టిన హిందువులు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!