Interesting Moment : స్పీకర్ గడ్డం Vs మంత్రి పొన్నం.. కరాటే ఛాంపియన్షిప్లో అసక్తికర సన్నివేశం..
- గచ్చిబౌలిలో కరాటే ఛాంపియన్షిప్ గ్రాండ్ ఓపెనింగ్
- ప్రముఖ నేతల సమక్షంలో పోటీలు ప్రారంభం!
- స్పీకర్ ప్రసాద్ Vs మంత్రి పొన్నం – కరాటేలో సరదా పోటీ
- ప్రత్యేక ఆకర్షణగా నిఖత్ జరీన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Interesting Moment : తెలంగాణ రాజకీయ వేదిక నుంచి కరాటే మ్యాట్పైకి.. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేరుగా కరాటే రింగ్లో తలపడ్డారు! ఇదేదో యాక్షన్ సినిమా సన్నివేశం కాదు, హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో వాస్తవంగా జరిగిన విశేషం. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియంలో 4వ కియో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2025 ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమం రసవత్తరంగా సాగుతున్న వేళ, నిర్వాహకులు స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్లకు గౌరవార్థం కరాటే బ్లాక్ బెల్ట్ను ప్రదానం చేశారు.
కరాటే బెల్ట్లు అందుకున్న వెంటనే, ఇద్దరు నేతలు కరాటే పోజులిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. నేతల సరదా పోజులు చూసి వేదికపైనే కాక, ప్రేక్షక లోకంలోనూ కాసేపు హర్షధ్వానాలు మార్మోగాయి. మామూలుగా సభల్లో మాటలతోనే ఎదిరించే రాజకీయ నాయకులు, ఇప్పుడు కరాటే రింగ్లో తలపడుతున్నట్టుగా కనిపించడం విశేషమైంది. మూడురోజుల పాటు కొనసాగనున్న ఈ కియో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవానికి భారత బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ హాజరవ్వడం మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆమె తన స్పీచ్లో యువ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, క్రీడా ప్రాముఖ్యతను వివరించారు.
Also Read
- PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్కు మోడీ సందేశం
- HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
- Hardik Pandya: "కెప్టెన్సీ ఇస్తేనే వస్తా".. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
- Ram Nath Kovind Autobiography: సామాన్య కుటుంబం నుంచి రాష్ట్రపతి వరకు.. కోవింద్ జీవితంఆదర్శం-ప్రధాని మోడీ
ఈ సందర్భంగా TPCC చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ, “అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ చూపే క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది. క్రీడల ద్వారా యువత శారీరకంగా, మానసికంగా బలపడాలి” అని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, “క్రీడలు మన జీవితంలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. క్రీడల్లో పాల్గొంటే లైఫ్లో ఎదురయ్యే ప్రతీ సవాలును ధైర్యంగా ఎదుర్కోవచ్చు” అని తెలిపారు.
స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రం క్రీడల్లో ముందంజలో ఉండాలని, ప్రభుత్వ సహాయంతో క్రీడా సౌకర్యాలు మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం” అని తెలిపారు. క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డి మాట్లాడుతూ, “ఈ ఛాంపియన్షిప్ ద్వారా ఎంతోమంది యువ క్రీడాకారులకు ప్రోత్సాహం లభిస్తుంది. రాబోయే రోజుల్లో మరింత గొప్ప స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాం” అని చెప్పారు.
ఈ కియో నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో దేశవ్యాప్తంగా వేలాది మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. క్రీడాభిమానులకు ఇది ఒక అద్భుతమైన అనుభూతిని అందించే అవకాశముంది. రాబోయే మూడు రోజుల్లో వివిధ విభాగాల్లో ఆసక్తికరమైన పోటీలు జరగనున్నాయి. క్లుప్తంగా చెప్పాలంటే, ఈ కరాటే ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవం నేతల సరదా ముమ్మరాలతో, క్రీడా ప్రాధాన్యతను చాటిచెప్పే ప్రసంగాలతో, యువ క్రీడాకారుల ఉత్సాహంతో జయప్రదంగా సాగింది.
Bird flu: ఏపీలో 8 ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి.. సంచలన రిపోర్ట్..
తాజావార్తలు
-
PM Modi’s Message to Gen Z: రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల మాయలో పడొద్దు.. షార్ట్కట్లు వద్దు.. జెన్-జెడ్కు మోడీ సందేశం
-
Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
-
HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్!
-
Hardik Pandya: “కెప్టెన్సీ ఇస్తేనే వస్తా”.. గుజరాత్ ఫ్రాంచైజీకి హార్దిక్ పాండ్యా షాక్..
-
Independence Day TV Offers: బంపరాఫర్.. రూ.11,990కే స్మార్ట్ టీవీ..ఛాన్స్ మిస్ చేసుకోవద్దు!
ట్రెండింగ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!