G-7 Summit: ప్రధాని మోడీతో సెల్పీ దిగిన జార్జియా మెలోని
- మోడీతో సెల్పీ దిగిన జార్జియా మెలోని
- జీ-7 సదస్సు తిరిగి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ
- ఆతిథ్యానికి కృతజ్ఞతలు చెప్పిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Melodi : జీ-7 సదస్సు నుంచి ప్రధాని నరేంద్ర మోడీ భారత్కు తిరిగొచ్చారు. ఇటలీ ప్రజలు, ప్రభుత్వం వారి ఆత్మీయ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రధాని మోడీ ఇటలీ పర్యటనకు ముందు కూడా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనితో ఆయన భేటీ గురించి సోషల్ మీడియాలో అత్యంత ఉత్సుకత నెలకొంది. జీ-7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రపంచంలోని అగ్రనాయకులలో కూడా అతని క్రేజ్ కనిపించింది. వరుసగా మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో సహా అనేక మంది ప్రపంచ నాయకులతో సంభాషించారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ఆయనతో సెల్ఫీ దిగారు. ఇది కాకుండా గ్రూప్ ఫోటో సమయంలో అతనికి వేదిక మధ్యలో ఒక ముఖ్యమైన స్థానం ఇచ్చారు.
Read Also:Infinix Note 40 5G: ఇన్ఫినిక్స్ నుంచి 5జీ ఫోన్.. లాంచ్, ఫీచర్ల వివరాలు ఇవే!
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
ప్రధాని మోడీ శనివారం ఉదయం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు అందులో.. “అపులియాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం చాలా ఉపయోగకరంగా ఉంది. ప్రపంచ నేతలతో కలిసి సంభాషించి పలు అంశాలపై చర్చించారు. గ్లోబల్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చే ప్రభావవంతమైన పరిష్కారాలను రూపొందించడం, భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడం మా లక్ష్యం. ఇటలీ ప్రజలు, ప్రభుత్వం వారి సాదర ఆతిథ్యానికి ధన్యవాదాలు.’’ అంటూ రాసుకొచ్చారు.
Read Also:Air Force Chief: భారత వైమానిక దళంలోని ప్రతి ఒక్కరు అంకిత భావంతో పని చేయాలి..
ప్రధాని మోడీ కూడా జో బిడెన్తో విడివిడిగా మాట్లాడారు. సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్రలో భారత్ సంబంధం ఉందని వాషింగ్టన్ ఆరోపించిన ఏడు నెలల తర్వాత ఈ మోడీ-బిడెన్ సంభాషణ జరిగింది. బిడెన్తో తన సమావేశం తర్వాత ప్రపంచ శ్రేయస్సును అభివృద్ధి చేయడానికి భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ కలిసి పనిచేస్తామని ట్విట్టర్లో పేర్కొన్నారు. తన పర్యటన తొలిరోజు కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో కూడా ప్రధాని భేటీ అయ్యారు. జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీని ఆహ్వానించడం, వేగంగా ఎదుగుతున్న చైనాను ఎదుర్కోవడానికి పశ్చిమ దేశాల ప్రణాళికల్లో భారత్కు ప్రముఖ స్థానం లభిస్తోందనడానికి సూచన. భారత్తో పాటు 11 అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలను కూడా ఆహ్వానించారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!