Fraud: పోలీసు అధికారినంటూ ఓ వ్యాపారి కుమారుడి నుంచి రూ. 3 కోట్లు కాజేత
- ఢిల్లీ పోలీస్ ఆఫీసరుగా నటించి కోల్కతాకు చెందిన ఓ వ్యాపారి కుమారుడి దగ్గరి నుంచి రూ.3 కోట్లు దోపిడీ చేశాడు. ఈ కేసులో హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులను మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సచిన్ కుమార్
- దీపక్ కుమార్ గా గుర్తించారు. కాగా.. తనకు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని బాధితుడు కోల్కతా పోలీసుల సైబర్ సెల్లో ఫిర్యాదు చేశాడు. కాల్ చేసిన వ్యక్తి తనను తాను ఢిల్లీ పోలీసు అధికారి అని చెప్పాడని తెలిపాడు. తనకు అనుమానాస్పదంగా పంపిన కొరియర్ను పరిశీలించగా.. అందులో డ్రగ్స్ దొరికాయని చెప్పాడు. ఈ కేసుపై సీబీఐ విచారణ ప్రారంభించింది. ఢిల్లీ పోలీసు బృందం త్వరలో కోల్కతాకు వచ్చి నిందితుడిని అరెస్టు చేయనుంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ పోలీస్ ఆఫీసరుగా నటించి కోల్కతాకు చెందిన ఓ వ్యాపారి కుమారుడి దగ్గరి నుంచి రూ.3 కోట్లు దోపిడీ చేశాడు. ఈ కేసులో హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులను మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు సచిన్ కుమార్, దీపక్ కుమార్ గా గుర్తించారు. కాగా.. తనకు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చిందని బాధితుడు కోల్కతా పోలీసుల సైబర్ సెల్లో ఫిర్యాదు చేశాడు. కాల్ చేసిన వ్యక్తి తనను తాను ఢిల్లీ పోలీసు అధికారి అని చెప్పాడని తెలిపాడు. తనకు అనుమానాస్పదంగా పంపిన కొరియర్ను పరిశీలించగా.. అందులో డ్రగ్స్ దొరికాయని చెప్పాడు. ఈ కేసుపై సీబీఐ విచారణ ప్రారంభించింది. ఢిల్లీ పోలీసు బృందం త్వరలో కోల్కతాకు వచ్చి నిందితుడిని అరెస్టు చేయనుంది.
‘GST: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్లాట్ఫారమ్ టిక్కెట్లు, రైల్వే సేవలపై పన్ను మినహాయింపు..‘
Also Read
- Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
- Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
- Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
ఈ మోసాన్ని ఎలా చేస్తారనే విషయానికొస్తే.. నిందితులు డబ్బులు ఎక్కువగా ఉండే వ్యాపారిని టార్గెట్ చేసుకుని గుర్తిస్తారు. తాము పోలీసులమంటూ.. వారికి కొరియర్ ద్వారా డ్రగ్స్ పంపించి భయపెట్టిస్తారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అతన్ని బెదిరిస్తారు. అంతేకాకుండా.. కొరియర్ లోనే నకిలీ అరెస్ట్ వారెంట్ పంపిస్తారు. ఆ తర్వాత కాల్ చేసి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఇలా ఓ వ్యాపారి కుమారుడి నుంచి రూ. 3 కోట్లు ఇవ్వాలని అడిగారు. ఆ డబ్బులు చెల్లిస్తే తన అరెస్టును నివారించవచ్చని చెప్పారు. తనను రక్షించుకోవడానికి.. అతను చెప్పిన బ్యాంకు ఖాతాలో డబ్బును జమ చేశాడు. కొద్దిరోజుల తర్వాత అతడి నుంచి మరింత డబ్బు డిమాండ్ చేయడంతో సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించాడు.
Minister Seethakka : ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం
డబ్బు జమ చేసిన బ్యాంకు ఖాతా నుంచి 10 బ్యాంకు ఖాతాలకు నగదు బదిలీ అయినట్లు సైబర్ సెల్ దర్యాప్తులో తేలింది. అదే బ్యాంకు ఖాతాల ఆధారంగా హర్యానాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. దీని వెనుక పెద్ద ముఠా హస్తం ఉన్నట్లు సైబర్ సెల్ అనుమానిస్తోంది. అరెస్టయిన ఇద్దరిని విచారించి, మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాహుల్గాంధీని ఈడ్చుకెళ్లిన పోలీసులు.. ముక్కుకు గాయం?
-
China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
-
Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
-
Adluri Laxman : అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనిపించలేదా..!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!