Uttar Pradesh : రాష్ట్రపతి భవన్కు 21 కిలోమీటర్ల దూరంలో చిరుత .. అలర్టైన అటవీ శాఖ
- రాష్ట్రపతి భవన్ సమీపంలో చిరుతపులి
- అటవీ శాఖ అధికారుల సెర్చింగ్ ఆపరేషన్
- భయాందోళనలో సమీప ప్రాంతాల గ్రామస్తులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh : రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారోత్సవం రోజున చిరుతపులి కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తర్వాత రాష్ట్రపతి భవన్ కు సరిగ్గా 21 కిలోమీటర్ల దూరంలో చిరుతపులి కనిపించింది. ఈ ఘటన ఘజియాబాద్లోని లోని ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇక్కడ చిరుతపులి కనిపించడంతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుతపులి జాడ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఘజియాబాద్ జిల్లాలోని లోని జావలి గ్రామంలో చిరుతపులి కనిపించింది. మంగళవారం మధ్యాహ్నం చిరుత కనిపించింది. చిరుత ఉనికిని నిర్ధారించేందుకు అటవీశాఖ అధికారులు, ఉద్యోగులు ఆ ప్రాంతంలో సెర్చింగ్ చేస్తున్నారు. గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మహిళలు, పిల్లలను వారి ఇళ్లలోనే బంధిస్తున్నారు. గ్రామంలోని శివాలయం సమీపంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు కొందరు గ్రామస్తులు చెబుతున్నారు. అటవీ సంరక్షకులు సంఘటనా స్థలంలో ఉన్నారు.
Also Read
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
- Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
- YS Jagan: 'సీఎంగా ఏం చేస్తున్నా' అని చంద్రబాబు ప్రశ్నించుకోవాలి.. వైఎస్ జగన్ ఫైర్!
- Konda Murali: కొండా సురేఖ ఎపిసోడ్పై రాయబారం.. భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ..
Read Also:Bomb Threat: ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు.. 15 మ్యూజియంలకు హెచ్చరికలు..!
శివాలయం దగ్గర చిరుతపులి
చిరుతపులి సంచరిస్తుందన్న వార్తతో గ్రామస్తులు కంటిమీద కునుకులేకుండా భయపడుతున్నారు. అటవీ శాఖ బృందం ఆ ప్రాంతంలో కూంబింగ్ చేస్తోంది. జావళి-సకల్పురా రోడ్డులోని ఇటుక బట్టీలో పనిచేస్తున్న కూలీలు చిరుతపులి కనిపించినట్లు తెలిపారు. ఇటుక బట్టీకి ఎదురుగా శివాలయం ఉంది. బట్టీలో చిరుతపులిలాంటి జంతువు కనిపించడంతో కూలీలు భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపటికే చిరుతపులి కనిపించిందన్న వార్త ఆ ప్రాంతమంతా వ్యాపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
రాష్ట్రపతి భవన్ వీడియో వైరల్
నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా చిరుతపులి కనిపించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయ్యింది, ఇందులో బీజేపీ ఎంపీ దుర్గా దాస్ ఉకే ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్రపతి భవన్ కారిడార్లో ఓ జంతువు సంచరిస్తూ కనిపించింది. ఈ వీడియో వైరల్ కావడంతో కారిడార్లో నడుస్తున్న జంతువు చిరుతపులి అని ఊహాగానాలు వచ్చాయి. ఢిల్లీ పోలీసులు ఈ విషయాన్ని ధృవీకరించారు. అది చిరుతపులి కాదని, రాష్ట్రపతి భవన్లో నివసిస్తున్న పెంపుడు పిల్లి అని చెప్పారు. ఢిల్లీ పోలీసులు దీనిని పుకారు అని, దీనిని పట్టించుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
Read Also:TG TET-DSC: టెట్, డీఎస్సీ అభ్యర్థులకు శుభవార్త.. ఉచితంగా దరఖాస్తులు చేసుకోండి..
తాజావార్తలు
-
Success Story: ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్నే మార్చేసింది.. IT జాబ్ వదిలి మష్రూమ్ బిజినెస్తో లక్షలు!
-
Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ న్యూయార్క్ ఈవెంట్.. మమ్దానీపై యూఎస్ సింగర్ ఘాటు వ్యాఖ్యలు..
-
Kriti Sanon: రాహుల్గాంధీ-కంగనా మాటల యుద్ధం.. కృతి సనన్ రక్షాబంధన్ యాడ్ తొలగింపు
-
Konda Murali : కాంగ్రెస్ను వీడేది లేదు, వివాదంతో నాకు సంబంధం లేదు.. కొండా మురళి సంచలనం
-
Yash’s Toxic: యశ్కి అగ్నిపరీక్ష.. ‘టాక్సిక్’ ముందు ఏకంగా రూ.1000 కోట్ల టార్గెట్!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..