Uttar Pradesh : రాష్ట్రపతి భవన్కు 21 కిలోమీటర్ల దూరంలో చిరుత .. అలర్టైన అటవీ శాఖ
- రాష్ట్రపతి భవన్ సమీపంలో చిరుతపులి
- అటవీ శాఖ అధికారుల సెర్చింగ్ ఆపరేషన్
- భయాందోళనలో సమీప ప్రాంతాల గ్రామస్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh : రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారోత్సవం రోజున చిరుతపులి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తర్వాత రాష్ట్రపతి భవన్ కు సరిగ్గా 21 కిలోమీటర్ల దూరంలో చిరుతపులి కనిపించింది. ఈ ఘటన ఘజియాబాద్లోని లోని ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇక్కడ చిరుతపులి కనిపించడంతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుతపులి జాడ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఘజియాబాద్ జిల్లాలోని లోని జావలి గ్రామంలో చిరుతపులి కనిపించింది. మంగళవారం మధ్యాహ్నం చిరుత కనిపించింది. చిరుత ఉనికిని నిర్ధారించేందుకు అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు ఆ ప్రాంతంలో సెర్చింగ్ చేస్తున్నారు. గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మహిళలు, పిల్లలను వారి ఇళ్లలోనే బంధిస్తున్నారు. గ్రామంలోని శివాలయం సమీపంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు కొందరు గ్రామస్తులు చెబుతున్నారు. అటవీ సంరక్షకులు సంఘటనా స్థలంలో ఉన్నారు.
Also Read
- Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా 'Rupee'.. పతనానికి అసలు కారణం ఇదే..
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
- Caste Census: కులగణనకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
Read Also:Bomb Threat: ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు.. 15 మ్యూజియంలకు హెచ్చరికలు..!
శివాలయం దగ్గర చిరుతపులి
చిరుతపులి సంచరిస్తుందన్న వార్తతో గ్రామస్తులు కంటిమీద కునుకులేకుండా భయపడుతున్నారు. అటవీ శాఖ బృందం ఆ ప్రాంతంలో కూంబింగ్ చేస్తోంది. జావళి-సకల్పురా రోడ్డులోని ఇటుక బట్టీలో పనిచేస్తున్న కూలీలు చిరుతపులి కనిపించినట్లు తెలిపారు. ఇటుక బట్టీకి ఎదురుగా శివాలయం ఉంది. బట్టీలో చిరుతపులిలాంటి జంతువు కనిపించడంతో కూలీలు భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపటికే చిరుతపులి కనిపించిందన్న వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
రాష్ట్రపతి భవన్ వీడియో వైరల్
నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా చిరుతపులి కనిపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది, ఇందులో బీజేపీ ఎంపీ దుర్గా దాస్ ఉకే ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్రపతి భవన్ కారిడార్లో ఓ జంతువు సంచరిస్తూ కనిపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో కారిడార్లో నడుస్తున్న జంతువు చిరుతపులి అని ఊహాగానాలు వచ్చాయి. ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. అది చిరుతపులి కాదని, రాష్ట్రపతి భవన్లో నివసిస్తున్న పెంపుడు పిల్లి అని చెప్పారు. ఢిల్లీ పోలీసులు దీనిని పుకారు అని, దీనిని పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
Read Also:TG TET-DSC: టెట్, డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త.. ఉచితంగా దరఖాస్తులు చేసుకోండి..
తాజావార్తలు
-
Allu Arjun: ‘ఈసారి టైగర్ కాదు.. డ్రాగన్’.. అంటూ బావ కోసం బన్నీ స్పెషల్ విషెస్ ..
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
Justin Langer: ఇప్పుడే ఇలా ఆడుతుంటే, అప్పటికి ఊహించలేం.. వైభవ్తో ప్రపంచ క్రికెట్కు వణుకే!
-
Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
ట్రెండింగ్
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!