Vande Bharat Train: గుడ్ న్యూస్.. ఆ రైళ్లలో విమాన సౌకర్యాలు..!
- రైల్వే ప్రయాణికులకు శుభవార్త
- వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో విమాన సౌకర్యాలు
- ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించిన రైల్వేస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. భారతీయ రైల్వే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఎయిర్ హోస్టెస్లు, ఫ్లైట్ స్టీవార్డ్లను నియమించారు. రైలులో ప్రయాణీకులు విమాన సౌకర్యాలను అనుభవించేలా చేయడం దీని ఉద్దేశం. నివేదిక ప్రకారం.. రైల్వేస్ దీనిని ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించింది. ఈ ట్రయల్ ప్రాజెక్ట్ను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) పర్యవేక్షిస్తుంది. కాగా.. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ సేవ ప్రారంభమైంది. ఈ సేవలు వందే భారత్ రైలులో ప్రయాణించేటప్పుడు ప్రయాణికుల అనుభవం మరింత అద్భుతంగా ఉండనున్నట్లు ఐఆర్సీటీసీ తెలిపింది.
Also Read
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
ఐఆర్సీటీసీ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలులో 6 నెలల పాటు ఈ ప్రాజెక్ట్ను ట్రయల్గా అమలు చేసింది. ఇందుకోసం 34 మంది శిక్షణ పొందిన ఎయిర్ హోస్టెస్లు, ఫ్లైట్ స్టీవార్డ్లను నియమించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మిగతా రైళ్లలో కూడా ఈ సర్వీసును ప్రారంభించనున్నారు. యాత్రలలో ప్రజల సౌకర్యాన్ని పెంచడమే దీని ఉద్దేశమని అంటున్నారు. ఈ సందర్భంగా.. IRCTC ప్రతినిధి సిద్ధార్థ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రయాణీకులకు అత్యుత్తమ సేవలందించేందుకు ఐఆర్సిటిసి కృషి చేస్తోందని తెలిపారు.
Read Also: Stock market: స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
‘సాధారణంగా లైసెన్స్ పొందిన క్యాటరర్ ప్రయాణీకులకు ఆహారం అందించే వ్యక్తికి ప్రతి నెల రూ. 8,000-10,000 చెల్లిస్తారు. అయితే.. అత్యుత్తమ సేవలను అందించడానికి, IRCTC ఈ ఎయిర్ హోస్టెస్లు, ఫ్లైట్ స్టీవార్డ్లకు నెలకు రూ. 25,000 చెల్లిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీ నుంచి వారణాసి వెళ్లే రైలును ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలును కేవలం 18 నెలల్లో చెన్నైకి చెందిన రైల్వే ప్రొడక్షన్ యూనిట్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ డిజైన్ చేసి అభివృద్ధి చేసింది. ఇందులో అంతర్గత రూపకల్పన మరియు తయారీ, కంప్యూటర్ మోడలింగ్ ఉన్నాయి. ఇది పూర్తిగా ‘మేక్ ఇన్ ఇండియా’ రైలు. దాని కోచ్లలో పునరుత్పత్తి బ్రేకింగ్ సిస్టమ్తో 30 శాతం వరకు విద్యుత్ శక్తిని ఆదా చేయగలదు’ అని సిద్ధార్థ్ సింగ్ తెలిపారు.
తాజావార్తలు
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!