Sunil Gavaskar – Rishabh Pant: స్టుపిడ్ టూ సూపర్బ్.. సునీల్ గవాస్కర్, పంత్ మధ్య మాములుగా లేదుగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sunil Gavaskar – Rishabh Pant:ఇంగ్లాండ్ టూర్ వెళ్లిన టీం ఇండియా మొదటి టెస్ట్ లోనే రికార్డుల మోత మోగిస్తోంది. ఒకే టెస్టులో ఐదు సెంచరీలు రావడంతో 93 ఏళ్ల చరిత్రను తిరగరాసింది టీమిండియా. ఇది ఇలా ఉండగా.. టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ చరిత్ర సృష్టించాడు. మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ లలో శతకాలతో చెలరేగిన పంత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఓకే టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో శతకాలు చేసిన వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ అరుదైన రికార్డును సృష్టించాడు. మొదటి ఇన్నింగ్స్ 134 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 118 పరుగులు చేయడంతో ఈ ఘనతను అందుకున్నాడు. ఇప్పటివరకు టెస్ట్ క్రికెట్ లో టీమిండియా తరఫున ఒక టెస్టులో రెండు సెంచరీలు సాధించిన ఏడవ బ్యాటర్ గా నిలిచాడు. అయితే, ఇంగ్లాండ్ లో ఈ ఫీట్ అందుకున్న మొదటి ఆటగాడు పంత్ కావడం విశేషం.
Read Also:Shubhanshu Shukla: రేపు రోదసిలోకి వెళ్లనున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా
Also Read
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
- Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
మొదటి ఇన్నింగ్స్ లో శతకం సాధించిన తర్వాత తనదైన స్టైల్ లో సంబరాలు చేసుకున్న రిషబ్ పంత్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అందుకు విరుద్ధంగా సాదాసీదాగా వ్యవహరించాడు. అయితే రెండో ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్ శతకం సాధించిన తర్వాత గ్రౌండ్ లోని స్టాండ్స్ లో ఉన్న టీమిండియా మాజీ ప్లేయర్, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ రిషబ్ పంత్ ను తనదైన స్టైల్ లో స్టంట్ చేయమని సంకేతాల ద్వారా కోరాడు. అయితే, రిషబ్ పంత్ మాత్రం ఈసారి ఆ పని చేయకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.
Read Also:TNPL 2025: బౌలింగే కాదు.. బ్యాటింగ్ లోనూ తగ్గేదేలే.. అద్భుతం చేసిన వరుణ్ చక్రవర్తి
గత ఆస్ట్రేలియా సిరీస్ లో అనవసర తప్పిదం చేసి అవుట్ అయిన పంత్ ను ఉద్దేశించి కామెంట్రీ బాక్స్ లో ఉన్న సునీల్ గవాస్కర్ స్టుపిడ్.. స్టుపిడ్.. స్టుపిడ్.. అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్ లో పంత్ సెంచరీ చేయగానే సూపర్బ్.. సూపర్బ్.. సూపర్బ్.. అంటూ కామెంట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఇకపోతే నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండు జట్టు రెండో ఇన్నింగ్స్ లో వికెట్ ఏమీ కోల్పోకుండా 21 పరుగులతో నిలిచింది. చివరి రోజు ఇరుజట్లు విజయం కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. టీమిండియా మ్యాచ్ గెలవాలంటే ఇంగ్లాండు పాథ్య్ వికెట్లను నెలకొల్చాలి. అదే ఇంగ్లాండ్ మ్యాచ్ గెలవాలంటే 350 పరుగులు చేయాలి.
Sunil Gavaskar asking Rishabh Pant to do Summersault celebration to which he replied next time for sure 😭❤️ pic.twitter.com/mzCbugYDfT
— RP17 Gang™ (@RP17Gang) June 23, 2025
తాజావార్తలు
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
-
నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
-
Sarah Taylor: చారిత్రక నిర్ణయం.. పురుషుల జట్టుకు తొలి మహిళా కోచ్ గా సారా టేలర్..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!