Illicit Relationship: కోడి కత్తులతో విచక్షణారహితంగా దాడి.. యువకుడి దారుణ హత్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Illicit Relationship: వారు నలుగురు మంచి స్నేహితులు.. ఊరిలో ఎక్కడికి వెళ్లాలన్నా.. అందరూ కలిసే వెళ్లేవారు.. పార్టీలు చేసుకునే వారు.. కానీ ఆందులో ఒకరు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఇది ఎవరు చేశారనే దానిపై మిస్టరీ వారం రోజులపాటు కొనసాగింది. చివరికి ముగ్గురు స్నేహితులే ఒకరిని మట్టుబెట్టారని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. ఇంతకీ స్నేహితున్ని అంత దారుణంగా ఎందుకు చంపారు? దీనిపై శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
- Surya Kumar Yadav: కళ్లముందే విరాట్, రోహిత్ అవుటైనా తగ్గని సూర్య.. 55 బంతుల్లో 117 పరుగులతో వీరవిహారం..
- Shubman Gill: సచిన్, కోహ్లీ సరసన శుభ్మన్ గిల్.. భారత నాలుగో కెప్టెన్గా రికార్డు..
- IND-UK FTA: చౌకగా డిఫెండర్ కారు, సగం ధరకే విస్కీ.. జూలై 15 నుంచి అమలు..
శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం పెద్ద కోడిపల్లి గ్రామం. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ గ్రామంలో ఫిబ్రవరి 3న ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ హత్యతో ఒక్కసారిగా గ్రామంలో కలకలం రేగింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు షురూ చేశారు. హత్యకు గురయిన వ్యక్తిని లింగమయ్యగా గుర్తించారు. ఐతే వారం రోజుల తర్వాత ఈ కేసుకు సంబంధించిన మిస్టరీ వీడింది. హత్యకు ప్రధాన కారణం వివాహేతర సంబంధంగా గుర్తించారు.
అసలు విషయానికి వస్తే.. చనిపోయిన వ్యక్తి లింగమయ్య, మనోజ్, నవీన్, ప్రభాస్ నలుగురు స్నేహంగా ఉండేవారు. ఈ క్రమంలో లింగమయ్యకు మనోజ్కు వరుసకు చెల్లెలు అయ్యే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర బంధానికి దారి తీసింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా మనోజ్కు తెలిసింది. దీంతో లింగమయ్యను పలుమార్లు హెచ్చరించాడు మనోజ్. కానీ లింగమయ్య పెడచెవిన పెట్టాడు. మరోవైపు గ్రామంలో ఈ విషయం గురించి చర్చించుకోవడం అవమానంగా భావించిన మనోజ్.. లింగమయ్యను తుదిముట్టించాలని ప్రణాళిక వేసుకున్నాడు. ఈ విషయాన్ని స్నేహితులకు తెలియజేసి పక్కా ప్లాన్ రెడీ చేశాడు.
Anil Ambani: చిక్కుల్లో అంబానీ ఫ్యామిలీ.. అనిల్ అంబానీ భార్యకు ఈడీ సమన్లు..
అందరూ అనుకున్న పథకం ప్రకారం.. ఫిబ్రవరి మూడో తేదీన సాయంత్రం గ్రామ శివారులో ఈ విషయమే చర్చించాలని లింగమయ్యను అక్కడికి పిలిచారు. మనోజ్ ఈ విషయమే చర్చిస్తూ పథకం ప్రకారం తన వద్దనున్న కోడి కత్తులతో విచక్షణారహితంగా లింగమయ్య పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన లింగమయ్య అక్కడికక్కడే మరణించాడు. దీంతో అక్కడి నుంచి ముగ్గురు పారిపోయారు. ఈ విషయమై లింగమయ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరికి నిందితులను రొద్దం మండలం పెద్దమంతూరు వద్ద ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.
తాజావార్తలు
-
Good News : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. TGPSC నుండి మరో నోటిఫికేషన్
-
AP Government: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఈ నెల 13న ప్రారంభం..
-
Surya Kumar Yadav: కళ్లముందే విరాట్, రోహిత్ అవుటైనా తగ్గని సూర్య.. 55 బంతుల్లో 117 పరుగులతో వీరవిహారం..
-
Shubman Gill: సచిన్, కోహ్లీ సరసన శుభ్మన్ గిల్.. భారత నాలుగో కెప్టెన్గా రికార్డు..
-
CM Revanth Reddy : బీఆర్ఎస్ను మళ్లీ మొలకెత్తనీయం.. ‘కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని’ పాతాళానికి తొక్కుతాం
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!