Layoffs : ఏడు నెలల్లో రికార్డు స్థాయిలో 2.24లక్షల ఉద్యోగాలు మటాష్.. కారణం ఇదే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Layoffs : ప్రతికూల ఆర్థిక పరిస్థితుల మధ్య ప్రపంచం మొత్తం దాదాపు రెండేళ్లుగా రిట్రెంచ్మెంట్ను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా టెక్ రంగంలో ఈ రిట్రెంచ్మెంట్ తీవ్రంగా ఉంది. ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీలన్నీ ఖర్చును తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలోనే భారీగా ఉద్యోగాల్లో కోతలు విధించాయి. ఎంత పెద్ద కంపెనీ కూడా దీని భారినుంచి తప్పించుకోలేకపోయింది. 2023 సంవత్సరం స్టార్టింగ్ నుంచి రిట్రెంచ్ మెంట్ రేటు పెరిగింది. తొలి ఏడు నెలల్లోనే గతేడాది మొత్తం రికార్డును బద్దలు కొట్టింది. 2023 సంవత్సరంలో ఇప్పటివరకు టెక్ కంపెనీలు 2.26 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. ఈ సంఖ్య ఎవరూ ఊహించని దానికంటే ఎక్కువ. ప్రస్తుతం కొత్త రిక్రూట్ మెంట్ లను ఏవీ కంపెనీలు చేపట్టకపోగా ఉన్న ఉద్యోగాలు పోతాయన్న భయంలో ఉద్యోగులు ఉన్నారు. అంతకుముందు సంవత్సరం కూడా కరోనా పుణ్యమాని కంపెనీలు దాదాపు రెండు లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించి ఇంటికి పంపించాయి.
Read Also:Raviteja: ‘టైగర్’ వేటకి టైమ్ షురూ అయ్యింది…
Also Read
- Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
- Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
- Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
- Ajit Agarkar: మనసు మార్చుకున్న అజిత్ అగార్కర్.. తుది నిర్ణయం బీసీసీఐకి వెల్లడి...
గతేడాది 2022 సంవత్సరంలో మొత్తం 12 నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని టెక్ కంపెనీలు 2.02 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి. అయితే ఈ సంవత్సరం మొదటి ఏడు నెలల్లో ఈ సంఖ్య 2.26 లక్షలకు చేరుకుంది. అంటే ఒకే ఏడాదిలో అత్యధిక ఉద్యోగుల తొలగింపు రికార్డును ఇప్పటికే బద్దలు కొట్టడమే కాకుండా గతేడాది మొత్తం 12 నెలల కంటే ఈ ఏడు నెలల్లో 40 శాతం ఎక్కువ తొలగింపులు జరిగాయి. ప్రపంచంలోని అనేక ప్రముఖ కంపెనీలు లేఆఫ్ కంపెనీలలో చేర్చబడ్డాయి. వీటిలో గూగుల్, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, మైక్రోసాఫ్ట్, అమెజాన్ పేర్లు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి. దాదాపు రెండేళ్లుగా టెక్ రంగంలో కొనసాగుతున్న భారీ లేఆఫ్లకు అనేక కారణాలను ఆపాదిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి దీనికి అతిపెద్ద కారణం. అయితే ప్రపంచ రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసు సవాళ్లు, అమ్మకాల ముందు క్షీణత కూడా టెక్ కంపెనీలకు సమస్యలను పెంచుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలలో ఉపసంహరణ దశ 2021 సంవత్సరంలో ప్రారంభమైంది. టెక్ కంపెనీలు 2021 సంవత్సరం చివరి నెలల నుండి లేఆఫ్లను ప్రారంభించాయి. అధ్వాన్నమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇది తీవ్రతరం అవుతూనే ఉంది. 2021 సంవత్సరంలో టెక్ కంపెనీలలో దాదాపు 15-20 వేల తొలగింపులు నమోదయ్యాయి. ఈ విధంగా గత 2 సంవత్సరాలలో ఒక్క టెక్ రంగంలోనే 4 లక్షల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారు.
తాజావార్తలు
-
Transport Department: రవాణా శాఖ ఉద్యోగ నిబంధనల్లో భారీ మార్పులు.. కీలక ఉత్తర్వులు జారీ..
-
Kejriwal: కేజ్రీవాల్ ఫ్యామిలీలో ఐదుగురికి ‘సర్’ నోటీసులు
-
Hyderabad Rains : హైదరాబాద్ను ముంచెత్తిన కుండపోత.. ఈదురుగాలులతో హై అలర్ట్.!
-
Pakistan: పాక్లో ఇంధన మంటలు.. రూ.400కు చేరిన లీటర్ పెట్రోల్.. గాడిదలతో నాయకుల నిరసన
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!