Gadwal Road Accident: దైవదర్శనానికి వెళుతుండగా.. ఘోర ప్రమాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోడ్డు ప్రమాదాలు కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. దైవదర్శనానికి సంతోషంగా వెళుతున్న కుటుంబంపై విధి కాటేసింది. ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారి 44 పై జరిగిన కారు ప్రమాదం హృదయ విదారకంగా మారింది. ప్రమాదం జరిగిన చోట రహదారిపై చెల్లా చెదురుగా పడిపోయాయి మృతదేహాలు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ కు చెందిన ప్రకాశం, లక్ష్మి దంపతులు తమ కూతురి పుట్టినరోజు సందర్భంగా ఇంకో కూతురితో కలిసి నలుగురు తిరుపతికి దైవ దర్శనానికి బయలుదేరారు.
జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దులకు రాగానే ఇటిక్యాల మండలం ధర్మారం గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న డీసీఎం వాహనాన్ని వెనక నుండి వేగంగా ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న తల్లి లక్ష్మి (50) కూతురు శ్రీలత (18) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ప్రకాశం (55) మరో కూతురు మానస (17) తీవ్రంగా గాయపడడంతో హుటాహుటిన కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పాలకొల్లులో తృటిలో తప్పిన ప్రమాదం
Also Read
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Tilak Varma: "నమ్మకమే నా బలం.." అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. స్థానిక సొంత మార్కెట్ వద్ద నుండి ప్రధాన రహదారి వైపునకు వెళుతున్న కొబ్బరి డొక్క లోడు డాక్టర్ ట్రక్కు స్థానిక ఆంజనేయస్వామి గుడి వద్ద ఉన్న కాలువ ఎత్తు ర్యాంపు ఎక్కుతున్న సమయంలో ట్రాక్టర్ వెనక్కి జారి అదుపుతప్పి బోల్తా కొట్టింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ఆకస్మికంగా జరిగిన ఘటనలో అటుగా వెళుతున్న రెండు బైకులు ఈ ప్రమాదానికి గురయ్యాయి. అయితే అదృష్టవశాత్తు బైక్ పై వెళ్తున్నవారు బైక్ నుండి దూకి ప్రమాదం నుండి తప్పించుకున్నారు. వీరిలో ఇద్దరు సచివాలయం సిబ్బంది ఉన్నారు. అనంతరం అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సహకారంతో ట్రాక్టర్ ను అక్కడినుంచి తరలించారు. ఆరహదారిలో ట్రాఫిక్ క్లియర్ చేశారు. దీంతో దాదాపు మూడు గంటల సేపు బస్టాండ్ కి రావలసిన ఆర్టీసీ బస్సులను ప్రధాన రహదారి గుండా బస్టాండ్ కు మళ్ళించారు.
Read Also: AUS Vs ENG: వరుణుడి ఖాతాలో నాలుగో మ్యాచ్.. మెగా టోర్నీలో మరో కీలక మ్యాచ్ రద్దు
తాజావార్తలు
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!