Gadwal Road Accident: దైవదర్శనానికి వెళుతుండగా.. ఘోర ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు ప్రమాదాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. దైవదర్శనానికి సంతోషంగా వెళుతున్న కుటుంబంపై విధి కాటేసింది. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారి 44 పై జరిగిన కారు ప్రమాదం హృదయ విదారకంగా మారింది. ప్రమాదం జరిగిన చోట రహదారిపై చెల్లా చెదురుగా పడిపోయాయి మృతదేహాలు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ కు చెందిన ప్రకాశం, లక్ష్మి దంపతులు తమ కూతురి పుట్టినరోజు సందర్భంగా ఇంకో కూతురితో కలిసి నలుగురు తిరుపతికి దైవ దర్శనానికి బయలుదేరారు.
జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దులకు రాగానే ఇటిక్యాల మండలం ధర్మారం గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని వెనక నుండి వేగంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న తల్లి లక్ష్మి (50) కూతురు శ్రీలత (18) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ప్రకాశం (55) మరో కూతురు మానస (17) తీవ్రంగా గాయపడడంతో హుటాహుటిన కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పాలకొల్లులో తృటిలో తప్పిన ప్రమాదం
Also Read
- Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
- Ketan Murder Case: "ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం".. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. స్థానిక సొంత మార్కెట్ వద్ద నుండి ప్రధాన రహదారి వైపునకు వెళుతున్న కొబ్బరి డొక్క లోడు డాక్టర్ ట్రక్కు స్థానిక ఆంజనేయస్వామి గుడి వద్ద ఉన్న కాలువ ఎత్తు ర్యాంపు ఎక్కుతున్న సమయంలో ట్రాక్టర్ వెనక్కి జారి అదుపుతప్పి బోల్తా కొట్టింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఆకస్మికంగా జరిగిన ఘటనలో అటుగా వెళుతున్న రెండు బైకులు ఈ ప్రమాదానికి గురయ్యాయి. అయితే అదృష్టవశాత్తు బైక్ పై వెళ్తున్నవారు బైక్ నుండి దూకి ప్రమాదం నుండి తప్పించుకున్నారు. వీరిలో ఇద్దరు సచివాలయం సిబ్బంది ఉన్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహకారంతో ట్రాక్టర్ ను అక్కడినుంచి తరలించారు. ఆరహదారిలో ట్రాఫిక్ క్లియర్ చేశారు. దీంతో దాదాపు మూడు గంటల సేపు బస్టాండ్ కి రావలసిన ఆర్టీసీ బస్సులను ప్రధాన రహదారి గుండా బస్టాండ్ కు మళ్ళించారు.
Read Also: AUS Vs ENG: వరుణుడి ఖాతాలో నాలుగో మ్యాచ్.. మెగా టోర్నీలో మరో కీలక మ్యాచ్ రద్దు
తాజావార్తలు
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
Vaibhav Sooryavanshi Debut: ఎంతో ప్రతిభ ఉన్నా.. వైభవ్ సూర్యవంశీకి అరంగేట్రం చేసే అర్హత ఉందా?
-
Ketan Murder Case: “ఒక్క మాట చెబితే పెళ్లి ఆపేవాళ్లం”.. కూతురు ఘాతుకంపై తల్లిదండ్రుల కన్నీటిపర్యంతం!
-
Muskan Pradhan: తాగొచ్చిన వరుడికి చెంపదెబ్బ.. ఇప్పుడు మహిళలకు మార్గదర్శి! కౌన్సెలర్గా నియమితురాలైన ముస్కాన్
-
Asha Bhosle : ఆశా భోస్లేకు బ్రిటిష్ బ్యాండ్ గొరిల్లాజ్ ఘన నివాళి.. లండన్ స్టేడియంలో భావోద్వేగ క్షణాలు
ట్రెండింగ్
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!