ఇండియాలో బంగారం ధరలు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. నిన్నటి రోజున తగ్గిన బంగారం ధరలు.. ఇవాళ మరోసారి ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 45, 200 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 210 పెరిగి రూ. 49, 310 కి చేరింది. ఇక అటు వెండి ధరలు మాత్రం స్థిరంగా నమోదు అయ్యాయి. కిలో వెండి ధర రూ. 69,300 వద్ద కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.