Site icon NTV Telugu

Gold Rates: మగువలకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!

Gold

Gold

పసిడి ప్రియులకు మళ్లీ షాక్. కనకం మరోసారి ఝలక్ ఇచ్చింది. రోజుకోలాగా ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు మళ్లీ పెరిగిపోయింది. దీంతో కొనుగోలుదారులు హడలెత్తిపోతున్నారు. పెళ్లిళ్లు.. అనేక శుభకార్యాల జరుగుతున్న సమయంలో బంగారం ధరలు పెరిగిపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.1,970 పెరగగా.. వెండి మాత్రం ఉపశమనం కలిగించింది. కిలో వెండిపై రూ.5,000 తగ్గింది.

ఇది కూడా చదవండి: Nigeria Video: విమానం గాల్లో ఉండగా ఇంజిన్‌లో పేలుడు.. హడలెత్తిపోయిన ప్రయాణికులు

తులం గోల్డ్‌పై రూ.1,970 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,57,750 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.1,800 పెరగడంతో రూ.1,44,600 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,470 పెరగడంతో రూ.1,18,310 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఇది కూడా చదవండి: Trump: ఇరాన్‌లో పాలన మార్పు తథ్యం.. డీల్ కుదరకపోతే జరిగేది అదేనన్న ట్రంప్

ఈరోజు సిల్వర్ ధర ఊరటనిచ్చింది. కిలో వెండిపై ఏకంగా రూ.5,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2, 75, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,80,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో మాత్రం కిలో వెండి ధర రూ.2,75, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.

Exit mobile version