Dhruva Nakshathram postponed: విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ సినిమా మళ్లీ వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhruva Nakshathram postponed: తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలంటే తమిళంతో పాటు, తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తుంటారు. అతను విక్రమ్తో గత ఐదేళ్ల క్రితం షూటింగ్ మొదలు పెట్టిన సినిమా ‘ధృవ నక్షత్రం’ ఈరోజు విడుదల కావాల్సి ఉంది. కానీ, మళ్లీ వాయిదా వేసినట్లు దర్శకుడు గౌతమ్ ఈ రోజు తెల్లవారుజామున ప్రకటించారు. ‘ధృవ నక్షత్రం’ సినిమాని విక్రమ్ తో కొన్నేళ్ల ముందు మొదలెట్టారు. ఆర్థిక ఇబ్బందులు కారణంగా సినిమా షూటింగ్ నత్త నడకన సాగింది. ఒక ఐదేళ్ల పాటు షూటింగ్ జరిగి, ఈరోజు నవంబర్ 24న విడుదలవుతుందని దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రకటించారు. ఇప్పటికైనా సినిమా విడుదలవుతుందని విక్రమ్ అభిమానులు భావించారు. అదీ కాకుండా ఈ సినిమాకి ప్రమోషన్లు కూడా పెద్దగా నిర్వహించలేదు.
Read Also:Maharashtra: ముంబై విమానాశ్రయంలోని టెర్మినల్ 2ను పేల్చివేస్తామని బెదిరింపు
Also Read
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
- Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
ఈరోజు విడుదలవ్వాల్సిన ‘ధృవ నక్షత్రం’ సినిమా మళ్ళీ వాయిదా పడింది. స్వయంగా దర్శకుడు, నిర్మాత అయిన గౌతమ్ మీనన్ ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 24న ఈ సినిమా విడుదలవ్వాల్సి ఉంది. కానీ ఈరోజు తెల్లవారుజామున గౌతమ్ ఒక ప్రకటన చేస్తూ, “ఈరోజు ‘ధృవ నక్షత్రం’ సినిమాని థియేటర్స్ లోకి తీసుకురాలేకపోయినందుకు క్షమించండి. మాకు ఇంకో ఒకటి రెండు రోజుల సమయం పడుతుందని అనుకుంటున్నాను. ఇంకా కొన్ని రోజుల్లో వచ్చేస్తాం, మీకు ఈ సినిమా అనుభూతిని మంచి థియేటర్స్ లో చూపిస్తాము,” అనుకుంటూ రాసుకొచ్చాడు.
Read Also:Fukrey 3 : ఓటీటీ లోకి వచ్చేసిన బాలీవుడ్ సూపర్ హిట్ కామెడీ మూవీ..
ఈ సినిమాకి తమిళంలో ‘ధృవ నచ్చతిరం’ అని పెట్టారు. అయితే ముందుగా ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని అనుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల వలన ఈ సినిమా చాలా ఆలస్యం అయింది. ఇటీవల ఈ చిత్ర నిర్వాహకులు “ట్రైల్ బ్లేజర్” పేరుతో ఒక చిన్న ప్రోమోను విడుదల చేశారు, అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఇందులో యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయని కూడా అందరూ అంటున్నారు. ఈ సినిమాలో జాన్గా విక్రమ్ నటిస్తున్నాడు. ఇది ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఇందులో విక్రమ్ సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటించగా, పార్తిబన్, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, రాధిక, అర్జున్ దాస్, దివ్యదర్శిని కీలక పాత్రలు పోషించారు. హారిస్ జయరాజ్ మ్యూజిక్ అందించాడు.
#DhruvaNatchathiram #DhruvaNakshathram pic.twitter.com/dmD4ndEnp9
— Gauthamvasudevmenon (@menongautham) November 23, 2023
తాజావార్తలు
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Vishnu Vishal : నాలుగేళ్లుగా ఆ వ్యాధితో పోరాడుతున్నా.. హీరో విష్ణు విశాల్ ఎమోషనల్
ట్రెండింగ్
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?