Vande Bharat Train: గుడ్ న్యూస్.. ఆ రైళ్లలో విమాన సౌకర్యాలు..!
- రైల్వే ప్రయాణికులకు శుభవార్త
- వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో విమాన సౌకర్యాలు
- ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించిన రైల్వేస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఎయిర్ హోస్టెస్లు, ఫ్లైట్ స్టీవార్డ్లను నియమించారు. రైలులో ప్రయాణీకులు విమాన సౌకర్యాలను అనుభవించేలా చేయడం దీని ఉద్దేశం. నివేదిక ప్రకారం.. రైల్వేస్ దీనిని ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించింది. ఈ ట్రయల్ ప్రాజెక్ట్ను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పర్యవేక్షిస్తుంది. కాగా.. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ సేవ ప్రారంభమైంది. ఈ సేవలు వందే భారత్ రైలులో ప్రయాణించేటప్పుడు ప్రయాణికుల అనుభవం మరింత అద్భుతంగా ఉండనున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
ఐఆర్సీటీసీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో 6 నెలల పాటు ఈ ప్రాజెక్ట్ను ట్రయల్గా అమలు చేసింది. ఇందుకోసం 34 మంది శిక్షణ పొందిన ఎయిర్ హోస్టెస్లు, ఫ్లైట్ స్టీవార్డ్లను నియమించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మిగతా రైళ్లలో కూడా ఈ సర్వీసును ప్రారంభించనున్నారు. యాత్రలలో ప్రజల సౌకర్యాన్ని పెంచడమే దీని ఉద్దేశమని అంటున్నారు. ఈ సందర్భంగా.. IRCTC ప్రతినిధి సిద్ధార్థ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రయాణీకులకు అత్యుత్తమ సేవలందించేందుకు ఐఆర్సిటిసి కృషి చేస్తోందని తెలిపారు.
Read Also: Stock market: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
‘సాధారణంగా లైసెన్స్ పొందిన క్యాటరర్ ప్రయాణీకులకు ఆహారం అందించే వ్యక్తికి ప్రతి నెల రూ. 8,000-10,000 చెల్లిస్తారు. అయితే.. అత్యుత్తమ సేవలను అందించడానికి, IRCTC ఈ ఎయిర్ హోస్టెస్లు, ఫ్లైట్ స్టీవార్డ్లకు నెలకు రూ. 25,000 చెల్లిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీ నుంచి వారణాసి వెళ్లే రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలును కేవలం 18 నెలల్లో చెన్నైకి చెందిన రైల్వే ప్రొడక్షన్ యూనిట్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ డిజైన్ చేసి అభివృద్ధి చేసింది. ఇందులో అంతర్గత రూపకల్పన మరియు తయారీ, కంప్యూటర్ మోడలింగ్ ఉన్నాయి. ఇది పూర్తిగా ‘మేక్ ఇన్ ఇండియా’ రైలు. దాని కోచ్లలో పునరుత్పత్తి బ్రేకింగ్ సిస్టమ్తో 30 శాతం వరకు విద్యుత్ శక్తిని ఆదా చేయగలదు’ అని సిద్ధార్థ్ సింగ్ తెలిపారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!