Site icon NTV Telugu

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. రూ.48 వేలు క్రాస్‌ !

బంగారానికి ఉన్న విలువ ప్రపంచంలో మరేదానికి లేదు. ఈ బంగారాన్ని కొనుగోలు చేయడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే.. కొన్ని రోజులుగా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే గత వారం రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 44,000 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 320 పెరిగి రూ. 48,000 కి చేరింది. బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 900 పెరిగి రూ. 68,200 పలుకుతుంది.

Exit mobile version