Fraud: పోలీసు అధికారినంటూ ఓ వ్యాపారి కుమారుడి నుంచి రూ. 3 కోట్లు కాజేత
- ఢిల్లీ పోలీస్ ఆఫీసరుగా నటించి కోల్కతాకు చెందిన ఓ వ్యాపారి కుమారుడి దగ్గరి నుంచి రూ.3 కోట్లు దోపిడీ చేశాడు. ఈ కేసులో హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులను మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సచిన్ కుమార్
- దీపక్ కుమార్ గా గుర్తించారు. కాగా.. తనకు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని బాధితుడు కోల్కతా పోలీసుల సైబర్ సెల్లో ఫిర్యాదు చేశాడు. కాల్ చేసిన వ్యక్తి తనను తాను ఢిల్లీ పోలీసు అధికారి అని చెప్పాడని తెలిపాడు. తనకు అనుమానాస్పదంగా పంపిన కొరియర్ను పరిశీలించగా.. అందులో డ్రగ్స్ దొరికాయని చెప్పాడు. ఈ కేసుపై సీబీఐ విచారణ ప్రారంభించింది. ఢిల్లీ పోలీసు బృందం త్వరలో కోల్కతాకు వచ్చి నిందితుడిని అరెస్టు చేయనుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ పోలీస్ ఆఫీసరుగా నటించి కోల్కతాకు చెందిన ఓ వ్యాపారి కుమారుడి దగ్గరి నుంచి రూ.3 కోట్లు దోపిడీ చేశాడు. ఈ కేసులో హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులను మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సచిన్ కుమార్, దీపక్ కుమార్ గా గుర్తించారు. కాగా.. తనకు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని బాధితుడు కోల్కతా పోలీసుల సైబర్ సెల్లో ఫిర్యాదు చేశాడు. కాల్ చేసిన వ్యక్తి తనను తాను ఢిల్లీ పోలీసు అధికారి అని చెప్పాడని తెలిపాడు. తనకు అనుమానాస్పదంగా పంపిన కొరియర్ను పరిశీలించగా.. అందులో డ్రగ్స్ దొరికాయని చెప్పాడు. ఈ కేసుపై సీబీఐ విచారణ ప్రారంభించింది. ఢిల్లీ పోలీసు బృందం త్వరలో కోల్కతాకు వచ్చి నిందితుడిని అరెస్టు చేయనుంది.
‘GST: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్లాట్ఫారమ్ టిక్కెట్లు, రైల్వే సేవలపై పన్ను మినహాయింపు..‘
Also Read
ఈ మోసాన్ని ఎలా చేస్తారనే విషయానికొస్తే.. నిందితులు డబ్బులు ఎక్కువగా ఉండే వ్యాపారిని టార్గెట్ చేసుకుని గుర్తిస్తారు. తాము పోలీసులమంటూ.. వారికి కొరియర్ ద్వారా డ్రగ్స్ పంపించి భయపెట్టిస్తారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అతన్ని బెదిరిస్తారు. అంతేకాకుండా.. కొరియర్ లోనే నకిలీ అరెస్ట్ వారెంట్ పంపిస్తారు. ఆ తర్వాత కాల్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఇలా ఓ వ్యాపారి కుమారుడి నుంచి రూ. 3 కోట్లు ఇవ్వాలని అడిగారు. ఆ డబ్బులు చెల్లిస్తే తన అరెస్టును నివారించవచ్చని చెప్పారు. తనను రక్షించుకోవడానికి.. అతను చెప్పిన బ్యాంకు ఖాతాలో డబ్బును జమ చేశాడు. కొద్దిరోజుల తర్వాత అతడి నుంచి మరింత డబ్బు డిమాండ్ చేయడంతో సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించాడు.
Minister Seethakka : ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం
డబ్బు జమ చేసిన బ్యాంకు ఖాతా నుంచి 10 బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు సైబర్ సెల్ దర్యాప్తులో తేలింది. అదే బ్యాంకు ఖాతాల ఆధారంగా హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. దీని వెనుక పెద్ద ముఠా హస్తం ఉన్నట్లు సైబర్ సెల్ అనుమానిస్తోంది. అరెస్టయిన ఇద్దరిని విచారించి, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!