Gadwal Road Accident: దైవదర్శనానికి వెళుతుండగా.. ఘోర ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు ప్రమాదాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. దైవదర్శనానికి సంతోషంగా వెళుతున్న కుటుంబంపై విధి కాటేసింది. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారి 44 పై జరిగిన కారు ప్రమాదం హృదయ విదారకంగా మారింది. ప్రమాదం జరిగిన చోట రహదారిపై చెల్లా చెదురుగా పడిపోయాయి మృతదేహాలు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ కు చెందిన ప్రకాశం, లక్ష్మి దంపతులు తమ కూతురి పుట్టినరోజు సందర్భంగా ఇంకో కూతురితో కలిసి నలుగురు తిరుపతికి దైవ దర్శనానికి బయలుదేరారు.
జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దులకు రాగానే ఇటిక్యాల మండలం ధర్మారం గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని వెనక నుండి వేగంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న తల్లి లక్ష్మి (50) కూతురు శ్రీలత (18) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ప్రకాశం (55) మరో కూతురు మానస (17) తీవ్రంగా గాయపడడంతో హుటాహుటిన కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పాలకొల్లులో తృటిలో తప్పిన ప్రమాదం
Also Read
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. స్థానిక సొంత మార్కెట్ వద్ద నుండి ప్రధాన రహదారి వైపునకు వెళుతున్న కొబ్బరి డొక్క లోడు డాక్టర్ ట్రక్కు స్థానిక ఆంజనేయస్వామి గుడి వద్ద ఉన్న కాలువ ఎత్తు ర్యాంపు ఎక్కుతున్న సమయంలో ట్రాక్టర్ వెనక్కి జారి అదుపుతప్పి బోల్తా కొట్టింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఆకస్మికంగా జరిగిన ఘటనలో అటుగా వెళుతున్న రెండు బైకులు ఈ ప్రమాదానికి గురయ్యాయి. అయితే అదృష్టవశాత్తు బైక్ పై వెళ్తున్నవారు బైక్ నుండి దూకి ప్రమాదం నుండి తప్పించుకున్నారు. వీరిలో ఇద్దరు సచివాలయం సిబ్బంది ఉన్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహకారంతో ట్రాక్టర్ ను అక్కడినుంచి తరలించారు. ఆరహదారిలో ట్రాఫిక్ క్లియర్ చేశారు. దీంతో దాదాపు మూడు గంటల సేపు బస్టాండ్ కి రావలసిన ఆర్టీసీ బస్సులను ప్రధాన రహదారి గుండా బస్టాండ్ కు మళ్ళించారు.
Read Also: AUS Vs ENG: వరుణుడి ఖాతాలో నాలుగో మ్యాచ్.. మెగా టోర్నీలో మరో కీలక మ్యాచ్ రద్దు
తాజావార్తలు
-
Tollywood: ఫేక్ హౌస్ఫుల్స్… డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త “మైండ్ గేమ్”!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
-
Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!