Gold Seized : కి‘లేడీ’ బంగారం అక్కడ పెట్టింది.. చెకింగ్ ను తప్పించుకుంది.. కానీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Seized : భారత్, దుబాయ్ మధ్య బంగారం ధరల్లో భారీగా వ్యత్యాసం ఉంది. దీంతో అక్కడనుంచి బంగారాన్ని తీసుకుని ఇక్కడ అమ్మేందుకు స్మగ్లర్లు చేయని ప్రయత్నాలు లేవు. ఈ క్రమంలో చాలా మంది స్మగ్లర్లు పట్టుబడుతున్నారు. ఎలాగోలా మస్కా కొట్టి కొందరు తప్పించుకోగలిగారు. అలాంటి ఒక సందర్భంలో, కరిపూర్ విమానాశ్రయం వెలుపల కేరళ యువతి లోదుస్తుల్లో దాచి బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయింది. ఆ మహిళ ఆదివారం దుబాయ్ నుంచి కరిపూర్ విమానాశ్రయానికి వచ్చింది.
ఆ మహిళను కాసర్గోడ్లో నివాసం ఉండే షహ్లా (19)గా గుర్తించారు. అధికారులకు అందిన సమాచారం ఆధారంగా ఎయిర్పోర్టు వెలుపల ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమె లోదుస్తుల్లో దాచిన 1.884 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మూడు ప్యాకెట్లలో బంగారం లభ్యమైంది. షహలా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో రాత్రి 10:30 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. కస్టమ్స్ క్లియరెన్స్ తర్వాత విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆమెను నగర పోలీసులు అరెస్టు చేశారు.
Also Read
- Astrology: జూన్ 13 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
- CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
- Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
Read Also: CBI Case On Officials : అర్హత లేని వారికి సాయం చేస్తే అంతే ఉంటది.. ఇప్పుడయ్యిందిగా
ఆ మహిళ మొదట బంగారం స్మగ్లింగ్ను ఖండించింది. పోలీసులు తొలుత ఆమె సామాను నుంచి ఏమీ కనుగొనలేకపోయారు. అయితే ఆమె లోదుస్తులకు కుట్టిన మూడు ప్యాకెట్లలో బంగారం లభ్యమైంది. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని, తదుపరి విచారణ నిమిత్తం కస్టమ్స్ అధికారులు నివేదికతో పాటు కోర్టుకు సమర్పించనున్నారు. కరిపూర్ విమానాశ్రయంలో పోలీసులు పట్టుకున్న బంగారం స్మగ్లింగ్లో ఇది 87వ కేసు.
Read Also: Mother Dairy Hikes Milk Price : పాల ధరను భారీగా పెంచిన మదర్ డైరీ.. ఏడాదిలో ఇది ఐదోసారి
బంగారం స్మగ్లింగ్ స్మగ్లర్లకు పెద్ద ఆదాయ వనరులను కలిగి ఉంది. దీని వెనుక పెద్ద రాకెట్ ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం, ముంబై ఎయిర్పోర్ట్లో దేశీయ ప్రయాణీకుడి నుంచి సుమారు 6.452 కిలోల (సుమారు రూ. 3.20 కోట్ల విలువైన) బంగారాన్ని పేస్ట్ రూపంలో అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఆదివారం, ముంబై విమానాశ్రయంలో బోర్డింగ్ గేట్ల వద్ద మరో ప్రయాణికుడి వద్ద సుమారు 1.2 కిలోల బరువున్న బంగారం డస్ట్ ను CISF పట్టుకుంది.
తాజావార్తలు
-
Astrology: జూన్ 13 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!