G-7 Summit: ప్రధాని మోడీతో సెల్పీ దిగిన జార్జియా మెలోని
- మోడీతో సెల్పీ దిగిన జార్జియా మెలోని
- జీ-7 సదస్సు తిరిగి వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ
- ఆతిథ్యానికి కృతజ్ఞతలు చెప్పిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Melodi : జీ-7 సదస్సు నుంచి ప్రధాని నరేంద్ర మోడీ భారత్కు తిరిగొచ్చారు. ఇటలీ ప్రజలు, ప్రభుత్వం వారి ఆత్మీయ ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపాడు. ప్రధాని మోడీ ఇటలీ పర్యటనకు ముందు కూడా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనితో ఆయన భేటీ గురించి సోషల్ మీడియాలో అత్యంత ఉత్సుకత నెలకొంది. జీ-7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం లభించింది. ప్రపంచంలోని అగ్రనాయకులలో కూడా అతని క్రేజ్ కనిపించింది. వరుసగా మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇదే. ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో సహా అనేక మంది ప్రపంచ నాయకులతో సంభాషించారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కూడా ఆయనతో సెల్ఫీ దిగారు. ఇది కాకుండా గ్రూప్ ఫోటో సమయంలో అతనికి వేదిక మధ్యలో ఒక ముఖ్యమైన స్థానం ఇచ్చారు.
Read Also:Infinix Note 40 5G: ఇన్ఫినిక్స్ నుంచి 5జీ ఫోన్.. లాంచ్, ఫీచర్ల వివరాలు ఇవే!
Also Read
- Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
- Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Plastic Chair Cleaning Tips: తెల్లటి ప్లాస్టిక్ కుర్చీలపై మొండి మరకలా? వంటింట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీ క్లీనింగ్
ప్రధాని మోడీ శనివారం ఉదయం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు అందులో.. “అపులియాలో జరిగిన జీ7 శిఖరాగ్ర సమావేశం చాలా ఉపయోగకరంగా ఉంది. ప్రపంచ నేతలతో కలిసి సంభాషించి పలు అంశాలపై చర్చించారు. గ్లోబల్ కమ్యూనిటీకి ప్రయోజనం చేకూర్చే ప్రభావవంతమైన పరిష్కారాలను రూపొందించడం, భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడం మా లక్ష్యం. ఇటలీ ప్రజలు, ప్రభుత్వం వారి సాదర ఆతిథ్యానికి ధన్యవాదాలు.’’ అంటూ రాసుకొచ్చారు.
Read Also:Air Force Chief: భారత వైమానిక దళంలోని ప్రతి ఒక్కరు అంకిత భావంతో పని చేయాలి..
ప్రధాని మోడీ కూడా జో బిడెన్తో విడివిడిగా మాట్లాడారు. సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్రలో భారత్ సంబంధం ఉందని వాషింగ్టన్ ఆరోపించిన ఏడు నెలల తర్వాత ఈ మోడీ-బిడెన్ సంభాషణ జరిగింది. బిడెన్తో తన సమావేశం తర్వాత ప్రపంచ శ్రేయస్సును అభివృద్ధి చేయడానికి భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ కలిసి పనిచేస్తామని ట్విట్టర్లో పేర్కొన్నారు. తన పర్యటన తొలిరోజు కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడాతో కూడా ప్రధాని భేటీ అయ్యారు. జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోడీని ఆహ్వానించడం, వేగంగా ఎదుగుతున్న చైనాను ఎదుర్కోవడానికి పశ్చిమ దేశాల ప్రణాళికల్లో భారత్కు ప్రముఖ స్థానం లభిస్తోందనడానికి సూచన. భారత్తో పాటు 11 అభివృద్ధి చెందుతున్న దేశాల నేతలను కూడా ఆహ్వానించారు.
తాజావార్తలు
-
Agni-4 Ballistic Missile: పాకిస్తాన్ మొత్తం భారత పరిధిలో.. అగ్ని-4 మిస్సైల్ సక్సెస్..
-
Forbes Best Under a Billion 2026: చైనాకు ఒక్క అడుగు దూరంలో భారత్.. ఫోర్బ్స్ జాబితాలో టాప్-200లో 27 సంస్థలు
-
AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్కు ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
-
Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
-
Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!