మన దేశంలో బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన.. పసిడి ధరలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 44, 300 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 120 పెరిగి రూ. 48, 330 కి చేరింది. ఇక అటు వెండి ధరలు కూడా ఇవాళ కాస్త పెరిగాయి. కిలో వెండి ధర రూ. 100 పెరిగి రూ. 67,500 వద్దకు చేరుకుంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.